
TSCPSEU: నల్లగొండ జిల్లాలో సీపీఎస్ (CPS) రద్దు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) పిలుపునిచ్చింది. ఈ నెల 23న చేపడుతున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లాలోని గుర్రంపోడు, కనగల్, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాలలో గురువారం ఆవిష్కరించారు. TSCPSEU: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సీపీఎస్ (CPS) పింఛను విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) పిలుపునిచ్చిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని గుర్రంపోడు, కనగల్, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాలలో గురువారం 'చలో హైదరాబాద్' గోడ ప్రతుల (పోస్టర్) ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఉడావత్ లచ్చిరాం, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు భద్రయ్య, మురళి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. భాగస్వామ్య పింఛను విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానమే ఉద్యోగులకు నిజమైన భద్రత ఇస్తుందన్నారు. పెట్టుబడుల ఆధారిత పెన్షన్ ఉద్యోగులకు టెన్షన్ గా మారిందని అన్నారు. మార్కెట్లో మార్పులు వల్ల ఇప్పటికే సుమారు రూ. 1800 కోట్ల సొమ్ము ఉద్యోగులు నష్టపోయారని తెలిపారు ఆగస్టు 23న హైదరాబాద్లో చేపట్టే మహాధర్నా.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. భాగస్వామ్య పింఛను విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, పాత పింఛన్ విధానమే ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను ఇస్తుందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఉడావత్ లచ్చిరాం