
భారత్లో అశాంతిని రేకెత్తించేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ మరో భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశవ్యాప్తంగా వరుసగా 'టార్గెట్ కిల్లింగ్స్'
చేసేందుకు ఉత్తర భారతదేశం సహా ఇతర ప్రాంతాల నుంచి షార్ప్షూటర్లను ఈ ముఠా రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు వెల్లడించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా ప్రముఖులను కాకుండా, స్థానికంగా పలుకుబడి కలిగిన సామాన్య పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోంది. వరుస హత్యల ద్వారా ప్రజల్లో నిరంతర అభద్రతా భావాన్ని, భయాందోళనలను కలిగించడమే వీరి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవచ్చనే హెచ్చరికలను పంపి, స్థానికంగా తీవ్ర గందరగోళం సృష్టించాలని వారు యత్నిస్తున్నారు.ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, యూపీ ఏటీఎస్, ఎన్ఐఏ సంయుక్తంగా దావూద్కు చెందిన ఉగ్రవాద ముఠాను ఛేదించిన కొద్ది రోజులకే ఈ కొత్త కుట్ర వెలుగులోకి రావడం గమనార్హం. పాకిస్థాన్ నుంచి దావూద్ ప్రధాన అనుచరుడు మున్నా జింగాడా (సయ్యద్ ముజాకిర్ ముద్దసర్ హుస్సేన్) ఈ కొత్త నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్నట్లు దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. పంజాబ్, ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి షార్ప్షూటర్లను నియమించుకుని, అధికారులకు అనుమానం రాకుండా వారిని సొంత రాష్ట్రాల వెలుపల దాడులకు పురమాయిస్తున్నట్లు తెలుస్తోంది.నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద-నేరపూరిత నెట్వర్క్ల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కొత్త నెట్వర్క్ ద్వారా ఎలాంటి హత్యలు జరిగినట్లు నిర్ధారణ కాలేదని,