
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Divvela Madhuri Sensational comments on Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కులాల చుట్టు తిరుగుతున్నాయి. ఇటీవల శ్రీకాకుళంలో దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు పెట్టారు. దీనిలో భాగంగా విచారణకు పోలీసులు పీఎస్ ను పిలిపించారు. ఈ క్రమంలో పెద్ద రచ్చ రాజుకుంది. దివ్వెల మాధురీ రోడ్డుపై కూర్చుని నానా హంగామా చేసింది. ఆ తర్వాత రాత్రి పూట దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు వదిలేశారు. మరోసారి పీఎస్ కు రావాల్సిందిగా చెప్పారు.
ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది తమ కాలింగ కులంపై చేసిన దాడి అని,తమను అణచి వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇటీవల పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన మీటింగ్ లో మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస్ పై మండిపడ్డారు. ఇతరులను దూశించి కులాన్ని మధ్యలో తీసుకొని రావడం ఏంటని, కులాలు ఇతరుల్ని దూశించాలని చెప్పాయా..?.. అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు దివ్వెల మాధురీ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ అధికారంలోకి ప్రజల కోసం ప్రశ్నిస్తానని వచ్చి ఇప్పుడు ఏంచేస్తున్నారని మండిపడ్డారు. పవన్ మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లను తిడుతుంటే ఇమ్యునిటీ వస్తుందన్నారు. కానీ తమ నాయకుడ్ని తిడితే ఊరుకొమని ఫైర్ అయ్యారు. మీ తల్లిని తిడితే మీకు ఇమ్యునిటీ వస్తుందేమో కానీ తమకు అలా కాదని సెటైర్లు వేశారు.
గతంలో కులాల ప్రస్తావన తెచ్చి ఓట్లు అభ్యర్థించింది మీరు కాదా అని ఏకీపారేసింది. ఎన్నికలకు ముందు ఒక మాటలు.. ఆ తర్వాత మరో మాటలు అంటూ దివ్వెల మాధురీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవన్ ను చూస్తుంటే.. వృద్దనారీ పతివ్రత అన్నసామెత గుర్తుకు వస్తుందన్నారు. వైసీపీ వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడింది.
Read more: Pawan kalyan: 11 సీట్లు కాదు.. ఒక్క సీటు వచ్చిన మీరు తగ్గొద్దు.!. వైఎస్ జగన్పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ప్రశ్నించిన వారిని అక్రంగా నిర్బందిస్తున్నారని, రెండెళ్లు ఏపీలో కూటమి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కర్మ సిద్దాంతం ఒకటి ఉంటుందని దానికి మూల్యం తప్పకుండా తీర్చుకొవాల్సిందే నంటూ పవన్ పై మండిపడ్డారు. రాబోయేదితప్పకుండా వైసీపీ పాలని అని వైఎస్ జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు. ఆ తర్వాత మీరు చేసిన అక్రమాల్ని బైటపెడతామని దివ్వెల మాధురీ పవన్ కళ్యాణ్ ను ఏకీపారేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.