
భారత షూటింగ్ దిగ్గజం, జాతీయ కోచ్ జస్పాల్ రాణా (49) శుక్రవారం హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు కనిపించినా.. చివరికి ‘కార్డియాక్ రప్చర్’ (గుండె
కండరం చిట్లడం) కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి అసలు కారణం ఇదేనని వైద్యులు స్పష్టం చేశారు.వివరాల్లోకి వెళితే, కొన్ని రోజుల క్రితం జస్పాల్ రాణాకు గుండెపోటు వచ్చింది. అయితే, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన ప్రయాణాలు కొనసాగించడంతో చికిత్స తీసుకోవడంలో మూడు రోజులు ఆలస్యమైంది. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటనే స్పందించి, పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిచేందుకు స్టెంట్ వేశారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించి, కోలుకోవడంతో డిశ్చార్జ్కు కూడా వైద్యులు సిద్ధమయ్యారు. కానీ, విధి మరోలా తలచింది. నిద్రలో ఉన్నప్పుడు ఆయనకు అకస్మాత్తుగా ‘కార్డియాక్ రప్చర్’ సంభవించి, ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు వచ్చిన తర్వాత ఆలస్యంగా చికిత్స తీసుకున్న రోగుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు వివరించారు.1976 జూన్ 28న జన్మించిన జస్పాల్ రాణా, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున అత్యధికంగా 15 పతకాలు (9 స్వర్ణాలు) సాధించి చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడలు, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లలోనూ పసిడి పతకాలతో దేశ కీర్తిని ఇనుమడింపజేశారు. కోచ్గా పారిస్ 2024 ఒలింపిక్స్లో మను భాకర్కు పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా