ఐపీఎల్ బుల్లి డైనమైట్ వైభవ్ సూర్యవంశీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. క్రికెట్ మక్కా లార్డ్స్లో వైభవ్ సూర్యవంశీ డిస్కషన్ వచ్చింది. ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కామెంట్రీ
ఐపీఎల్ బుల్లి డైనమైట్ వైభవ్ సూర్యవంశీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. క్రికెట్ మక్కా లార్డ్స్లో వైభవ్ సూర్యవంశీ డిస్కషన్ వచ్చింది. ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కామెంట్రీ బాక్స్లో వైభవ్ సూర్యవంశీ చర్చ రావడం ఆసక్తికరంగా మారింది.ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు లార్డ్స్ వేదికగా సాగుతోంది. మొదటి రోజు వర్షం అడ్డంకిగా మారడంతో ఆటకు కొంత అంతరాయం కలిగింది. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు, కామెంట్రీ చేస్తున్న ఇయాన్ వార్డ్, నాసర్ హుస్సేన్, సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ గురించి చర్చించారు. ఇయాన్ వార్డ్ మాట్లాడుతూ భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీని టెస్టుల్లో ఓపెనర్గా ఆడించే అవకాశం ఉందన్నాడు. ఆ మాటలతో నాసర్ హుస్సేన్ నవ్వగా, ఆ పక్కనే ఉన్న సైమన్ డౌల్ మాత్రం చాలా సీరియస్గా స్పందించాడు. "టీమిండియాలో ఆడటానికి ఎంతో దూరంలో లేడు. 15 ఏళ్ల వయస్సులో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేయడం అసాధారణం. టోర్నమెంట్లో ఎన్నో అవార్డులు గెలిచాడు. అతడి ఆటను చూడటం అద్భుతంగా అనిపించింది. జట్టులో నుంచి ఎవర్ని తప్పిస్తారో తెలియదు కానీ, టీమిండియాలో వైభవ్కి చోటు కల్పించాల్సిందే" అని డౌల్ అన్నాడు. 2025లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ, తొలి సీజన్లోనే 35 బంతుల్లో సెంచరీ చేసి భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక 2026లో వైభవ్ విధ్వంసానికి రికార్డులన్నీ గల్లంతయ్యాయి. 776 పరుగులతో సీజన్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా అప్పటి వరకు ఉన్న గేల్ అత్యధిక సిక్సర్లను కూడా వైభవ్ దాటేశాడు. దాంతో వైభవ్ను టీమిండియాలోకి తీసుకురావాలనే వాదన తెరపైకి వచ్చింది. ఐపీఎల్ 2026 తర్వాత జరగనున్న బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం టీమిండియా తమ జట్లను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో ఆడే తొలి అవకాశం వస్తుందని అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు.