
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు స్థాయుల నుంచి పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి సంకేతాలు, డాలర్ విలువ బలపడటంతో పసిడిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.2025లో 65 శాతం మేర భారీ లాభాలను ఆర్జించిన బంగారం, ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు సుమారు 5,602 డాలర్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు పసిడి ధర సుమారు 28 శాతం మేర పతనమైంది. జూన్ 20 నాటికి స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,150 నుంచి 4,170 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ అవుతోంది. కేవలం నెల రోజుల్లోనే పసిడి ధర 8 శాతానికి పైగా తగ్గడం గమనార్హం.ఈ ధరల పతనానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నిర్ణయాలు ప్రధాన కారణంగా నిలిచాయి. జూన్ 17 నుంచి 18 తేదీల్లో జరిగిన సమావేశంలో ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను 3.50 శాతం నుంచి 3.75 శాతం మధ్య స్థిరంగా ఉంచినప్పటికీ, భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలను ఇచ్చారు. అమెరికాలో ద్రవ్యోల్బణం 4.2 శాతం వద్ద కొనసాగుతున్నందున, ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని 19 మంది అధికారులలో 9 మంది అభిప్రాయపడ్డారు.ఫెడ్ నిర్ణయంతో అమెరికా డాలర్ ఇండెక్స్ 100 మార్కును దాటి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.6 శాతం మేర బలపడింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీలలో