జనసేన పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి పనిచేసన జనసేన నేతలలు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం...
జనసేన పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి పనిచేసన జనసేన నేతలలు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి సమాచార సేకరణ కమిటీ'లను నియమించారు. తాజాగా ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమించగా.. వీరు ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరంతా పార్టీలో ఏ స్థాయిలో, ఏ బాధ్యతలు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారో వివరాలు సేకరిస్తారు. వీరికి సహాయకులుగా ముగ్గురు సీనియర్ నాయకులను, ముగ్గురు సాధకులు, 21 మంది సమన్వయకర్తలు ఉంటారు. సేకరించిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. వాటిని అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిశీలించిన తరవాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సేకరణ కమిటీలు - కేవలం పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, దరఖాస్తులను తీసుకోవడానికి పరిమితం అవుతాయి. ఈ కమిటీలు ఈ నెల 29వ తేదీ నుంచి తమ ప్రక్రియను ప్రారంభిస్తాయి.పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలకుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం వంశీకృష్ణ శ్రీనివాస్, విజయనగరం కొరికా రవికుమార్, విశాఖపట్నం కొణతాల రామకృష్ణ, అరకు కొణిదల నాగబాబు, అనకాపల్లి పెండెం దొరబాబు, అమలాపురం పంచకర్ల రమేష్ బాబు, కాకినాడ సామినేని ఉదయభాను, రాజమహేంద్రవరం కొటికలపూడి గోవిందరావు, ఏలూరు బత్తుల బలరామకృష్ణ, నరసాపురం పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), విజయవాడ కందుల దుర్గేష్, మచిలీపట్నం పిడుగు హరిప్రసాద్, గుంటూరు బొలిశెట్టి శ్రీనివాస్, నరసరావుపేట బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల దేవ వరప్రసాద్, ఒంగోలు కిలారు వెంకట రోశయ్య, నెల్లూరు బొమ్మిడి నాయకర్, తిరుపతి లోకం నాగ మాధవి, చిత్తూరు పత్సమట్ల ధర్మరాజు, రాజంపేట కళ్యాణ శివ శ్రీనివాస్, కడప చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు టి ఉదయ్ శ్రీనివాస్, నంద్యాల వల్లభనేని బాలశౌరి, హిందూపురం చిల్లపల్లి శ్రీనివాసరావు, అనంతపురం వేములపాటి అజయ కుమార్లకు బాధ్యతలు అప్పగించారు.