
బడి కోసం డొనేట్’ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి
Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

Paderu: అల్లూరి జిల్లాలో 87.71% పెన్షన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్ నిశాంతి! ఈ వార్తకు సంబంధించిన

కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్బీఐ వేసిన 7 శాతం అంచనాలను తలకిందులు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ తరహా ప్రతిభ కనబరచడం విశేషం. పటిష్టమైన దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు మరియు సేవల రంగం సాధించిన ప్రగతి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొలి త్రైమాసికంలో నమోదు అయిన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వేగం గణనీయంగా పుంజుకుంది. అయితే మునుపటి నాలుగో త్రైమాసికంలో నమోదు అయిన 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి రేటు కొంత మందగించినట్లు స్పష్టమవుతోంది. స్థిర ధరల ఆధారంగా భారత వాస్తవ జీడీపీ రూ. 81.36 లక్షల కోట్లకు చేరగా, నామమాత్ర జీడీపీ 10.3 శాతంతో రూ. 88.27 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో వాస్తవ జీవీఏ వృద్ధి రేటు 8.2 శాతాన్ని తాకి నికర పన్నుల కంటే సబ్సిడీల ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ప్రాథమిక రంగంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ ద్వితీయ మరియు తృతీయ రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించాయి. దీంతో సేవల రంగం 10.0 శాతం వేగంతో వృద్ధి చెందగా, ఫైనాన్షియల్ మరియు ఐటీ రంగాలు 12.1 శాతంతో సత్తా చాటాయి. ఇదిలా ఉండగా తయారీ రంగం 9.2 శాతం సాధించగా, స్థిర మూలధన నిర్మాణం అనగా పెట్టుబడుల వృద్ధి 11.9 శాతానికి చేరుకుంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 3.6 శాతానికి పరిమితం కాగా, గనుల త్రవ్వకం రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసి కాస్త ఆందోళన కలిగించింది. భారత

కోలీవుడ్ లో యోగిబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను పోషిస్తూ కథానాయకుడిగాను కొనసాగుతున్నాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన తమిళ సినిమానే 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'. అముత సారథి దర్శకత్వం వహించిన సినిమా ఇది. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ మరుసటి నెలలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే రీసెంటుగానే తెలుగులో అందుబాటులోకి వచ్చింది.యశోద (సితార) ఒక ఒంటరి మహిళ .. ఆమెకి మాటలు రావు. ఆమెకి పదేళ్ల వయసున్న ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే 'శబరి. అతనికి కూడా మాటలు రావు. అయితే అతనికి మాటలు రావాలనే బలమైన కోరికతో యశోద ఉంటుంది. అయ్యప్పస్వామి మాల వేస్తే మాటలు వస్తాయని కొంతమంది చెప్పడంతో ఆమె శబరికి మాల వేస్తుంది.దీక్ష పూర్తిచేయించి .. ఇరుముడి కట్టించి 'పులిమేడు' సన్నిధానానికి తీసుకొస్తుంది. శబరికి దాహంగా ఉండటంతో, అతనికి మంచినీళ్లు తీసుకురావడానికి యశోద వెళుతుంది. 'సన్నిధానం పోస్టాఫీస్' దగ్గర నిలబడిన అతను, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. శబరి కనిపించకపోవడంతో యశోద కంగారు పడిపోతుంది. తన కొడుకు కోసం కంగారుగా వెదకడం మొదలుపెడుతుంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను స్టేషన్ కి తీసుకు వెళతారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటం వలన ఆ కేసు నుంచి బయటపడటానికి ఆమెకి చాలా కాలం పడుతుంది. యశోద నుంచి తప్పిపోయిన శబరి ఎక్కడికి వెళతాడు? మాటలు రాని అతనిని ఎవరు ఆదరిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? జైలు నుంచి విడుదలైన యశోద తన కొడుకుని కలుసుకోగలుగుతుందా? అయ్యప్పస్వామి ఆ తల్లి కొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేరుస్తాడు? అనేది మిగతా కథ.అయ్యప్పస్వామి మహిమలకు సంబంధించిన

ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో రెండో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

ఒక దశకు చేరుకున్న తర్వాత హీరోయిన్లు పిల్లలు, ఫ్యామిలీకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఆ విషయం మరోసారి నయనతార(Nayanthara)తో ప్రూవ్ అయింది. ఆమె చాలా లేట్ వయసులో పిల్లలు కలిగారు. అది కూడా సరోగసీ ద్వారా. 40 ప్లస్ ఏజ్ లో కూడా ఆమెకి ఇంకా హెరాయిన్ గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఐతే, సినిమాలు ఒప్పుకునే విషయంలో మాత్రం ముందు తన పిల్లల గురించి ఆలోచిస్తాను అంటోంది. తన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ కాలం చెన్నైకి దూరంగా ఉండకుండా, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాల్లో లేదా వాటికి దగ్గరగా షూటింగ్ ఉండేలా చూసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లే సదుపాయం ఉంటుంది కదా. సినిమాలు ముఖ్యమే కానీ ప్రస్తుతం తనకు తన పిల్లలను పెంచడం, వారిని చూసుకోవడం మొదటి ప్రాధాన్యం అంటోంది. అందుకే, తాను సినిమాలు ఒప్పుకునే విషయంలో ఇవి చూసుకుంటోంది. ఆమె భర్త విగ్నేష్ శివన్ కూడా డైరెక్షన్ చెయ్యడం లేదు. ఆ మధ్య చేసిన ఒక మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికి వెళ్తున్నాడు. వీరిద్దరికీ ట్విన్స్ పుట్టారు…సరోగసి వల్ల. నయనతార ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న హిందీ చిత్రంలో నటిస్తోంది

హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో, 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో రహస్య తవ్వకాలు కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అక్రమ తవ్వకాల్లో 100 మీటర్ల పొడవైన రహస్య స్వరంగం బయటపడటంతో స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎంపీ ఓవైసీ సీరియస్గా స్పందించగా, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెంటనే పురావస్తు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పాన్,ఆధార్ వాట్సాప్లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే ! కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి! అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్, సాయిపల్లవి, దీపికా, అలియా భట్ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం. ఇండియా వైడ్గా టాప్ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండో స్థానంలో అలియాభట్ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ 4కి రావడం విశేషం. అయితే టాప్ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు ఆ పాటలు మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం ముమ్ముకుస్సు వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగన్జ్ సర్పంచ్ కూతురు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట అన్ఫైర్ లైఫ్ ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ గారు పాడటం మరొక సంచలనం. ఆమెతో కలిసి కీరవాణి గారు తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ చాయురంగ్. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాట పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈ పాట గురించి తెలిసిన వారంతా ఈ పాట కీరవాణి గారి మనసులో నుండి పుట్టుకు వచ్చిన పాటగా చెప్తున్నారు. దీనితో ఈ పాట ఏ స్థాయిలో ఉండబోతుందో అంటూ ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్పై కోలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ 'జియో హాట్స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్కు

లేడీ సూపర్స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). లేడీ సూపర్స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాను విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హాయ్ తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లెజెండరీ నటుడు భాగ్యరాజ్ నటించిన చివరి చిత్రం ఇదే కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్లో 'మగాడి జీవితం మూడు రకాలు.. ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, రెండు పెళ్లి చేసుకున్నాక ప్రేమించటం, మూడు అటు ప్రేమించలేక ఇటు పెళ్లి గాక బేవరసగా తిరగడం అంటూ భాగ్యరాజ్ తిట్టే సీన్ తో మొదలైంది. విష్ణుకు చిన్నతనం నుంచి అమ్మాయిల ప్రేమ దక్కడు. స్కూల్ నుంచి జాబ్ వరకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అతనిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక ఆ సమయంలోనే అతడి జీవితంలోకి దేవసేన వస్తుంది. కేవలం ఫ్రెండ్స్ గా కూడా లేని వారిద్దరికీ అనుకోకుండా కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారు. అసలు ఈ దేవసేన ఎవరు.. ? విష్ణు జీవితంలోకి ఎందుకు వచ్చింది.. ? ఆమె వచ్చాక విష్ణు జీవితం ఎలా మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వినోదం, సెంటిమెంట్. లవ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ ని బట్టి చెప్పొచ్చు. ముఖ్యంగా కవిన్ - నయన్ సీన్స్ చాలా బావున్నాయని టాక్ నడుస్తోంది. జెన్ మార్టిన్ మ్యూజిక్ చాలా

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో గిల్ రెండుసార్లు ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 16, రెండో ఇన్నింగ్స్లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బంతి లైన్ను పూర్తిగా కవర్ చేయడంలో గిల్ ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 42 మ్యాచ్లు ఆడిన గిల్ను లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏకంగా 11 సార్లు ఔట్ చేశారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్లో గిల్ ప్రత్యేకంగా లెఫ్టార్మ్ స్పిన్ను ఎదుర్కొన్నాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల బంతులను కూడా చాలాసేపు ఆడాడు. గిల్ సాధనపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ‘అతని ఆటలో సహజంగానే పరుగుల ప్రవాహం ఉంటుంది. పిచ్ పరిస్థితులు, బంతి వేగం, ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలా డిఫెన్స్ చేయాలనే విషయాలను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్లోనూ తన సహజ ఆటతీరునే

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నయనతార (Nayanathara) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2). 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుందర్.సి. ఇందులో నయనతారతో పాటు రెజీనా కాసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో రెజీనా, నయనతార, మీనా, కుష్బూ, తదితరులు ఉన్నారు. నయనతార పాత్రకు ఎదురు నిలిచే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఇప్పటివరకు కనిపించని డార్క్ అవతార్లో రెజినా సర్ప్రైజ్ చేయనుందట. దర్శకుడు సుందర్.సి ఆమె పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. రెజీనా కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ పాత్రల్లో ఇదొకటిగా నిలవబోతుందని తెలిసింది. గతంలో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, నెగెటివ్ షేడ్స్తో కూడిన ఈ క్యారెక్టర్లో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక నయనతార, రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్గా ఉంటాయని టాక్. దీంతో ‘మూకుత్తి అమ్మన్ 2’లో హీరోయిజంతో పాటు హీరోయిన్ వర్సెస్ యాంటీ హీరోయిన్ తరహా ఆసక్తికరమైన కాన్ఫ్లిక్ట్ను కూడా ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం. నయనతార స్టార్ పవర్కు రెజీనా డార్క్ పెర్ఫార్మెన్స్ తోడైతే ‘మూకుత్తి అమ్మన్ 2’ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రెజీనా ఏ రేంజ్లో తన పాత్రను పండించిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు టైటిల్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SVC63. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్కు ‘మాన్స్టర్’ (Monster) అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ వింటేనే బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే రేంజ్ వైబ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్కు సంబంధించి సినీ ప్రియుల మైండ్ బ్లాంక్ అయ్యే మరో బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) థియేట్రికల్ ప్రింట్లకు సల్మాన్ ఖాన్ ‘మాన్స్టర్’ టీజర్ను అటాచ్ చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు బిగ్ స్క్రీన్పై రజనీకాంత్ విధ్వంసం, దానికి తోడు సల్మాన్ ఖాన్ ‘మాన్స్టర్’ టీజర్ జతకలిస్తే థియేటర్లలో బాక్సాఫీస్ సునామీ రావడం ఖాయమని సినీ లవర్స్, ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే ఇద్దరు అతిపెద్ద మెగాస్టార్ల మాస్ పవర్ ఒకేసారి థియేటర్లలో కనిపించనుండటం సినీ వర్గాల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండటంతో నార్త్, సౌత్ అనే తేడా

హైదరాబాద్లోని ప్రముఖ చారిత్రక నేపథ్యం కలిగిన గోల్కొండ కోట వెలుపలి ప్రాకారంలో ఓ రహస్య సొరంగం బయటపడిందన్న వార్త తీవ్ర ఉత్సాహాన్ని, సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వార్త వెంటనే సోషల్ మీడియాలో వ్యాపించడంతో స్థానిక ప్రజలు, పర్యాటక ప్రేమికులు ఈ సొరంగాన్ని వీక్షించేందుకు గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయాల్లో కోట వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.హంతకుడే సంతాపం తెలిపినట్లు..దోపిడీ గురించి హరీష్ రావ్ చెప్పాలి!గోల్కొండలోని 18 సీడీ (అథర సీడీ) ప్రాంతంలో ఉన్న 400 ఏళ్ల పురాతన కుతూబ్ షాహీ స్మశానవాటిక, క్రీడా మైదానం వద్ద భారత సైన్యానికి చెందిన అధికారులు అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తవ్వకాలం క్రమంలోనే ఓ సొరంగం వెలుగుచూసినట్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడించారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ సొరంగం బయటపడిన విషయం గురించి గురువారం రాత్రి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.వివాదస్పద భూమి నేపథ్యం సొరంగం బయటపడిన 18 సీడీ లేదా అథర సీడీ ప్రాంతం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఆర్మీ అధికారులు ఆ స్థలాన్ని తమ ఆస్తిగా పేర్కొంటుండగా.. స్థానిక నివాసితులు దాన్ని స్మశానవాటికగా ఉపయోగిస్తూ ఖననాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాలా చబుత్ర నుంచి అథర సీడీ వరకు ఉన్న బహిరంగ ప్రాంగణాన్ని స్థానిక యువకులు క్రికెట్, గిల్లీ-దండా వంటి ఆటలు ఆడుకోవడానికి వినియోగిస్తుంటారు.ఇరాన్ - అమెరికా మధ్య ఒప్పందం.. భారత్ చేతిలోనే.. టెహ్రాన్ రాయబారి సంచలనంరహస్య మార్గాలు, చారిత్రక వదంతులు కాకతీయులు, కుతుబ్ షాహీల పాలన సాగిన గోల్కొండ కోట బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాభవం కలిగి ఉంది. ఈ కోట నుంచి చార్మినార్, గోషామహల్, చౌమహల్లా ప్యాలెస్, నౌబత్ పహాడ్ వంటి నగరంలో కీలక ప్రాంతాలకు భూగర్భ రహస్య మార్గాలు, సొరంగాలు ఉన్నాయని శతాబ్ధాలుగా ప్రచారం జరుగుతోంది. వీటిలో కొన్నింటిలో

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్, రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైనా శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో లంక జట్టు 206 పరుగులకే కుప్పకూలడంతో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పడిక్కల్ క్లాస్.. మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ అసాధారణ బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బతీశాడని, అతనికి భారత జట్టులో గొప్ప భవిష్యత్తు ఉందని కొనియాడాడు. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడంతో పాటు రెండో ఇన్నింగ్స్లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించిన పడిక్కల్ ఆటతీరు అమోఘమని గిల్ పేర్కొన్నాడు. పడిక్కల్ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తే జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులువవుతుందని వివరించాడు. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్బై..? రెండో ఇన్నింగ్స్ వికెట్ల పతనంపై క్లారిటీ.. 600వ టెస్టు సంబరం.. రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ వ్యూహాత్మక వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని కారణంగా ప్రత్యర్థి ముందు వీలైనంత వేగంగా 400 పైచిలుకు లక్ష్యం ఉంచాలనే ఆలోచనతోనే బ్యాటర్లు దూకుడుగా ఆడారని స్పష్టం చేశాడు. అప్పటికే మ్యాచ్ భారత్ నియంత్రణలోనే

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్మన్ గిల్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పుష్పా సక్సెస్తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్.. ‘RC17’లో హీరోయిన్గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ సినిమాలో కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్ను ఈ ప్రాజెక్ట్లో లీడ్ హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్, సారా అర్జున్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే ‘RC17’ స్క్రిప్ట్ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమాను గ్రాండ్గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన చేతి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించిన తర్వాత నవంబర్ 2026 నుంచి

గాలే క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపించాయి. దీంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, అప్పుడు శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు భారత యంగ్ ప్లేయర్. అద్భుతమైన బౌలంగ్ తో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ ను ముగించాడు. వర్షం పడటానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు, సుతార్ భారత్ టీమ్ కు అద్భుతమైన సెలబ్రేషన్స్ అందించాడు. విదేశీ గడ్డపై తనకు తొలి 6 వికెట్ల హాల్ అందించిన మ్యాచ్ విన్నింగ్ బంతిని తీసుకున్నాడు. కేషర నువాంతను క్లీన్ బౌల్డ్ చేసి భారత్కు 165 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు బ్యాటర్ల ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. ఎంతసేపు క్రీజులో నిలబడగలరు? అవుట్సైడ్ ఎడ్జ్ కాకుండా బంతిని ఎలా మిస్ చేయాలి? డిఫెన్సివ్ మైండ్సెట్తో రోజంతా బ్యాటింగ్ చేయడం సాధ్యమేనా? ఇవన్నీ ఆలోచిస్తేనే ఏ బ్యాటర్కైనా ఒత్తిడి పెరుగుతుంది. పాజిటివ్ నోట్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ధనంజయ డిసిల్వా, సోనాల్ దినూష మొదట్లో బాగానే నిలబడ్డారు. పిచ్పై స్పిన్కు పెద్దగా తిరుగుడు లేకపోవడంతో బ్యాటింగ్ చేయడం కాస్త ఈజీగానే అనిపించింది. రోజు ప్రారంభమయ్యే సమయానికి బంతి 34 ఓవర్ల పాతదిగా, కాస్త సాఫ్ట్గా మారింది. లంకకు ఇది కాస్త హోప్స్ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్లో కూడా 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో పాత బంతితోనే కోలుకున్నారు. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తే భారత్ను ఇబ్బంది పెట్టవచ్చని అనుకున్నారు. మొదటి గంటన్నర పాటు శ్రీలంక ప్లాన్ ప్రకారమే ముందుకు సాగింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ధనంజయ డిసిల్వా స్పిన్ను సరిగ్గా ఆడలేక రెండుసార్లు మాత్రమే పొరపాటు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో జడేజా బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తప్పు

శ్రీలంకపై తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. తన రెండో టెస్టులోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శన వెనుక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. శ్రీలంక పరిస్థితులకు త్వరగా అలవాటు పడేందుకు ఇంట్లోనే కూకాబుర్రా బంతితో సాధన చేసినట్లు సుతార్ వెల్లడించాడు.గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయానికి సుతార్ బౌలింగ్ ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో సుతార్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్లో మొత్తంగా 101 పరుగులకు 10 వికెట్లు సాధించాడు. రెండో టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల సుతార్కు ఇది అద్భుతమైన ప్రదర్శన.ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్ తర్వాత తన దృష్టంతా కూకాబుర్రా బంతికి అలవాటు పడటంపైనే పెట్టినట్లు సుతార్ తెలిపాడు. నెట్స్లోనే కాకుండా ఇంట్లో కూడా ఆ బంతితో సాధన చేశానని చెప్పాడు.‘‘క్రికెట్ను నేను చాలా సీరియస్గా తీసుకుంటా. రోజురోజుకూ మెరుగుపడటమే నా లక్ష్యం. శ్రీలంక సిరీస్కు ముందు వీలైనంత ఎక్కువగా కూకాబుర్రా బంతితో ప్రాక్టీస్ చేశా. ఇంట్లో, నెట్స్లో సాధన చేశా. ఇన్హౌస్ గేమ్స్పైనా దృష్టి పెట్టా’’ అని సుతార్ చెప్పాడు.టెస్టుకు 10 రోజుల ముందే భారత జట్టు శ్రీలంకకు చేరుకోవడం తనకు బాగా ఉపయోగపడిందని సుతార్ తెలిపాడు. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఆ సమయం ఎంతో

టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 10 వికెట్లు సాధించిన యువ స్పిన్నర్ మానవ్ సుతర్ టీమిండియా విజయంలో కీలక పాత్ర షోపించాడు. అతడి పాటు బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పటిక్కల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి.. భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెసింగ్ రూమ్ పరిస్థితులపై తాజాగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకోవడంలో సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. మీడియాతో రాహుల్ మాట్లాడుతూ...'దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లు తక్కువ సమయంలో అద్భుత ప్రదర్శన చేసి.. మంచి గుర్తింపు సంపాదించడం చూసి ఒక సీనియర్ ఆటగాడిగా నేను ఎంతో సంతోషించాను. భారత డ్రెస్సింగ్ రూమ్ ఒక స్వేచ్ఛా యుతమైన వాతావరణంగా ఉంటుంది. ఇక్కడ ఆటగాళ్లను స్వేచ్ఛగా మాట్లాడటానికి, వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అవకాశం ఉంటుంది. వయస్సుతో ఆడిన మ్యాచులతో సంబంధం లేకుండా తోటి ఆటగాళ్లకు సహాయం చేయడం ప్రతి ప్లేయర్ బాధ్యత అని నేను భావిస్తున్నాను' అని రాహుల్ అన్నాడు. 'కొన్ని సందర్భాల్లో మా జట్టులో సీనియర్ ప్లేయర్లు, తక్కువ మ్యాచులు ఆడిన జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. ఆ సమయంలో 'నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని సీనియర్ ఆటగాళ్లు , 'అతను చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడాడు కాబట్టి నేను వెళ్లి అతనితో మాట్లాడలేను' అని యువ ఆటగాళ్లు ఏదైనా చెప్పేందుకు సంకోచించరు. మా ఆటగాళ్ల మధ్య ఎటువంటి సిగ్గు లేదా అహంభావం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే... స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి రోజు ఆటలో 206 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 6/55తో చెలరేగిన సుతార్, మ్యాచ్ మొత్తంలో 10/131 వికెట్లు పడగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ భారీ విజయం సాధించినప్పటికీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. గత వారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, వారు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంకా 8 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుతో పాటు, నవంబర్లో న్యూజిలాండ్తో రెండు టెస్టులు, తదుపరి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆడిన 10 టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూసిన టీమిండియాకు ఇకపై ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లేకుంటే, భారత్ తన మిగిలిన 8 టెస్టుల్లో 7 గెలిస్తే 68.52 శాతంతో (PCT) మెరుగవుతుంది. ఒకవేళ 6 విజయాలు, 2 ఓటములు నమోదైతే ఆ శాతం 62.96కి పడిపోతుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలివే.. ఇరాన్కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్

Kothagudem: కార్మికుల హక్కుల సాధనకు అన్ని సంఘాలతో కలిసి పోరాటం: ఏఐటీయూసీ! ఈ వార్తకు సంబంధించిన


నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

యష్ కథానాయకుడిగా గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రధాన తారాగణం లుక్స్తో కూడిన పూర్తి పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ సినిమాలో నటీనటులు పోషిస్తున్న పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రంలో యష్ ‘రాయా’ మరియు అతని కుమారుడు ‘రూమి అలియాస్ టికెట్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ ‘నాడియా’ (రూమి తల్లి)గా, నయనతార రాయా సోదరి ‘గంగ’ పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో హుమా ఖురేషి ‘ఎలిజబెత్’గా, తారా సుతారియా ‘రెబెక్కా’గా, రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’గా కనిపించనున్నారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్ (టోనీ), డారెల్ డిసిల్వా (సాల్వడార్), సుదేవ్ నాయర్ (కర్మాడి), బాలాజీ మనోహర్ (భీర) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఇంగ్లీష్ ట్రైలర్ను ఈరోజు రాత్రి 8:30 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

India vs Sri Lanka: భారత్ గాలే టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. దినుషా 84, ధనంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్లో గాలే పిచ్పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత బౌలింగ్ లోతు ఫలించింది. మానవ్ సుతార్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. సుతార్ ప్రదర్శన ఈ మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ తరఫున శ్రీలంకపై టెస్టులో 10 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకలో భారత బౌలర్ అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాల్లో సుతార్ 10/131తో అగ్రస్థానంలో నిలిచాడు. శుభ్మన్ గిల్ ఈ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత్ తరఫున చాలా కాలం ఆడగల సామర్థ్యం అతడిలో కనిపిస్తోందని గిల్ పేర్కొన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. దేవదత్ పాదిక్కల్ 167 పరుగులు చేయడం ఆ స్కోరుకు ప్రధాన బలంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులకే పరిమితమైనా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్లో పిచ్ ఐదో రోజు వరకు ఆటకు అనుకూలంగానే ఉన్నా, మూడో రోజు నుంచి స్పిన్కు ఎక్కువగా సహకరించింది. పాదిక్కల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఎడమచేతి స్పిన్నర్లను ఎదుర్కోవడం కొంత సులభంగా అనిపించిందని చెప్పాడు. ఈ విజయంతో భారత్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (6/55) అద్భుతమైన బౌలింగ్తో చెలరేగడంతో టీమిండియా మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఖాతాలో 12 కీలక పాయింట్లను జమ చేసుకుంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం, గాలే స్టేడియానికి 50వ టెస్టు కావడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది.నేడు ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ విరామం తర్వాత శ్రీలంక బ్యాటర్లు సోనాల్ దినుష, కేశర నువంత కొద్దిసేపు భారత బౌలర్లను నిలువరించారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించిన దినుష (84) మరోసారి అద్భుతంగా ఆడి, రెండో సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమోననిపించింది.అయితే, యువ కెరటం మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 76వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సుతార్, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఆ ఓవర్లో దినుషను లెగ్ గల్లీలో ధ్రువ్ జురెల్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్యను క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ బంతిని లహిరు కుమార ఎదుర్కొన్నప్పటికీ

India vs Sri Lanka 1st Test : శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత జట్టు 165 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్లో భాగంగా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 462 పరుగులు చేసింది. శ్రీలంక 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 193 పరుగులు చేసి.. శ్రీలంక జట్టుకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, లంక బ్యాటర్లు లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. కేవలం 206 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక జట్టు ఓటమిలో టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక భూమిక పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పడగొట్టిన సుతార్.. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 10 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటర్లు భారీ పరుగులు చేయకుండా తన స్పిన్ మాయాజాలంతో అడ్డుకట్ట వేశాడు
తనకంటే దాదాపు 5 ఏళ్లు చిన్నవాడైన హీరోతో లేడీ సూపర్ స్టార్ నయనతార రొమాన్స్ చేసిన సినిమా హాయ్. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ సినిమాలో.. సీనియర్ నటులు రాధిక శరత్ కుమార్, ప్రభు, దర్శకులు కే భాగ్యరాజ్, అమృత శ్రీనివాసన్, వీటీవీ గణేష్, ఫెఫ్సీ విజయన్, సత్యన్, రెంజీ పనికేల్ తదితరులు నటించారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియో బ్యానర్లపై విఘ్నేష్ శివన్, నయనతార, జీ స్టూడియోస్ నిర్మించారు. విష్ణు ఎడవన్ ఈమూవీని డైరెక్ట్ చేశారు. హాయ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈసినిమాకు UA 13+ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేకుండా మోడరన్ రొమాన్స్, ఫ్యామిలీ వాల్యూస్తో ఫీల్ గుడ్ మూవీని రూపొందించారని సెన్సార్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు ఈసినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు (144 నిమిషాలు)కాగా.. స్క్రీన్ ప్లే లో ఎలాంటి సాగదీత లేకుండా గ్రిప్పింగ్గా ఉండేలా రన్ టైమ్ను సెట్ చేశారు. చెన్నైలోని ఒకే బిల్డింగ్లో నివసించే సాధారణ యువతి (నయనతార). అదే బిల్డింగ్ లో ఉండే యంగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి( కెవిన్). వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారుతుంది. అది కాస్తా వన్ సైడ్ లవ్ గా మారుతుంది. మంచి జాబ్ చేస్తోన్న కెవిన్.. నయనతార లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. ముందు అతను ప్రేమించడం మొదలుపెడతాడు. ఇక వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కారణంగా కథలో ఎలాంటి మలుపులు వస్తాయి? కెవిన్ తన ప్రేమను ఆమెకు చెపుతాడా? నయనతారతో కెవిన్ పెళ్లి జరుగుతుందా? అసలు ఈ విషయం వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు ఏమౌతుంది అనేది హాయ్ సినిమా కథ. ఈ సినిమా ఎమోషన్ ను

Watch: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్ ధ్రువ్ జురెల్ పట్టిన ఒక వివాదాస్పద క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ రాజేస్తోంది. లంక బ్యాటర్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు రెండుగా చీలిపోయారు. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. టీ బ్రేక్ తర్వాత లంక ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 22వ ఓవర్లో అసలు వివాదం మొదలైంది. భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన నాలుగో బంతిని లంక బ్యాటర్ లాహిరు ఉదార డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ బయటి అంచుని తాకుతూ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ వైపు వేగంగా దూసుకెళ్లింది. జురెల్ నేలకి అత్యంత సమీపంలో బంతిని అందుకోవడంతో భారత్ గట్టిగా అపీల్ చేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు మైదానంలో నిర్ణయం చెప్పకుండా థర్డ్ అంపైర్కు రీప్లే నివేదించారు. జూమ్ చేసి చూసిన రీప్లేలో బంతి నేలను తాకినట్లు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, థర్డ్ అంపైర్ దానికి అవుట్గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకటన రాగానే మైదానంలో భారత్ సంబరాలు చేసుకోగా, లంక అభిమానులు నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ క్యాచ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది టెక్నాలజీ వైఫల్యమని, శ్రీలంకకు అన్యాయం జరిగిందని కొంతమంది వాదిస్తుండగా అది పక్కా క్యాచ్ అని భారత అభిమానులు సమర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: IND vs SL: టీమిండియాది చెత్త ప్లానింగ్ అంటూ కామెంటర్ ఫైర్.. గాలే టెస్ట్లో భారత్ చేసిన తప్పు అదేనా? Dhruv Jurel takes the catch on bowling of Manav Suthar. 🇮🇳 — Maina Singh

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పై భారత్ పూర్తి పట్టు సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి కష్టాల్లో పడింది. విజయానికి టీమిండియా కేవలం 6 వికెట్ల దూరంలో నిలవగా, లంక గెలవాలంటే చివరి రోజు ఇంకా 288 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో నాలుగో రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలింగ్ ప్రారంభించిన భారత్కు పేసర్ మహమ్మద్ సిరాజ్, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన శుభారంభం అందించారు. సిరాజ్ తన బౌన్సర్తో నిషాన్ మదుష్క (6)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా, ఆ తర్వాతి ఓవర్లోనే మానవ్ సుతార్.. దినేష్ చండీమాల్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన పసిందు సూరియబండార (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ.. కమిందు మెండిస్ (2)ను కీపర్ క్యాచ్గా ఔట్ చేయడంతో శ్రీలంక 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ దశలో లహిరు ఉడార (16), కెప్టెన్ ధనంజయ డిసిల్వా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, మరోసారి బౌలింగ్కు వచ్చిన మానవ్ సుతార్ ఈ జోడీని విడదీసి తన రెండో వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సోనాల్ దినుష (25 నాటౌట్)తో కలిసి ధనంజయ డిసిల్వా (31 నాటౌట్) పోరాడటంతో

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన 'టాక్సిక్' సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అయితే ఈలోగా ఈ స్టార్ హీరోయిన్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూర్తి గుండుతో ఉన్న నయనతార ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది మంది వీటిని చూసి నయనతార నిజంగానే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిందనుకున్నారు. అయితే ఈ వైరల్ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. అదేంటంటే.. ఈ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి మార్ఫింగ్ చేశారు. గతంలో తిరుమలకు వెళ్లిన నయనతార పాత ఫొటోలను ఎడిట్ చేశారు నెట్టింట వైరల్ చేశారు. నయనతార ఈ ఏడాది ఏప్రిల్లో తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమలను సందర్శించారు. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నయనతార తెలుపు రంగు కుర్తా, లెగ్గింగ్స్తో పాటు ఆకుపచ్చ రంగు దుపట్టాలో కనిపించారు. అయితే అప్పటి ఫొటోలను తీసుకుని నయనతార తలనీలాలు సమర్పించినట్లుగా ఏఐ టెక్నాలజీతో మార్చి, ఆ వీడియో, ఫోటోలను నెట్టింట వైరల్ చేశారు. కాగా గతంలోనూ చాలా మంది హీరోయిన్ల ఫొటోలను ఇలాగే ఎడిట్ చేసి వైరల్ చేశారు కొందరు నెటిజన్లు. రష్మిక మందన్నా, అలియా భట్, రుక్మిణి వసంత్ తదితర స్టార్ హీరోయిన్ల ముఖాలు, శరీరాలను అశ్లీల ఫొటోలు, వీడియోలకు జోడిస్తూ డీప్ ఫేక్ విజువల్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నయనతార విషయంలోనూ అదే జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను నమ్మవద్దని అలాగే షేర్ కూడా చేయవద్దని నయనతార అభిమానులు కోరుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార నటించిన టాక్సిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.యశ్ ఇందులో హీరోగా నటించాడు. దీని తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రంలో నయనతార

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుతార్ ఒక పరుగు కోసం పరిగెత్తే సమయంలో పిచ్ మధ్య భాగంలో అడుగులు వేశాడని ధనంజయ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గాలే టెస్టులో కొత్త చర్చకు దారితీసింది. క్రికెట్లో బ్యాటర్లు సాధారణంగా హాఫ్ స్పైక్స్ ధరిస్తారు. పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల వారి బూట్ల ముద్రలతో ఆ ప్రాంతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్నే షేక్ చేసిన దిగ్గజాలు..! శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండటంతోనే ధనంజయ ఈ విషయంపై అంపైర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మ్యాచ్లో పిచ్ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని అంపైర్లు పరిశీలిస్తారు. పిచ్ను దెబ్బతీసేలా బ్యాటర్ ప్రవర్తిస్తే అంపైర్ తొలుత హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక మొత్తం ఇన్నింగ్స్కు వర్తిస్తుంది. ఆ తర్వాత అదే చర్య మళ్లీ జరిగితే, ఆ బంతికి వచ్చిన పరుగులను రద్దు చేసి ఫీల్డింగ్ జట్టుకు 5 అదనపు పరుగులు ఇచ్చే నిబంధన కూడా ఉంది. మ్యాచ్ పరిస్థితులు మాత్రం భారత్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గాలేలో శ్రీలంక ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్లో 300 పరుగులు కూడా చేయలేదు

టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన మైల్స్టోన్ 25వ చిత్రం కోసం దర్శకుడిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు చైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని చిత్రాలుగా ఇతర భాషల హీరోలతో పని చేసిన వెంకీ ఈసారి ప్రాపర్ తెలుగు హీరోతో ఓ వైవిధ్యమైన కథను తెరకెక్కించాలని భావిస్తున్నారు. గతంలో తాను రాసుకున్న అనేక కథలను ముందుగా నాగ చైతన్యకే వినిపించానని వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ కు లెనిన్ తో సూపర్ హిట్ ఇచ్చాడు నాగవంశీ. ఇప్పడు నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీని నాగవంశీ టేకప్ చేసి వెంకీ అట్లూరితో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నడట నాగవంశీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.నిర్మలా సీతారామన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అచంచలమైన శక్తితో దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు.ఈరోజు నిర్మలా సీతారామన్ పుట్టినరోజు కావడంతో ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. ఆపారమైన శక్తితో దేశ ప్రగతిని ఆమె ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు పెట్టారు. 'గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. దేశ ప్రగతికి మీరు అదే అంకితభావం, అవిశ్రాంత శక్తితో మార్గనిర్దేశం చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్కు మంత్రి నారా లోకేశ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రికి మంచి ఆరోగ్యం, సంతోషం, మరింత శక్తి లభించాలని దేవుడిని కోరారు. రాబోయే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని లోకేశ్ ప్రార్థించారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్కు అమ్మ దుర్గ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

3 కేసుల్లో 33.98 లక్షలు లూటీ.. నిర్మలా సీతారామన్ పేరుతో ఏఐ ప్రకటన హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. బాధితుల్లో ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఒక దినసరి కూలీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వాయిస్తో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాయి్సతో.. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) వీడియోను తయారు చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్పీఎఫ్) నుంచి రూ.3.85 లక్షలు దోచేశారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్, అధిక లాభాల గురించి వివరించాడు. పెట్టుబడి పెట్టడానికి సమ్మతించడంతో ఆధార్, పాన్, బ్యాంకు డిటెయిల్స్ తీసుకొని రిజిస్టర్ చేశారు. తర్వాత ప్రారంభంలో రూ.20వేలు మాత్రమే పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు డాలర్స్లో (యూఎ్సడీ) చూపించారు. ప్రారంభంలో మంచి లాభాలు అందుకున్న బాధితుడిని మెల్లగా ఇన్వెస్ట్ మెంట్ ఊబిలోకి దింపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి రూ.3.85 లక్షలు దోచేశారు. ఏపీకే ఫైల్స్తో రూ.30 లక్షలు.. ఏపీకే ఫైల్స్ పంపి.. వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. నగరంలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, మరో దినసరి కూలీ నుంచి రూ. 30 లక్షలు దోచేశారు. బుద్వేల్కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏపీకే ఫైల్ మెసేజ్ వచ్చింది. మీరు ఖాతాకు కేవైసీ అప్డేట్ చేయలేదని అందుకే ఖాతాను బ్లాక్ చేస్తున్నట్లు అందులో ఉంది. వెంటనే అప్డేట్ కోసం లింకును డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు ఆ ఫైల్ను ఇన్స్టాల్ చేశాడు. అంతే

