
చదువు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం కోసం పెళ్లి, పిల్లలను వాయిదా వేస్తున్న వారి సంఖ్య భారత్లో పెరుగుతోంది. అయితే జీవనశైలి మారినా.. శరీర జీవశాస్త్రం మాత్రం మారదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా 35 ఏళ్లు దాటేలోపు ప్రతి జంట తమ సంతానోత్పత్తి సామర్థ్యం గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.మహిళల్లో 20 ఏళ్ల వయసులోనే ఫెర్టిలిటీ అత్యధికంగా ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. 35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య, నాణ్యత తగ్గడంతో గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. గర్భధారణ సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.పురుషుల ఫెర్టిలిటీ కూడా వయసుతో ప్రభావితమవుతుందని వైద్యులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వీర్యకణాల నాణ్యత, చురుకుదనం తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల సంతానోత్పత్తి సమస్యలను మహిళలకు మాత్రమే సంబంధించిన అంశంగా చూడకూడదని సూచిస్తున్నారు.ఇప్పటి జీవనశైలి కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోంది. అధిక ఒత్తిడి, నిద్రలేమి, ఊబకాయం, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, పీసీఓఎస్, మధుమేహం, థైరాయిడ్, హార్మోన్ల సమస్యల వంటి అంశాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందుకే 35 ఏళ్లు వచ్చేలోపు మహిళలు అండాశయ సామర్థ్యం, హార్మోన్ల పరీక్షలు చేయించుకోవడం, పురుషులు వీర్య పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి భవిష్యత్తును కచ్చితంగా చెప్పకపోయినా.. ముందుగానే సమస్యలను గుర్తించే అవకాశం కల్పిస్తాయని వివరిస్తున్నారు.కెరీర్, కుటుంబ జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకునేందుకు ప్రస్తుతం ఎగ్ ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్ వంటి ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో