
Telangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంది. కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలోనే తరగతి గదులు వెలవెలబోవడంతో ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చాలా చోట్ల తక్కువ హాజరు నమోదు కావడానికి అమావాస్య సెంటిమెంట్ ప్రధాన కారణంగా నిలుస్తోంది. Read also: CM Revanth Reddy : కిషన్ రెడ్డి రాజకీయ కక్షపూరిత వైఖరి వల్లే మెట్రో ప్రాజెక్టుకు నిధుల ఇబ్బందులు : సీఎం రేవంత్ రెడ్డి అమావాస్య రోజున కొత్త పనులు మొదలుపెట్టకూడదు అనే బలమైన నమ్మకం సమాజంలో ఉంది.
ఈ కారణంగానే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఆసక్తి చూపలేదు. సెంటిమెంట్లను గౌరవించే క్రమంలో పిల్లల చదువును కూడా పక్కన పెట్టడం గమనార్హం. ఇలా మొదటి రోజే గైర్హాజరు కావడం వల్ల విద్యార్థులు పాఠశాల వాతావరణానికి అలవాటు పడడంలో ఆలస్యం జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం పాఠశాలలను అమావాస్య రోజున తెరవడం పట్ల కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముహూర్తాలు, తిథులు చూసే సంప్రదాయం ఉన్నప్పుడు, ఇటువంటి రోజుల్లో బడులు ప్రారంభించడం సరికాదని కొందరు తల్లిదండ్రులు వాదిస్తున్నారు.
ఈ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా పిల్లల చదువు విషయంలో మూఢనమ్మకాలకు తావులేకుండా చూడాలని పలువురు సూచిస్తున్నారు. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. CM Revanth Reddy : కిషన్ రెడ్డి రాజకీయ కక్షపూరిత వైఖరి వల్లే మెట్రో ప్రాజెక్టుకు నిధుల ఇబ్బందులు : సీఎం రేవంత్ రెడ్డి Hyderabad Metro Phase 2 Update: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana news: చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీతక్క
Hyderabad crime: విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి
Kavitha Boggubayi Yatra: సింగరేణి సమస్యలపై టిఆర్ఎస్ చీఫ్ కవిత బొగ్గుబాయి యాత్ర
Bhatti Vikramarka Birthday: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్