
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఎయిర్ కండిషనర్ల (ఏసీ) వాడకం సర్వసాధారణమైంది. అయితే, గంటల తరబడి ఏసీ గదుల్లో ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చర్మవ్యాధి, కేశ సంరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీలు గదిని చల్లబరచడానికి గాలిలోని తేమను పూర్తిగా తొలగిస్తాయి.
ఈ పొడి గాలి మన జుట్టు, తలపై ఉన్న సహజమైన తేమను కూడా లాగేయడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి.దీని ఫలితంగా జుట్టు పొడిబారి, నిర్జీవంగా తయారవుతుంది. వెంట్రుకలు పెళుసుగా మారి, చివర్లు చిట్లిపోవడం, త్వరగా విరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అంతేకాకుండా, తలపై చర్మం కూడా తేమను కోల్పోయి దురద, చుండ్రు, జుట్టు రాలడం వంటివి పెరిగే అవకాశం ఉంది. ఏసీల వాడకం వల్ల నేరుగా జుట్టు పెరుగుదల ఆగదని, కానీ అవి సృష్టించే పొడి వాతావరణం వెంట్రుకలను బలహీనపరుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. తలస్నానానికి ముందు కొబ్బరి, బాదం, రోజ్మేరీ వంటి నూనెలతో మర్దనా చేయడం మేలు. సల్ఫేట్ లేని, హైడ్రేటింగ్ షాంపూలు, కండిషనర్లు వాడాలి.
వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. పుష్కలంగా నీరు తాగడం, పుచ్చకాయ, కీరదోస వంటి పండ్లు తినడం కూడా అవసరం. ఏసీ గాలి నేరుగా తగలకుండా కూర్చోవడం, గదిలో తేమను పెంచడానికి హ్యూమిడిఫైయర్ వాడటం కూడా సహాయపడుతుంది.
సమస్య తీవ్రంగా ఉంటే చర్మవ్యాధి నిపుణులను