ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ జేబీఎల్ భారత మార్కెట్లో రెండు కొత్త వైర్లెస్ హెడ్ఫోన్లను విడుదల చేసింది. జేబీఎల్ లైవ్ 780ఎన్సీ, జేబీఎల్ లైవ్ 680ఎన్సీ పేర్లతో వచ్చిన ఈ మోడళ్లు ప్రీమియం విభాగంలో సోనీ, సెన్హైజర్ వంటి సంస్థల ఉత్పత్తులకు పోటీగా నిలవనున్నాయి.
మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ సాంకేతికత, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ వంటి ప్రత్యేకతలతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ రెండు హెడ్ఫోన్లలో ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 2.0 సాంకేతికతను అందించారు. ఇది పరిసరాల్లోని శబ్దాలను గుర్తించి వాటిని సమర్థంగా తగ్గిస్తుంది.
ఫోన్లో మాట్లాడేటప్పుడు సౌండ్ క్లారిటీ కోసం కృత్రిమ మేధ ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థను అమర్చారు. లైవ్ 780ఎన్సీలో ఆరు మైక్రోఫోన్లు, లైవ్ 680ఎన్సీలో నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి.బ్యాటరీ సామర్థ్యం కూడా ఈ హెడ్ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
నాయిస్ క్యాన్సిలేషన్ను ఉపయోగించనప్పుడు గరిష్ఠంగా 80 గంటలు, ఉపయోగించినప్పుడు 50 గంటల వరకు పనిచేస్తాయి. కేవలం ఐదు నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్తో మరో నాలుగు గంటల పాటు వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.అంతేకాకుండా స్పేషియల్ సౌండ్ అనుభూతి, వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా సౌండ్ః సర్దుబాటు, హై క్వాలిటీ వైర్లెస్ ఆడియో, బ్లూటూత్ 6.0 ఒకేసారి రెండు పరికరాలతో అనుసంధానం వంటి సదుపాయాలను కూడా అందించారు.
బ్లాక్, బ్లూ, తెలుపు, షాంపేన్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ధరల విషయానికి వస్తే లైవ్ 780ఎన్సీ ధర రూ.15,999, లైవ్ 680ఎన్సీ ధర రూ.11,999గా నిర్ణయించారు
.