
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Four dead in Morena Madhya Pradesh train accident due to fire accident rumours: మధ్య ప్రదేశ్ లోని ధోల్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రోజున చంబల్ నది వంతెన వద్ద .. ఖజురహో ఉదయ్ పూర్ ఇంటర్సీటీ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటుకుందనే తప్పుడు సమాచారం వ్యాపించడంతో ప్రయాణికులు భయపడిపోయారు. భయపడిన ప్రయాణికులు రైలు నుంచి దూకి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు పక్కన ప్లాన్ ఫామ్ మీద అప్పటికే వెళ్తున్న ఫిరోజ్ పూర్ సియోనీ పాతళ్ కోట్ రైలు కిందపడిపోయారు. దీంతో అక్కడికక్కడ వారంతా విగత జీవులుగా మారిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మోరెనా పరిధిలోని రైలులో మంటలు చెలరేగాయనే తప్పుడు సమాచారం వ్యాపించడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెల కొవడం వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. రైలు చైన్ లాగి ఆపివేశారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. Read more: IAF Plane Crash: అస్సాంలో ల్యాండింగ్ అవుతూ కూలిపోయిన ఐఏఎఫ్ విమానం.. రెండు ముక్కలైన AN-32! ఈ ఘటనలో ఆ మార్గంలోని రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ అసత్యప్రచారం చేయడం వల్ల నలుగురు స్పాట్ లోనే చనిపొవడం అందరిని తీవ్రంగా కలిచివేసింది. దీనిపై రైల్వే పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రయాణికుల్ని అందరిని ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొదట ఏ భోగిలో
రూమర్స్ వ్యాప్తి చేశారన్నదానిపై విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.