
ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తైన తరుణంలో.. పాలన ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు? అభివృద్ధి ఎంత? అవినీతి ఎంత? ఎంపీల పనితీరు ఎలా ఉంది? సమగ్ర సర్వేలో ప్రజా స్పందన ఎలా ఉంది? అనే వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండటంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ప్రజా ప్రతినిధుల జాబితా విడుదలైంది.ప్రముఖ సర్వే సంస్థ రైస్ (RISE - Research, Consulting, Management) 2026 ఏడాదికి గానూ నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి అధ్యయనంలో రాష్ట్రంలోని టాప్ 10 పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేల వివరాలను అధికారికంగా వెల్లడించింది.
నాయకత్వ పటిమ, ఫలితాల ఆధారిత ప్రజా సేవ, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండటం (Leadership, Performance, People First) వంటి ముఖ్యమైన సూచీలను ప్రాధాన్యతలోకి తీసుకుని ఈ సర్వేను నిర్వహించారు.అగ్రస్థానాల్లో బెజవాడ, నెల్లూరు, పాలకొల్లు నేతలు!ఈ ప్రతిష్టాత్మక సర్వే నివేదిక ప్రకారం.. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రథమ స్థానంలో నిలిచి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.
ఆ తర్వాతి స్థానంలో నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా, పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. అర్ధరాత్రి చింతమనేని వీరంగం.
నడిరోడ్డుపై ఊగిపోతూ, అరుస్తూ.. : Videoజాబితాలో నిలిచిన టాప్ 10 ఎమ్మెల్యేల పూర్తి వివరాలు:గద్దె రామ్మోహన్ - విజయవాడ తూర్పుకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - నెల్లూరు రూరల్నిమ్మల రామానాయుడు (మంత్రి) - పాలకొల్లుమద్దిపాటి వెంకటరాజు - గోపాలపురంపల్లా శ్రీనివాస్ - గాజువాకకె.
వెంకట ప్రసాద్ - కదిరిసుజనా చౌదరి - విజయవాడ పశ్చిమనందమూరి బాలకృష్ణ - హిందూపురంబేబీ నాయన - బొబ్బిలియరపతినేని శ్రీనివాస్ - గురజాలసుస్థిర ప్రగతి దిశగా అడుగులు NFHS-6: ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల ఆరోగ్య స్థితి? సర్వే చెప్పిన భయంకర
నిజాలు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి ఫలాలను ప్రజల దరికి చేర్చడంలో ఈ పదిమంది ఎమ్మెల్యేలు మిగిలిన వారికంటే ముందున్నారని రైస్ సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లట్ల ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిపారు.