
విమానంలో గంటల తరబడి ప్రయాణించి గమ్యస్థానం చేరుకునే సరికి చాలామంది చర్మం పొడిబారి, బిగుసుకుపోయినట్లుగా, కాంతివిహీనంగా మారుతుంది. దీనినే చర్మవ్యాధి నిపుణులు 'ఎయిర్పోర్ట్ స్కిన్' (Airport Skin) అని
వ్యవహరిస్తారు. విమాన ప్రయాణంలో తలెత్తే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చర్మంపై ఏర్పడే ప్రతికూల ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని వారు వివరిస్తున్నారు.ఆకియా ఈస్తటిక్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రుపికా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. విమాన క్యాబిన్లోని గాలిలో తేమ శాతం సాధారణంగా 10-20 శాతానికి పడిపోతుంది. దీనివల్ల చర్మం నుంచి తేమ వేగంగా ఆవిరైపోయి, సహజ రక్షణ పొరను కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. వీటికి తోడు ప్రయాణ ఒత్తిడి, నిద్రలేమి, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు సేవించడం, విమానాశ్రయ టర్మినల్స్లోని ఏసీ గాలికి ఎక్కువ సమయం గురికావడం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చుని ప్రయాణించే వారిపై అధిక ఎత్తులో సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై మచ్చలు ఏర్పడటంతో పాటు ఇతర చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.నివారణకు నిపుణుల సూచనలు'ఎయిర్పోర్ట్ స్కిన్' సమస్యను అధిగమించడానికి నిపుణులు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నారు. ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలోనూ పుష్కలంగా నీరు తాగాలి. కెఫిన్ అధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చర్మానికి రక్షణ కల్పించే హైలురానిక్ యాసిడ్, సిరమైడ్లు వంటివి కలిగిన మాయిశ్చరైజర్ను వాడాలి. ముఖ్యంగా పగటిపూట ప్రయాణించే వారు తప్పనిసరిగా సన్స్క్రీన్