మెగా పవర్స్టార్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షోతో థియేటర్లలో రచ్చ లేపుతోన్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యం, అక్కడి ప్రజల ఆత్మగౌరవ పోరాటం, క్రీడల చుట్టూ సాగే భావోద్వేగమైన కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్ను దాటేసిన ఈ చిత్రం.. మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. థియేటర్లలో ఈ రేంజ్ రికార్డులు తిరగరాస్తున్న తరుణంలో, ఈ సినిమా డిజిటల్ విడుదలపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది.
ఇది ఓటీటీ ప్రియులకు పూనకాలు తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి.* నెట్టింట 'బాడీ కౌంట్' రచ్చ... ట్రోలర్స్ని మరింత రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ‘పెద్ది’ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి అన్ని ప్రధాన భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి డీల్ కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల జోరు బలంగా ఉండటంతో..
అన్నీ తగ్గాకే డిజిటల్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం జూలై మధ్యలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. నిజానికి, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా కోసం దాదాపు మూడున్నర గంటలకు పైగా ఫుటేజ్ను షూట్ చేశారు.
అయితే, థియేటర్లలో రన్టైమ్ ఎక్కువైతే ప్రేక్షకులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మొదట 3 గంటల 9 నిమిషాల నిడివితోనే రిలీజ్ చేశారు. ఈ క్రమంలో సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కత్తిరింపులకు గురయ్యాయి. ఇటీవల ఇందులో అప్పల సూరి పాత్రలో నటించిన
సీనియర్ నటుడు జగపతి బాబు కూడా తన నటనకు సంబంధించిన కొన్ని అద్భుతమైన సీన్లు కట్ అయ్యాయని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో దుమారం రేపింది. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన సీన్లపై కూడా ఇంటర్నెట్లో చర్చ నడిచింది. మరోవైపు రిలీజ్ అయ్యాక జాన్వీ కపూర్ సీన్లపై విమర్శలు రావడంతో కొన్నింటిని తొలగించారు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్పై లెంత్ పరిమితులు ఉండవు కాబట్టి, థియేట్రికల్ రన్లో డిలీట్ చేసిన ఆ సీన్లన్నింటినీ తిరిగి జోడించి ఎక్స్టెండెడ్ ‘డైరెక్టర్స్ కట్’ వెర్షన్ను స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 3 గంటల 25 నిమిషాల రన్టైమ్!నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. థియేటర్లలో ట్రిమ్ చేసిన కొన్ని కీలకమైన ఎమోషనల్, రొమాంటిక్ మరియు సెంటిమెంట్ సీన్స్ ఓటీటీ వెర్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రామ్ చరణ్ - జాన్వీ కపూర్ మధ్య వచ్చే లవ్ అండ్ కెమిస్ట్రీ సీన్లు, రామ్ చరణ్ - జగపతిబాబు మధ్య సాగే హై-వోల్టేజ్ డ్రామా మరియు జగపతి బాబుకు సంబంధించిన ఒక పవర్ఫుల్ సీన్ని ఓటీటీ వెర్షన్లో యాడ్ చేయనున్నారట. ఈ కంటెంట్ను తిరిగి యాడ్ చేయడం వల్ల ‘పెద్ది’ ఓటీటీ వెర్షన్ రన్టైమ్ ఏకంగా 3 గంటల 25 నిమిషాలకు చేరనుందని సమాచారం. దీనివల్ల కథలోని ఎమోషన్స్ వీక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అవుతాయని భావిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, స్టార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్తో అలరించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. థియేటర్ల తర్వాత డిజిటల్ స్క్రీన్లపై ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ఓటీటీ స్ట్రీమింగ్పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.