
ఉదయం ఎంతసేపు బాత్రూమ్లో కూర్చున్నా ఉపశమనం లేకపోవడం.. కడుపు ఉబ్బరంగా అనిపించడం.. రోజులు గడిచినా సక్రమంగా మల విసర్జన కాకపోవడం.. ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
మలబద్ధకానికి కేవలం జీర్ణవ్యవస్థే కాదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లూ ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇవి సమస్యను పెంచొచ్చుమలబద్ధకాన్ని పెంచే ఆహారాల్లో ఫైబర్ తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు ముందుంటాయి. చీజ్, తెల్ల బియ్యం, వైట్ బ్రెడ్, వేపుళ్లు, ఆల్కహాల్, చిప్స్, పూర్తిగా పండని అరటిపండ్లు, చాక్లెట్, ఫాస్ట్ ఫుడ్ వంటి పదార్థాలు జీర్ణక్రియను మందగింపజేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే పేగుల్లో కదలికలు తగ్గి మలబద్ధకం తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉపశమనం ఇచ్చే ఆహారాలుమలబద్ధకం నుంచి సహజంగా ఉపశమనం పొందేందుకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఎండు ద్రాక్ష, అవిసె గింజలు, ఓట్మీల్, కివీ, పాలకూర, పియర్స్, చియా గింజలు, కాఫీ, చిలగడదుంపలు వంటి ఆహారాలు మలాన్ని మెత్తగా చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, నీటి శాతం, సహజ పోషకాలు పేగుల్లో కదలికలకు దోహదం చేస్తాయి.ఆహారంతో పాటు ఇవీ ముఖ్యంఆహారం మార్చుకోవడమే కాకుండా జీవనశైలిలో కూడా మార్పులు అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం, క్రమం తప్పకుండా నడక లేదా వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. చాలా సందర్భాల్లో మందుల కంటే ఆహారం, వ్యాయామం, తగినంత నీరు తీసుకోవడం వంటి అలవాట్లే మంచి ఫలితాలు ఇస్తాయని సూచిస్తున్నారు.గమనిక: ఈ సమాచారం అవగాహన