తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులలో సరికొత్త ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే యాత్రికులలో యువతులు, అందులోనూ జెన్-జీ తరం అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉంటున్నారని ప్రముఖ...
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులలో సరికొత్త ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే యాత్రికులలో యువతులు, అందులోనూ జెన్-జీ తరం అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉంటున్నారని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ 'రెడ్బస్' విడుదల చేసిన తాజా డేటా వెల్లడించింది. రాష్ట్రం నుంచి తిరుపతికి బస్సు టికెట్లు బుక్ చేసుకున్న మొత్తం మహిళల్లో 30 ఏళ్లలోపు వారు 48 శాతంగా ఉండటం ఈ మారుతున్న ట్రెండ్కు అద్దం పడుతోంది.తిరుమలలో నిర్వహించిన జ్యేష్ఠాభిషేకం ఉత్సవాల నేపథ్యంలో యాత్రికుల రద్దీ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే జూన్ 20తో ముగిసిన వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తిరుపతికి బస్సు బుకింగ్లు 22 శాతం వృద్ధి చెందాయి. తెలంగాణ నుంచి యాత్రలు ప్రారంభించేవారికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలవగా, ముఖ్యంగా ఎంజీబీఎస్, కూకట్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రయాణికులు అత్యధికంగా బయలుదేరుతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే మొత్తం ప్రయాణికులలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత వాటా 47 శాతంగా నమోదైంది. సాధారణంగా పెద్దవయసు వారే ఎక్కువగా తీర్థయాత్రల చేస్తారనే సంప్రదాయ స్వరూపం మారుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రయాణికులు సౌకర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం బుకింగ్స్లో 65 శాతం ఏసీ బస్సులు కాగా, 58 శాతం స్లీపర్ సర్వీసులు ఉండటం గమనార్హం.సాధారణంగా దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు చేసేవారిలో పురుషుల వాటా (సుమారు 65-69 శాతం) అధికంగా ఉంటుంది. అయితే, తెలంగాణకు సంబంధించిన తాజా గణాంకాలు యాత్రల్లో