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకీ అట్లూరి పలు కథలను నాగచైతన్యకు వినిపించినట్లు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస విజయాలతో వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫామ్లో ఉన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన తెలుగు కథతో ముందుకు రానున్నారు. ఇందుకోసం నాగచైతన్య సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా కథాంశం వైవిధ్యంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగవంశీ, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య 25వ సినిమా బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని అంశాలు కుదిరిన తర్వాత త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథ, కథనం మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం


గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల స్పష్టమైన ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కేవలం 90 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో సోనాల్ దినుష (100), నిరోషన్ డిక్వెల్లా (80) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అర్ధ శతకంతో రాణించిన డిక్వెల్లాను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేయడంతో ఈ కీలక భాగస్వామ్యం ముగిసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో ఆడిన సోనాల్ దినుష టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. గాలె పిచ్పై భారత స్పిన్నర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లంక ఇన్నింగ్స్ను దెబ్బతీశారు. మానవ్ సుతార్ 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్ మ్యాచ్లో పైచేయి సాధించింది

నయనతార (Nayanthara) గుండుతో ఉన్నట్లుగా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఆ ఫోటోలు నిజమైనవి కావు. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించినవిగా గుర్తించారు. వైరల్ అవుతున్న చిత్రాల్లో నయనతార గుడి బయట గుండుతో కనిపించడంతో, ఆమె తన రాబోయే చిత్రం టాక్సిక్ (Toxic) కోసం పూర్తిగా కొత్త లుక్లోకి మారిందా అనే చర్చ మొదలైంది. అయితే, ఈ చిత్రాల్లో ఉన్న AI వాటర్మార్క్ తో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి, ఈ ఫోటోలకు సంబంధించిన అసలు చిత్రాలు ఏప్రిల్ 2026లో నయనతార తిరుమలను సందర్శించినప్పటివి. ఆమె తన భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో తీసిన అసలు ఫోటోలను డిజిటల్గా మార్చి, నయనతార గుండుతో ఉన్నట్లుగా ఈ వైరల్ చిత్రాలను రూపొందించారు. టాక్సిక్ (Toxic) కోసం నయనతార గుండు చేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల స్పష్టమైన ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కేవలం 90 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో సోనాల్ దినుష (100), నిరోషన్ డిక్వెల్లా (80) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అర్ధ శతకంతో రాణించిన డిక్వెల్లాను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేయడంతో ఈ కీలక భాగస్వామ్యం ముగిసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో ఆడిన సోనాల్ దినుష టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. గాలె పిచ్పై భారత స్పిన్నర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లంక ఇన్నింగ్స్ను దెబ్బతీశారు. మానవ్ సుతార్ 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్ మ్యాచ్లో పైచేయి సాధించింది

గాలే వేదికగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 3, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంకపై భారత్ ఇంకా 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 460/9 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. నిషాన్ ఫెర్నాండో(0), లాహీరు ఉదారా(27), దినేశ్ చండిమాల్(4), కమిందు మెండిస్(14), ధనంజయ డిసెల్వా(21) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను సోనాల్ దినుశా, డిక్వెల్లా గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేశారా నువాంత(2), ప్రభాత్ జయసూర్య(10), లాహిరు కుమార(10) వరుసగా ఔటయ్యారు. గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే? శుభ్మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

శ్రీలంక , భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంక, భారత్ (IND vs SL) జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. చివరి వికెట్గా ప్రసిద్ధ్ కృష్ణ (2) పెవిలియన్కు చేరడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్కు ముగిసింది. టీమిండియా బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్(167) అద్భుత శతకంతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్(82), ధ్రువ జురెల్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. రిషబ్ పంత్ 39, యశస్వి జైస్వాల్ 31 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. రెండో బంతికే స్లిప్లో ఉన్న పడిక్కల్కు నిషాన్ క్యాచ్ ఇచ్చాడు. అలానే 7.1 ఓవర్లో 27 పరుగుల వద్ద దినేష్ చండిమల్(4) ఔటయ్యాడు. మానవ సుతార్ బౌలింగ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత రెండు రోజులు వర్షం కారణంగా దాదాపు 60 ఓవర్ల వరకూ ఆట రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ ఓ పావుగంట ముందుగానే మ్యాచ్ మొదలైంది. తొలి ఓవర్లోనే వికెట్ను కోల్పోయిన శ్రీలంక ఆ షాక్ నుంచి కాస్త తేరుకుంది. బ్యాటర్లు ఉదారా (22*), మెండీస్ (11*) మరో వికెట్ పడనీయకుండా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 47/2