
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యాసంస్థలు ప్రారంభమయినప్పటికీ భక్తుల తాకిడి ఏ మాత్రం తిరుమలకు తగ్గలేదు. నిత్యం వేలాది మంది
భక్తులు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడికి తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి తిరుమల కొండపై నెలకొంది. వీకెండ్ లో అయితే రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. కాగా, తిరుమలలో తాజాగా ఆక్టోబస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. భక్తులు సైతం ఉత్కంఠగా వీటిని తిలకించారు.నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే తిరుమల కొండ పైన భద్రతా చర్యల్లో భాగంగా తాజాగా ఆక్టోపస్ దళం తిరుమల కొండపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఊహించని విధంగా ఉగ్రవాద దాడులు జరిగినా లేదా ఏదైనా అత్యవసర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా భక్తులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఎలా రక్షించాలి, వ్యూహాత్మకంగా శత్రువులను ఎలా అణచివేయాలి మరియు తక్షణమే ఎలా స్పందించాలనే అంశాలపై ఈ విన్యాసాలు జరిగాయి. అత్యంత అధునాతన ఆయుధాలు, అత్యాధునిక రక్షణ సామాగ్రితో సన్నద్ధమైన దాదాపు 50 మంది కమాండోల ప్రత్యేక సిబ్బంది ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం మరియు స్థానిక పోలీసుల సమన్వయంతో ఈ హై-ప్రొఫైల్ మాక్ డ్రిల్ ప్లాన్ చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగాఈ డ్రిల్ శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డూ పోటు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో నిర్వహించారు. ఏదైనా ఊహించని పరిస్థితి ఏర్పడితే బందీల విముక్తి చర్యలు మరియు ఉగ్రవాదులను ఏరివేసే వ్యూహాలను కమాండోలు ఆచరణాత్మకంగా ప్రాక్టీస్ చేశారు. ఈ భద్రతా విన్యాసాలు కేవలం అప్రమత్తతను పరీక్షించుకోవడానికే కాకుండా, తిరుమలకు వచ్చే సామాన్య భక్తులలో ఒక బలమైన ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపేలా సాగాయి.ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ఈ మాక్ డ్రిల్ ద్వారా స్పష్టం చేశారు. రానున్న బ్రహ్మోత్సవాలు మరియు పండగ రద్దీ రోజులను దృష్టిలో ఉంచుకుని, కొండపై భద్రతా కవచాన్ని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగానే ఈ ప్రత్యేక సాధనను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.