
చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) వైద్య శాస్త్ర రంగంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. కణ స్థాయిలో మానవ బ్రెయిన్స్టెమ్ కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన
3డీ అట్లాస్ను ఆవిష్కరించింది. 'యాంకర్'గా నామకరణం చేసిన ఈ అట్లాస్, మెదడు సంబంధిత పరిశోధనలు, చికిత్సల కోసం అపూర్వమైన వనరుగా నిలవనుంది.మానవ శరీరంలో శ్వాస, హృదయ స్పందన, నిద్ర వంటి కీలక విధులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగాన్ని 'బ్రెయిన్స్టెమ్' అంటారు. ఈ ప్రాంతంలో తలెత్తే స్వల్ప సమస్యలైనా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఐఐటీ మద్రాస్లోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ 'యాంకర్' అట్లాస్... పిండం దశ నుంచి బాల్యం, వయోజన దశల వరకు మెదడులో చోటుచేసుకునే మార్పులను వివరిస్తుంది. ఇందులో 200కు పైగా బ్రెయిన్స్టెమ్ న్యూక్లియై, ఫైబర్ ట్రాక్టులను అత్యంత స్పష్టంగా 3డీ రూపంలో పొందుపరిచారు.జూన్ 5 నుంచి 7 వరకు ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో జరిగిన 3వ బ్రిక్స్ న్యూరోసైన్స్ సింపోజియంలో ఈ అట్లాస్ను అధికారికంగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, వైద్య నిపుణుల సౌకర్యార్థం దీనిని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో డిజిటల్ రూపంలో ఉచితంగా అందుబాటులో ఉంచారు.ఈ ఆవిష్కరణ న్యూరోబయాలజీ రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ప్రశంసించారు. ఎంఆర్ఐ, హిస్టాలజీ వంటి బహుళ ఫ్రేమ్వర్క్లను ఏకీకృతం చేస్తూ ఈ అట్లాస్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల సహకారం, ప్రైవేట్ భాగస్వామ్యం,