
గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (SVPIA)లో కస్టమ్స్ అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఒక భారీ గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్ ప్లాన్ను భగ్నం చేశారు. దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఒక ప్రముఖ ప్రైవేట్ ఎయిర్లైన్స్ విమానంలో ఎవరూ ఊహించని రీతిలో దాచి ఉంచిన సుమారు రూ.
4.27 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని అధికారులు శనివారం (జూన్ 13) స్వాధీనం చేసుకున్నారు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు స్మగ్లర్లు ఎంచుకున్న సరికొత్త మార్గం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది.కస్టమ్స్ నిఘా విభాగానికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు..
దుబాయ్ నుంచి వస్తూ అహ్మదాబాద్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం 6E-1478లో అధికారులు సోదాలు నిర్వహించారు. సాధారణ ప్రయాణికుల లగేజీలో కాకుండా, విమానంలోనే బంగారం దాచారన్న అనుమానంతో ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయం తీసుకున్నారు. విమానం ముందు భాగంలో ఉండే లూ (టాయిలెట్)ను అంగుళం అంగుళం తనిఖీ చేయగా..
అక్కడి గోడకు అమర్చిన సౌండ్ స్పీకర్ యూనిట్ లోపల అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. ఆ ఆడియో ప్యానెల్ను విప్పి చూడగా, నల్లటి ప్లాస్టిక్ టేపుతో చుట్టిన రెండు పౌచ్లు లభ్యమయ్యాయి. వాటిని విప్పి చూడగా.. అత్యంత నాణ్యమైన 999 ప్యూరిటీ గల 24 క్యారెట్ల విదేశీ మార్కింగ్ ఉన్న 24 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
వీటి మొత్తం బరువు 2,799.3 గ్రాములు (సుమారు 2.8 కిలోలు)గా తేలింది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 4.27 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులందరూ