
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభానికి తెరదించే కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందని, ఆదివారమే సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే, ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తిరిగి తెరుస్తామని ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వెల్లడించారు."చారిత్రక ఒప్పందంపై రేపు సంతకాలు జరగనున్నాయి. ఆ వెంటనే హర్మూజ్ జలసంధి అందరి కోసం తెరుచుకుంటుంది" అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఒప్పందంలా కాకుండా, ఈ డీల్ కింద ఇరాన్కు ఎలాంటి నగదు చెల్లింపులు లేవని, అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇది బలమైన అడ్డంకిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2026 ప్రారంభంలో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే.సంతకాల తేదీపై ఇరాన్ భిన్న వాదనఅయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. చర్చలు తుది దశలో ఉన్నప్పటికీ, ఒప్పందంపై సంతకాల తేదీ ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొన్ని సాంకేతిక అంశాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, రాబోయే కొద్ది రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ తెలిపారు.పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం సఫలంఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు