
టెలిగ్రామ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా, మెసెజింగ్ ప్లాట్ ఫామ్ ను నిషేధించింది. వీటి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి కూడా. ఈ మేరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి.
దేశంలో నీట్ (NEET) పరీక్షల నిర్వహణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై మనదేశంలో తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 21న జరగనున్న రీ-నీట్ (Re-NEET) రాతపరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. పరిమితుల ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు, లీకేజీకి సంబంధించిన తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.జాతీయ పరీక్షల సంస్థ (NTA) చేసిన కీలక సిఫార్సుల మేరకు సమాచార సాంకేతిక చట్టం (IT Act) 2000లోని సెక్షన్ 69A కింద ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది.
గతంలో జరిగిన నీట్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన ఆరోపణలు, ప్రచారాలు టెలిగ్రామ్ గ్రూపుల వేదికగానే పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి పరీక్ష నిర్వహణ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే గట్టి నిఘా చర్యలు చేపట్టింది.టెలిగ్రామ్ యాక్సెస్, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్పై నిబంధనలుఈ నూతన తాత్కాలిక ఆంక్షల ప్రకారం టెలిగ్రామ్ వేదికపై ప్రభుత్వం రెండు రకాల నిషేధాలను విధించింది.
అందులో భాగంగా మొదటి నిబంధన కింద, భారత్లో టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ను ఒక నిర్ణీత వ్యవధి కొరకు పరిమితం చేయనున్నారు. ఈ నిషేధం 2026 జూన్ 22వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేశారు
టెలిగ్రామ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా, మెసెజింగ్ ప్లాట్ ఫామ్ ను నిషేధించింది. వీటి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి కూడా. ఈ మేరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి. దేశంలో నీట్ (NEET) పరీక్షల నిర్వహణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై మనదేశంలో తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగనున్న రీ-నీట్ (Re-NEET) రాతపరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. పరిమితుల ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు, లీకేజీకి సంబంధించిన తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.జాతీయ పరీక్షల సంస్థ (NTA) చేసిన కీలక సిఫార్సుల మేరకు సమాచార సాంకేతిక చట్టం (IT Act) 2000లోని సెక్షన్ 69A కింద ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో జరిగిన నీట్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన ఆరోపణలు, ప్రచారాలు టెలిగ్రామ్ గ్రూపుల వేదికగానే పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి పరీక్ష నిర్వహణ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే గట్టి నిఘా చర్యలు చేపట్టింది.టెలిగ్రామ్ యాక్సెస్, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై నిబంధనలుఈ నూతన తాత్కాలిక ఆంక్షల ప్రకారం టెలిగ్రామ్‌ వేదికపై ప్రభుత్వం రెండు రకాల నిషేధాలను విధించింది. అందులో భాగంగా మొదటి నిబంధన కింద, భారత్‌లో టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్‌ను ఒక నిర్ణీత వ్యవధి కొరకు పరిమితం చేయనున్నారు. ఈ నిషేధం 2026 జూన్ 22వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. విద్యార్థులు ఎలాంటి తప్పుడు సమాచారానికి గురికాకుండా ఉండడానికి ఈ అసాధారణ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇక రెండో నిబంధన కింద, టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే అప్‌లోడ్ చేసిన పాత సందేశాలను ఎడిట్ చేసుకునే ప్రత్యేక సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ నిలిపివేత నిబంధన 2026 జూన్ 30వ తేదీ వరకు వర్తించనుంది. పరీక్షలు పూర్తయిన తర్వాత పాత పోస్టులను అదనంగా ఎడిట్ చేసి, పేపర్లు ముందే లీక్ అయ్యాయంటూ తప్పుడు ఆధారాలు సృష్టించే వారిని నియంత్రించడమే దీని ప్రధాన ఉద్దేశం.గతంలో పరీక్షల ప్రక్రియ ముగిసిన అనంతరం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఎడిట్ ఆప్షన్‌ను దుర్వినియోగం చేస్తూ నకిలీ లీకేజీల సందేశాలను సృష్టించారు. తద్వారా విద్యార్థుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని, గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. దేశవ్యాప్త విద్యా పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకే ఈ తాత్కాలిక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితుల కారణంగా రాబోయే రీ-నీట్ పరీక్ష ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా పూర్తవుతుందని విద్యా శాఖ భావిస్తోంది.