
తెలంగాణలో సామూహిక సెలవు.. అందరూ ఈ ఒక్క రోజు సెలవు పాటించాలని పిలుపు
Telangana State Holiday: తెలంగాణలో పాత పెన్షన్ విధానం (OPS) అంశం మరోసారి చర్చకు వచ్చింది. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని CPS ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పాటించాలని CPSEU పిలుపునిచ్చింది. నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సెలవు పాటించాలని కోరింది. ప్రస్తుతం తెలంగాణలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న ఉద్యోగులు తమకు పాత పెన్షన్ విధానం కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే OPSను తిరిగి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో తన ఎన్నికల మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానం అమలుపై హామీ ఇచ్చిందని CPSEU పేర్కొంది. ఆ హామీని గుర్తు చేస్తూ నవంబర్ 17న సామూహిక సెలవు పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ రోజున ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతోంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన విషయాన్ని CPSEU ప్రస్తావించింది. అదే విధంగా తెలంగాణలో కూడా CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఉద్యోగుల భవిష్యత్తు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పాత పెన్షన్ విధానం అవసరమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాయి. ఇదే డిమాండ్తో ఉద్యోగులు ఇటీవల హైదరాబాద్లో మహాధర్నా కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 17న సామూహిక సెలవు పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. OPSపై ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల
