
Disha Patani Net Worth: చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ (గాడ్ఫాదర్) లేకుండా, కేవలం స్వయంకృషితో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి దిశా పటానీ. కేవలం రూ.500లతో ముంబైలో అడుగుపెట్టిన ఆమె, నేడు కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1992 జూన్ 13న ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించిన దిశా పటానీ, తన కలలను నిజం చేసుకోవడానికి ముంబై వచ్చినప్పుడు ఆమె జేబులో కేవలం రూ. 500 మాత్రమే ఉన్నాయట. మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన ఆమె, నేడు రూ. 75 కోట్ల నికర విలువ కలిగిన ఆస్తులకు యజమానిగా నిలిచింది.
ప్రస్తుతం ఆమె వార్షిక ఆదాయం సుమారు రూ. 12 కోట్లుగా ఉంది. దిశా పటానీ లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్, ఖరీదైన కార్లపై పెట్టుబడిగా మారింది. ముంబైలోని ఖార్ వెస్ట్లో ఉన్న 'రుస్తోమ్జీ పారామౌంట్'లో దిశాకు రూ.6 కోట్ల విలువైన విలాసవంతమైన 4 BHK అపార్ట్మెంట్ ఉంది.
ఇది కాకుండా, బాంద్రాలో సముద్రానికి ఫేసింగ్తో ఉన్న మరో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఆమె సొంతం. దిశాకు కార్లంటే ఎంతో ఇష్టమున్న తన గ్యారేజీలో మెర్సిడెస్-బెంజ్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ6 వంటి పలు కోట్లు విలువ చేసే బ్రాండెడ్ కార్లు ఉన్నాయి.
దిశా పటానీ కేవలం సినిమాలపైనే కాకుండా వివిధ మార్గాల ద్వారా భారీగా సంపాదిస్తోంది. ఒక సినిమాలో నటించడానికి రూ.5 నుండి 7 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది. ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలలో నటించినందుకు సుమారు రూ.3 కోట్లు తీసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారమ్లలో బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి రూ.1 నుండి 1.5 కోట్ల వరకు వసూలు చేస్తుంది.
ప్రైవేట్ ఈవెంట్లు లేదా వివాహాలలో స్పెషల్ పెర్ఫార్మెన్స్ కోసం రూ.50 నుండి 75 లక్షల వరకు పారితోషికం అందుకుంటుంది. నటనతో పాటు, ఆమె
అనేక ఫిట్నెస్, ఫ్యాషన్ స్టార్టప్లలో కూడా పెట్టుబడులు పెట్టింది.
2015లో వరుణ్ తేజ్ సరసన 'లోఫర్' అనే తెలుగు చిత్రంతో నటిగా అరంగేట్రం చేసిన దిశా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2016లో వచ్చిన సూపర్ హిట్ 'ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి క్రేజ్ సంపాదించుకుంది. జాకీ చాన్తో కలిసి 'కుంగ్ ఫూ యోగా'(2017) అనే చైనీస్ యాక్షన్ కామెడీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 'బాఘీ 2', 'కల్కి 2898 ఏడీ', 'కాంగ్వా', 'మలంగ్', 'భారత్' వంటి అనేక ప్రతిష్టాత్మక చిత్రాలలో భాగమైంది.
ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది. దీనితో పాటు 'ఆవారప్పన్ 2' చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. జేబులో కేవలం రూ.500 లతో సాధారణ యువతిగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు దేశంలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన దిశా పటానీ జీవిత కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.