
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఒక మాజీ సైనికుడి మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. సాధారణ బైక్ ప్రమాదంగా భావించిన ఈ ఘటన రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి పన్నిన దారుణ హత్యగా పోలీసులు స్పష్టం చేశారు.
ఈ కేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు వైద్యులు, ఫోరెన్సిక్ సిబ్బంది సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.ప్రమాదంతో మొదలై హత్యగా తేలిందిమాజీ సైనికుడు సందీప్ మంజర్గి మార్చి 13న బైక్పై నుంచి జారిపడి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అతని భార్య సుమ మంజర్గి, మొదట హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఘటప్రభలోని జేజీ ఆసుపత్రికి మార్చింది.
అయితే, మార్చి 15న సందీప్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదికలో కూడా ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, గుండెపోటు వల్లే మరణం సంభవించిందని పేర్కొన్నారు.సోషల్ మీడియా పోస్టుతో తిరిగిన కథప్రమాదంలో తీవ్ర గాయాలు కాకపోవడం ఆరోగ్యంగా ఉన్న సందీప్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంపై పోలీసులకు అనుమానం కలిగింది.
ఈ క్రమంలో సుమ ప్రియుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుండలీక్ దొంబార్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ కేసును కీలక మలుపు తిప్పింది. "ప్రమాదానికి గురైన వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు?" అంటూ తనకు అంతా తెలిసినట్లుగా అతను పోస్ట్ పెట్టాడు.
దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా
,