దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు.ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తనువు చాలించిన పలువురు విద్యార్థుల కుటుంబాలను ఆయన ఇటీవల పరామర్శించారు.
ఆయా కుటుంబాలన్నీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వ్యవస్థలోని లోపాలకు తమ పిల్లలు బలికావడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో మరే విద్యార్థి కూడా ఇటువంటి నిస్సహాయ స్థితికి గురికాకుండా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యవస్థలోని లోపాల వల్ల విద్యార్థుల జీవితాలు బలికావడం అత్యంత విషాదకరమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.నాగ్పూర్లో ఆత్మహత్యకు పాల్పడిన నీట్ విద్యార్థిని ఆకాంక్ష చతుర్వేది కుటుంబాన్ని అభిజీత్ పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
భవిష్యత్తులో మరే విద్యార్థి ఇటువంటి దుస్థితికి గురికాకుండా చూడాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు
.