
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ కొన్ని రికార్డులు చూస్తే మాత్రం అభిమానులు అస్సలు నమ్మలేరు. సరిగ్గా అలాంటి ఒక నమ్మలేని నిజం ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. ఏసీసీ
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ కొన్ని రికార్డులు చూస్తే మాత్రం అభిమానులు అస్సలు నమ్మలేరు. సరిగ్గా అలాంటి ఒక నమ్మలేని నిజం ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ 2026 (ACC Women's T20I Premier Cup 2026) టోర్నమెంట్లో ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ జరిగింది.
ఇందులో యూఏఈ మహిళల జట్టు, సౌదీ అరేబియాకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రికెట్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన ఓటమి రుచిని సౌదీ అరేబియాకు చూపించింది. కేవలం ఐదే ఐదు బంతుల్లో మ్యాచ్ను ముగించి యూఏఈ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ స్కోర్కార్డ్ చూసి నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన సౌదీ అరేబియా జట్టుకు యూఏఈ బౌలర్లు చుక్కలు చూపించారు. యూఏఈ బౌలర్ల ధాటికి సౌదీ అరేబియా టీమ్ 15.3 ఓవర్లలో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. టీమ్లోని బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరు దాటలేకపోయారు. 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. సౌదీ అరేబియా కెప్టెన్ మషాల్ వకాస్ చేసిన 9 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సౌదీ అరేబియా నిర్దేశించిన 28 పరుగుల చిన్న లక్ష్యాన్ని చేధించడానికి యూఏఈ జట్టుకు అస్సలు టైం పట్టలేదు. మొదటి ఓవర్ ముగియక ముందే మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. సౌదీ అరేబియా బౌలర్ మహ్ నూర్ అమీర్ వేసిన మొదటి ఓవర్లోనే ఏకంగా 11 ఎక్స్ట్రాలు వచ్చాయి. ఇందులో 10 వైడ్లు, ఒక నో-బాల్ ఉన్నాయి.
దీంతో యూఏఈ పని చాలా ఈజీ అయిపోయింది. యూఏఈ కెప్టెన్ ఈషా ఓజా కేవలం 5 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 ఫోర్లు, 1 సిక్సర్తో దుమ్మురేపింది. ఆమె 15 పరుగులతో నాటౌట్గా నిలిచి 0.5 ఓవర్లలోనే జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించింది.
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో అత్యంత వేగంగా టార్గెట్ను ఛేజ్ చేసిన మ్యాచ్లలో ఒకటిగా ఇది రికార్డుకెక్కింది. గతంలో రవాండా జట్టు మాలీపై 7 పరుగుల టార్గెట్ను 4 బంతుల్లో ఛేజ్ చేసింది. అలాగే టాంజానియా జట్టు మాలీపై 12 పరుగుల లక్ష్యాన్ని 4 బంతుల్లో, థాయిలాండ్ జట్టు ఫిలిప్పీన్స్ పైన 10 పరుగుల టార్గెట్ను 4 బంతుల్లో పూర్తి చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో యూఏఈ కూడా చేరిపోయింది. సౌదీ అరేబియాపై 28 పరుగుల టార్గెట్ను కేవలం 5 బంతుల్లోనే ఫినిష్ చేసి యూఏఈ రికార్డ్ క్రియేట్ చేసింది.
సౌదీ అరేబియాపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా యూఏఈ ఉమెన్స్ టీమ్ అస్సలు తగ్గలేదు. ఒమన్తో జరిగిన తదుపరి మ్యాచ్లో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించింది. యూఏఈ బౌలర్లు మళ్లీ రెచ్చిపోవడంతో ఒమన్ టీమ్ 20 ఓవర్లలో 64/9 స్కోరు మాత్రమే చేయగలిగింది.
ఆ తర్వాత యూఏఈ కేవలం 6.4 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఈ టార్గెట్ను ఛేజ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ విజయాలతో, యూఏఈ జట్టు 4 పాయింట్లు, +10.525 నెట్ రన్ రేట్తో గ్రూప్-బి లో టాప్ పొజిషన్లో దూసుకుపోతోంది.
అసోసియేట్ దేశాల క్రికెట్ టీమ్స్కు ఈ ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఉమెన్స్ ఆసియా కప్కు క్వాలిఫై అవ్వడానికి ఒక మెయిన్ రూట్ లాంటిది. ఈ టోర్నమెంట్లో టాప్ ఫోర్ ప్లేస్లో నిలిచే జట్లు (సెమీఫైనలిస్ట్లు) నేరుగా 2026 మహిళల టీ20 ఆసియా కప్కు క్వాలిఫై అవుతాయి. ఈ టోర్నీలో గనుక ఈ టీమ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, ఆసియాలోనే బెస్ట్ ఇంటర్నేషనల్ టీమ్స్తో ఆడే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. ఇది వారి క్రికెట్ ఫ్యూచర్కు ఎంతగానో హెల్ప్ అవుతుంది.