
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు గుండెపోటుతో అకాల మరణం చెందాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయి కిరణ్ (35) దుబాయ్లో మృతిచెందడంతో అతని
కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం సాయికిరణ్కు నాగలక్ష్మితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గతేడాది మే నెలలో ఆయన దుబాయ్కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా, ఈ నెల 2వ తేదీన తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.సాయికిరణ్ మరణ వార్తతో వడియారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు 'సీఎం ప్రవాసీ ప్రజావాణి'ని ఆశ్రయించారు. తమకు సహకరించి, మృతదేహాన్ని భారత్కు తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.