Nita Ambani: నీతా అంబానీ అనగానే దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక శక్తిమంతమైన వ్యాపారవేత్తగా, దాతగా, క్రీడా రంగాన్ని శాసించే మహిళగా గుర్తుకు వస్తారు. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్యగానే కాకుండా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును, బ్రాండ్ను ఆమె సృష్టించుకున్నారు.
ఆ గుర్తింపునకు సజీవ సాక్ష్యమే రిలయన్స్ ఫౌండేషన్. అధికారం, సంపద కేవలం విలాసాలకే కాదు సమాజాంలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడే అద్భుతమైన ఆయుధాలని నిరూపించిన శక్తీ, స్ఫూర్తి నితా అంబానీ. దేశంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతకు సరికొత్త అర్థాన్ని ఇస్తూ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు.
ఈ ఫౌండేషన్ ద్వాదా ఓ 9 ఏళ్ల బాలికకు పునర్జన్మ లభించిన విషయాన్ని ఓ కార్యక్రమం వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచినట్లు గుర్తు చేసుకున్నారు నీతా అంబానీ.
సర్ హెచ్. ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించి ఆ పాపకు సాధారణ జీవితం ప్రసాధించారు. ప్రస్తుతం ఆ బాలిక అందరి పిల్లల మాదిరిగానే పాఠశాలకు వెళ్తోందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ గుర్తు చేసుకున్నారు.
ఆ బాలిక కథను పంచుకున్నారు.లావణ్య అనే 9 ఏళ్ల బాలిక తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కి వచ్చారని నీతా అంబానీ తెలిపారు. గుండె మార్పిడి ఒక్కటే ప్రాణాలు కాపాడే మార్గమని అక్కడి వైద్యులు తేల్చారు.
లావణ్య తండ్రి ఆమెను వదిలేసి వెల్లడంతో తల్లి ఒక్కతే ఆ భారాన్ని మోయాల్సి వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో లావణ్యకు క్లిష్టమైన గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. నెమ్మదిగా కోలుకున్న లావణ్య ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉందని నీతా అంబాని తెలిపారు.
. దీంతో చప్పట్లతో సభ మార్మోగింది.రోగులకు సేవ చేయడమే తమ ధర్మమని, ప్రతి హాస్పిటల్ ఒక దేవాలయం వంటిదని అన్నారు.దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందుబాటులోకి సరసమైన ధరల్లో తేవడమే తమ ఫౌండేషన్ లక్ష్యంగా చెప్పారు. నీతా అంబానీ మాట్లాడిన వీడియేను సర్ హెచ్. ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
పాఠశాలకు వెళ్తూ తన స్నేహితులతో సంతోషంగా ఆడుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించారు