Vivek Aggarwal FATF VP : అంతర్జాతీయ వేదికపై భారతదేశ దౌత్య, ఆర్థిక విధానాలకు ఒక భారీ విజయం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిధుల సరఫరా, మనీ లాండరింగ్, అక్రమ ఆర్థిక నెట్వర్క్లపై నిఘా ఉంచే...
Vivek Aggarwal FATF VP : అంతర్జాతీయ వేదికపై భారతదేశ దౌత్య, ఆర్థిక విధానాలకు ఒక భారీ విజయం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిధుల సరఫరా, మనీ లాండరింగ్, అక్రమ ఆర్థిక నెట్వర్క్లపై నిఘా ఉంచే అత్యున్నత అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వైస్ ప్రెసిడెంట్గా భారత సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఎఫ్ఏటీఎఫ్ చరిత్రలోనే ఒక భారతీయుడు ఈ అత్యున్నత స్థాయి పదవికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఆయన 2026 జూలై నుంచి 2027 జూన్ వరకు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ విజయం అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద నిధుల కట్టడికి భారత్ చేస్తోన్న నిరంతర పోరాటానికి దక్కిన అతిపెద్ద గుర్తింపు అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారికంగా కొనియాడింది.అసలెవరీ వివేక్ అగర్వాల్?వివేక్ అగర్వాల్ మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 1994 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న ఆయనకు.. ఆర్థిక నిర్వహణ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలసీ అమలులో అపారమైన అనుభవం ఉంది. 2025లోనే ఆయన మధ్యప్రదేశ్ కేడర్లో 'చీఫ్ సెక్రటరీ' గ్రేడ్కు ప్రమోట్ అయ్యారు. దీనికి ముందు ఆయన కేంద్ర రెవెన్యూ విభాగంలో అదనపు కార్యదర్శిగా పని చేయడమే కాకుండా.. అత్యంత కీలకమైన 'ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా' డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక నేరాలు, అంతర్జాతీయ నిధుల మళ్లింపును అడ్డుకోవడంలో ఆయనకున్న అపార నైపుణ్యమే ఈరోజు ఆయన్ను ఎఫ్ఏటీఎఫ్ అగ్రపీఠంపై కూర్చోబెట్టింది.పీఎం కిసాన్ సీఈఓగా..!వివేక్ అగర్వాల్ కెరీర్లో దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. 2019 నుంచి 2021 మధ్య కాలంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా, అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ పథకానికి, అలాగే నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సొసైటీకి ఆయనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించారు. దేశంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్లో కలెక్టర్గా పనిచేసిన సమయంలో.. అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, క్రిస్టల్ ఐటీ పార్క్, ఎస్ఈజెడ్ ఇండోర్, సూపర్ కారిడార్ ఇండోర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆయనే స్వయంగా స్థాపించారు. స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, పీఎం ఆవాస్ యోజన, మెట్రో రైల్ కార్పొరేషన్ వంటి భారీ ప్రాజెక్టులకు కమిషనర్గా, ఎండీగా వ్యవహరించి తన టాలెంట్ను నిరూపించుకున్నారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థిగా..!వివేక్ అగర్వాల్ చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీకామ్ , ఎల్ఎల్బీ డిగ్రీలను పూర్తి చేశారు. వీటితో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నుంటి ఇంటర్ అర్హత సాధించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై మరింత పట్టు సాధించేందుకు ప్రఖ్యాత 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' నుంచి గ్లోబలైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్పై ప్రత్యేక కోర్సు కూడా చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు, చట్టాలపై ఉన్న ఈ పట్టుతోనే ఆయన ఇప్పుడు ఎఫ్ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా ప్రపంచ వేదికపై భారత్ తరఫున సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.