
కొన్నిసార్లు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. భారత స్టార్టప్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కునాల్ షా విషయంలో కూడా అలాంటిదే జరిగింది.
ఒక ఈమెయిల్తో మొదలైన పరిచయం ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో ఒకదానికి ఆయన నాయకత్వ బాధ్యతల వరకు చేరింది.బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం.. మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ వాట్సాప్ భవిష్యత్తుపై వివిధ దేశాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారు. భారత్, బ్రెజిల్, మెక్సికో వంటి పెద్ద మార్కెట్లలో వినియోగదారుల అవసరాలు ఎలా మారుతున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కునాల్ షాకు మెయిల్ చేశారు. తర్వాత ఆయనతో మాట్లాడారు. ఆ సంభాషణలో ఆయన ఇచ్చిన సమాధానాలు మెటా నాయకత్వాన్ని ఆకట్టుకున్నాయి.మొదట సలహాలు అడగడానికి ప్రారంభమైన చర్చలు క్రమంగా మరో మలుపు తిరిగాయి. వాట్సాప్కు ఎలాంటి నాయకుడు అవసరమో తెలుసుకోవాలనుకున్న మెటా, చివరికి కునాల్ షానే ఆ బాధ్యతలకు సరైన వ్యక్తి కావచ్చని భావించింది. అనంతరం కొన్ని నెలల పాటు జరిగిన చర్చలు, సమావేశాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంది.భారత్లో స్టార్టప్ వ్యవస్థలో కునాల్ షాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్రీచార్జ్ను స్థాపించి విజయవంతంగా విక్రయించిన ఆయన తర్వాత క్రెడ్ను ప్రారంభించారు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల నుంచి రుణాలు, బీమా, సంపద నిర్వహణ సేవల వరకు సంస్థను విస్తరించారు. వందలాది స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టి యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకుడిగా నిలిచారు.మెటా దృష్టిలో కునాల్ షా ప్రత్యేకత ఆయన వ్యాపార అనుభవమే కాకుండా భారత మార్కెట్పై ఉన్న అవగాహన కూడా. ప్రపంచంలో వాట్సాప్కు