
చరిత్రగా మారిన కాలంలో నాప్రయాణాన్ని రికార్డు చేయాలని
సాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమాలికలు కడితే, ‘ఒహో పత్రికలు ఇలా ఉండేవా, వాటి నిర్వహణకు ఇంత కష్టపడేవారా’ అనేదయినా తర్వాతి తరాలవారికి అవగతమవుతుందనే ఉద్దేశమే ఈ పుస్తకాలకు నాంది. సాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. విషయంతో పాటు వారు రాసిన తీరు వల్ల కూడా అవి ప్రత్యేకంగా నిలిచాయి. ఆ అనుభవాల్ని ఇటీవల రెండు పుస్తకాలుగా వెలు వరించిన సందర్భంగా ఆయనతో సంభాషణ: మీ పాత్రికేయ అనుభవాలు, కెనడా ఉద్యోగ అనుభవాలను రాయడం వెనక మీ లక్ష్యం ఏమిటి? పాత్రికేయ అనుభవాలు అనడం కంటే సాహితీసంబంధమైన అనుభవాలనడం సమంజసం. విపుల, చతుర జంటపత్రికలు సాహితీలోకంలోనే ఓ వినూత్న ప్రయోగం. స్మార్ట్ఫోన్ల మాట అటుంచి కనీసం టీవీలు కూడా అందరికీ అందుబాటులోలేని కాలంలో అన్నివర్గాల పాఠకుల్ని విశేషంగా అలరించాయి. అవి పుట్టిన 28 ఏళ్లకు ఒకానొక సంధికాలంలో వాటికి సంపాదకబాధ్యతలు నిర్వర్తించాను నేను. అప్పటికి దాదాపు ఊపిరిసన్నగిల్లిన పత్రికల్లో క్రొన్నెత్తురు నింపి నిలబెట్టేందుకు నేను బృహత్యాగమే చేయాల్సివచ్చింది. ఆ జంటపత్రికలకు నేను రెండేళ్లపాటే సంపాదకత్వం వహించినా అందరూ మెచ్చే విధంగానే నా బాధ్యతల్ని నిర్వర్తించి బయటికొచ్చానని అనుకుంటున్నాను. కరోనా అనంతరకాలంలో ఆ పత్రికలకు కాలం చెల్లిపోయింది. చరిత్ర సృష్టించి, చరిత్రగా మారిపోయిన వాటి గురించిన ఒకానొక కాలాన్ని, అవి పునరుత్తేజం పొంది మళ్లీ పాఠకుల అభిమానాన్ని కొంతైనా పొందిన కాలాన్ని, వాటితో కలిసి సాగిన నా యానాన్ని రికార్డు చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆ పత్రికలు మూతబడ్డాక అది మరింత ప్రగాఢమయింది. నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమాలికలు కడితే, ‘ఒహో పత్రికలు ఇలా ఉండేవా