
దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఇవాళ షాక్ తగిలింది. నీట్ పేపర్ లీక్ అయిన రాజస్తాన్ లోని జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke)పై దాడి జరిగింది.
అభిజిత్ ను చుట్టుముట్టిన కొందరు ఆగంతకులు చెంపదెబ్బలు కొడుతూ దాడికి పాల్పడ్డారు
.