
ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో కీలక చర్చలు జరుగుతుండగానే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
లెబనాన్లోని ఇరాన్ అనుకూల గ్రూపుల కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని, లేదంటే గత వారం కంటే మరింత తీవ్రమైన సైనిక చర్య తప్పదని ఆదివారం స్పష్టం చేశారు.ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "లెబనాన్లో ఇబ్బందులు సృష్టిస్తున్న తమ ప్రాక్సీ గ్రూపులను ఇరాన్ వెంటనే ఆపాలి. అలా చేయని పక్షంలో, మేం గత వారం కంటే ఈసారి చాలా గట్టిగా ఇరాన్పై దాడి చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు, లెబనాన్ సహా ఇతర ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్కు చేరుకున్న సమయంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇరు దేశాల మధ్య ఈ నెల ప్రారంభంలో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అణు అంశాలు, హార్ముజ్ జలసంధి, లెబనాన్తో సహా పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణపై 60 రోజుల పాటు చర్చలు జరపాలని ఇందులో నిర్ణయించారు. అయితే, దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో స్విస్ చర్చలు ఆలస్యమయ్యాయి.లెబనాన్లో కాల్పుల విరమణను కాపాడే ప్రయత్నాలపై ఉపాధ్యక్షుడు వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఒప్పందాల అమలులో కొన్ని ఇబ్బందులు సహజమేనని, పరిస్థితి సున్నితంగా ఉందని అంగీకరించారు. అధ్యక్షుడు ట్రంప్ తమకు