
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్ల కోచ్ లలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ఈ నెలలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర కోసం కోచ్ లు అవసరం కావడంతో ఇక్కడి నుంచి పంపుతున్నారు. దీంతో ఆయా రైళ్లకు (Vijayawada Memu Trains) ప్రస్తుతం ఉన్న అత్యాధునిక కోచ్ ల స్ధానంలో తాత్కాలికంగా పాత కోచ్ లు అమర్చబోతున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు.Satavahana Express: శాతవాహన ఎక్స్ ప్రెస్ కు ఓ తాత్కాలిక హాల్ట్..! విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ప్రస్తుతం పలు మెమూ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. విజయవాడ-ఒంగోలు, విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-గూడూరు మార్గాల్లో ఈ మెమూ రైళ్లు ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తాజాగా కొత్త ర్యాక్ లు అమర్చడంతో ప్రయాణికులు సంతోషంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి మళ్లీ పాత కోచ్ లలో ప్రయాణాలు చేయాల్సిన పరిస్ధితి కొన్ని రోజుల పాటు ఎదురుకానుంది. Vande Bharat Express: నెల్లూరులో వందే భారత్ టైమింగ్ మార్పు..!విజయవాడ-ఒంగోలు మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లు (67273, 67274)కు ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ఇలా పాత కోచ్ లు అమర్చబోతున్నారు. అలాగే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రైళ్లకు ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ, అలాగే మచిలీపట్న నుంచి విజయవాడ వచ్చే మెమూ రైళ్లకు ఈ నెల 11 నుంచి 31 వరకూ ఇలా పాత కోచ్ లు ఉంటాయి. వీటితో పాటు విజయవాడ నుంచి గూడూరు వెళ్లే మెమూ రైళ్లకు ఈ నెల 10 నుంచి 30 వరకూ, గూడూరు నుంచి విజయవాడ వచ్చే రైళ్లకు ఈ నెల 11 నుంచి 31 వరకూ ఇలా పాత కోచ్ లు కనిపిస్తాయి. అయితే వీటి ప్రయాణ సమయాలు, స్టాప్ లు అన్నీ యథావిధిగా ఉంటాయని అధికారులు తెలిపారు.