
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ముఖ్యంగా పరీక్షలకు ముందు అక్రమాలకు పాల్పడే ముఠాలు, టెలిగ్రామ్ గ్రూపులను ఉపయోగించి ఎగ్జామ్ పేపర్ లీకేజీలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే ఈ కఠినమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. పరీక్ష జరిగే సమయంలో కూడా టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్పై కూడా పరిమితులు విధించారు.
ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 100 కోట్లుగా ఉంది. ప్రపంంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేసిన టాప్ 5 యాప్లలో టెలిగ్రాం ఒకటి. ఇక భారతదేశంలో టెలిగ్రామ్కు 15 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో లక్షలాది మంది విద్యార్థులు కూడా భాగస్వాములై ఉంటారు.
అయితే వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ మధ్య తేడా ఏంటి అని చాలామందికి సందేహం కలగవచ్చు. నిజానికి టెలిగ్రామ్ ద్వారా గ్రూపుల్లో రెండు లక్షల మంది వరకు చేరే అవకాశం ఉంది అదే సమయంలో వాట్సాప్ గరిష్టంగా 1,000 మంది సభ్యులు మాత్రమే చేరడానికి వీలుంటుంది.
లక్షలాది మందిని ఒకే గ్రూపులో మంచి అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది అక్రమార్కులు ఈ గ్రూపులను ఉపయోగించి పరీక్షా పత్రాల లీకేజీ ఇతర అక్రమ కార్యక్రమాలకు టెలిగ్రామ్ గ్రూపులను ఉపయోగిస్తున్నారు. గతంలో పలు నేరాలకు సంబంధించిన విచారణలో టెలిగ్రామ్ గ్రూపులకు సంబంధించి సీరియస్ ఆరోపణలు వచ్చాయి.
టెలిగ్రామ్ ఫ్రీమియం మోడల్ను అనుసరిస్తుంది. అంటే ప్రాథమిక సేవలు ఉచితంగా అందిస్తూ, అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్లను విక్రయిస్తుంది. టెలిగ్రామ్ బిజినెస్ ఫీచర్లు, పబ్లిక్ ఛానెళ్లలో స్పాన్సర్డ్ మెసేజ్లు, ఇన్-యాప్ కొనుగోళ్లు TON ఎకోసిస్టమ్ ద్వారా కంపెనీ ఆదాయాన్ని పొందుతుంది.
మెంట్ పైనే టెలిగ్రామ్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
అయితే తాజాగా నీట్ ఎగ్జామ్ సందర్భంగా టెలిగ్రామ్ పైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఓవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. టెలిగ్రామ్ యాప్ ను ఆపినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభిస్తుందా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ మేరకు టెలిగ్రామ్ సీఈవో సైతం ఇదే తరహాలో ఎక్స్ ద్వారా స్పందించడం గమనార్హం. అక్రమార్కులు ఇతర యాప్స్ ఉపయోగించి కూడా తాము అనుకున్న పనులు చేసే అవకాశం ఉందని మరికొందరు నెటిజన్లు పాయింట్ అవుట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
వినియోగదారుల డేటాను విక్రయించడం కంటే, వినియోగదారుల పెరుగుదల, ప్లాట్ఫామ్ ఎంగేజ్