
India vs Sri Lanka, Women's Asia Cup Final Live: 8వ టైటిల్పై కన్నేసిన భారత్.. లంకతో ఫైనల్ పోరుకు రెడీ..!
India vs Sri Lanka, Women's Asia Cup Final Live: 8వ టైటిల్పై కన్నేసిన భారత్.

India vs Sri Lanka, Women's Asia Cup Final Live: 8వ టైటిల్పై కన్నేసిన భారత్.

Director Srikanth Odela: ఏషనాగుల పాట డ్యాన్స్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్..


పుస్తకం, పెన్ను పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోలను జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ (Satya Sri) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారగా.. ప్రేమలేఖ రాస్తున్నావా? ఏంటి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

V. Srinivas Goud | ఉద్యోగుల చలో హైదరాబాద్కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం : మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా

అయోధ్యలోని రామమందిర పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై భారత వైమానిక దళ మాజీ అధికారి పర్యవేక్షించనున్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించింది. ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో అందరి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్ర మిశ్రాను 3 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులో నియమించారు. రామ మందిరం సీఈఓగా జితేంద్ర మిశ్రా ఆలయ పరిపాలన, రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షిస్తారు. మందిరానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతుల ఏర్పాటు ఆయన చూసుకుంటారు. అలాగే వివిధ విభాగాల బృందాల మధ్య సమన్వయం సాధించడం, ఆలయ ఆపరేషన్లకు సంబంధించిన పనులను నిర్వహించడం ఆయన బాధ్యతల్లో భాగం. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఈ కొత్త బాధ్యతలను సజావుగా నిర్వర్తించడానికి ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రామ్ మందిర్ సీఈఓ పదవికి లభించే ఖచ్చితమైన జీతం వివరాలను ట్రస్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సమయంలోనే, ఎంపికైన అధికారి వేతనం, ఇతర భత్యాలు పరస్పర ఒప్పందం ప్రకారం నిర్ణయిస్తామని ట్రస్ట్ తెలిపింది. అందువల్ల జితేంద్ర మిశ్రా నెలవారీ జీతం ఎంత అనే విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర మిశ్రాకు అయోధ్యలో నివసించడానికి అధికారిక నివాస సౌకర్యం లభిస్తుంది. అయోధ్యలోనే ఉంటూ ఆలయ రోజువారీ పనులు, పరిపాలనపై దృష్టి పెట్టడానికి ఈ వసతి సహాయపడుతుంది. అయితే ఆయనకు ఎలాంటి నివాసం కేటాయిస్తారు, దాని వివరాలు ఏంటి అనే విషయాలు ట్రస్ట్ ఇంకా బయటపెట్టలేదు. దీనితో పాటు జితేంద్ర మిశ్రాకు ప్రభుత్వ వాహనం, భద్రతా సిబ్బంది సదుపాయం కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉన్నతాధికారికి లభించే విధంగానే ఆయనకు కొన్ని ప్రత్యేక వీఐపీ సౌకర్యాలు లభిస్తాయి. ఈ సౌకర్యాలకయ్యే ఖర్చునంతా రామ్ మందిర్

మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్కు ఆతిథ్య హక్కులను జారీ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టాప్-6 టీమ్స్ తలపడనున్నాయి. అయితే తొలుత మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ప్రస్తుతం శ్రీలంక పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ ఐసీసీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో లంకకు బదులుగా టోర్నీని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ రూపంలో మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా ఐసీసీ బుధవారం భారత్కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది. జూలై 6 అర్హత కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్లో తమ స్థానాల ప్రకారం అర్హత సాధించిన ఆ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్లో పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్కు చేరుకుంటాయి. కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు తొలి చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి. Read: ఆసీస్తో సిరీస్కు పక్కనబెట్టారు.. కట్చేస్తే ట్రిపుల్ సెంచరీ కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్కు బదిలీ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)లో ప్రభుత్వ జోక్యం, కొనసాగుతున్న పరిపాలన సంక్షోభం కారణంగా ఈ మార్పు చేసినట్లు ఐసీసీ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. ఆసక్తికరంగా, 2025 మహిళల వన్డే ప్రపంచకప్ను భారత్ గెలుచుకున్న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.లంక బోర్డులో సంక్షోభమే కారణం వాస్తవానికి ఈ టోర్నమెంట్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డులో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాజ్యాంగ, పరిపాలన సంస్కరణల కోసం ఓ తాత్కాలిక 'ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ నియమిత కమిటీలను గుర్తించబోమని స్పష్టం చేసిన ఐసీసీ, ఆ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఎస్ఎల్సీ ప్రతినిధులను బోర్డు సమావేశాలకు దూరంగా ఉంచుతోంది. ఈ సంస్కరణలు పూర్తికాని నేపథ్యంలోనే టోర్నీని తరలించాలని నిర్ణయించినట్లు ఐసీసీ పేర్కొంది.శ్రీలంకకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశం కోసం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల నుంచి కూడా ప్రతిపాదనలు రాగా, అన్నింటినీ పరిశీలించిన అనంతరం ఐసీసీ బోర్డు భారత్ను ఎంపిక చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.మహిళల

మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది. స్పోర్ట్స్ డెస్క్: మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ(బుధవారం)ప్రకటించింది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ఈక్రమంలో ఈ టోర్నీ నిర్వహించేందుకు భారత్కు అవకాశం లభించింది. వాస్తవానికి టోర్నమెంట్ నిర్వహణకు బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలను ఐసీసీ ఆప్షన్లుగా పెట్టుకుంది. అయితే చివరకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్ను ఐసీసీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇవాళ(సెప్టెంబర్ 2) ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుంది. మ్యాచ్లు ముంబై, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఇక టోర్నీలో పాల్గొనే జట్ల అర్హతలను కూడా ఐసీసీ వెల్లడించింది. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడనున్నాయి. ఆ విధంగా చూస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నీకి దూరమైంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం: తిలక్ వర్మ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్ను డైరెక్టర్గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం

గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడినట్లేనని చాలామంది నమ్ముతారు. అయితే, అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు మాజీ టెక్కీల జీవితాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ నలుగురు తమ బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీరిలో మెటా మాజీ ఉద్యోగిని బ్రిట్నీ బాల్ (37) ఏడాదికి 180,000 డాలర్ల వేతనం అందుకునేవారు. గూగుల్లో పనిచేసిన జాసన్ జాంగ్ (25) వార్షిక వేతనం 200,000 డాలర్లకు పైమాటే. ఇక మైక్రోసాఫ్ట్లో 23 ఏళ్లు సుదీర్ఘ అనుభవం ఉన్న జో ఫ్రెండ్ (62) 250,000 డాలర్ల వేతనం అందుకుంటుండగా, ఇంటెల్లో అంతే కాలం పనిచేసిన శ్రీరామ్ రామకృష్ణ (57) 180,000 డాలర్ల వేతనం పొందేవారు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా లేఆఫ్కు గురవడం వీరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం వారు ఊహించిన దానికంటే అత్యంత కష్టతరంగా మారింది. బ్రిట్నీ బాల్ ఏకంగా 8,000కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీరామ్ రామకృష్ణ ఏడాది కాలంగా ఉద్యోగ వేట సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రిట్నీ తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడమే కాకుండా, జీవన వ్యయాన్ని తగ్గించుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుంచి వేరే

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు. బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్లో వైల్డ్ విలన్గా కనిపిస్తా. 20 ఏళ్లు

మొన్న సాదిక్ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు ఎరుపు రంగు దుస్తులతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి వేళ లడ్డూ గోపాలుడి అలంకరణ కోసం వెండి ఆభరణాలు లేదా వస్తువులను ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల బాల వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు పొందొచ్చు. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి రోజున లడ్డూ గోపాలుడిని లహరియ(అలల వంటి లేదా చారల) డిజైన్ కలిగిన వస్త్రాలతో అలంకరించాలి. ఇలాంటి అలంకరణ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కన్నయ్యకు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మదినోత్సవం రోజున బాల గోపాలుడిని తెల్లని దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణా జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని పచ్చని రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీకు కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడిని కుంకుమ రంగు(కాషాయం వంటి) రంగు వస్త్రాలతో అలంకరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి

కన్నడ స్టార్ నటుడు, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ తన పుట్టినరోజున అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న భారీ చారిత్రక చిత్రానికి 'దేవరాయ' అనే టైటిల్ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్తో కూడిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో సుదీప్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రాజసంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా సుదీప్ తన సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో ద్వారా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టైటిల్ వీడియోలో సుదీప్ లుక్ అత్యంత గంభీరంగా, రాజసం ఉట్టిపడేలా ఉంది. తలపై కిరీటం, మెడలో ముత్యాల హారాలు, ఇతర రాజాభరణాలతో ఆయన ఆహార్యం ఆకట్టుకుంటోంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం ఈ వీడియోకు మరింత బలాన్ని చేకూర్చింది."చరిత్రను మలుపుతిప్పిన సామ్రాజ్యం, ఒక శకాన్ని నిర్మించిన రాజు, కాలానికి అతీతంగా నిలిచిన లెజెండ్" అనే శక్తివంతమైన వాక్యాలతో చిత్ర బృందం 'దేవరాయ' పాత్రను పరిచయం చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీకృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్ఠలకు అద్దం పడుతున్నాయి. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే సుదీప్, ఈ చారిత్రక పాత్ర కోసం అద్భుతంగా రూపాంతరం చెందారని ఫస్ట్ లుక్ను చూస్తేనే అర్థమవుతోంది.ఈ భారీ చారిత్రక చిత్రాన్ని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి

టాలీవుడ్లో రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో నాని నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) ఒకటిగా నిలుస్తోంది. నాని(Nani) కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. రిలీజ్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై హైప్ను మరింత పెంచుతోంది. నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా కొంత పెట్టుబడి తిరిగి వచ్చినప్పటికీ, అసలు ఛాలెంజ్ మాత్రం థియేట్రికల్ మార్కెట్లోనే ఉండబోతోంది. ఇప్పటివరకు నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ స్థాయి భారీ బడ్జెట్ను రికవర్ చేయాలంటే ఇతర భాషల్లో కూడా సినిమా సత్తా చాటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో మంచి కలెక్షన్లు సాధించడం కీలకం కానుంది. గతంలో నాని తన సినిమాలను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసినప్పటికీ, తెలుగు కాకుండా ఆశించిన స్థాయి కమర్షియల్ ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో ది ప్యారడైజ్ నానికి కొత్త మార్కెట్ను తెరిచే సినిమాగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ పెట్టుబడి, పెరిగిన అంచనాలు, పాన్ ఇండియా టార్గెట్తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ నాని కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. తెలుగు మార్కెట్ను దాటి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితేనే ఈ భారీ ప్రాజెక్ట్కు నిజమైన కమర్షియల్ సక్సెస్ దక్కే అవకాశం ఉంది

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్తో జరిగే టీ20 సిరీస్కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ

సన్న వడ్లకు రూ.500 బోనస్.. తెలంగాణ రైతులకు భారీ ఊరట రూ.8 లక్షల కోట్ల అప్పులు.. కాంగ్రెస్ పాలనపై పొంగులేటి ఫైర్ బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే.. పొంగులేటి సంచలన ఆరోపణలు Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని తమకు అప్పగించినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపిందని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 1000 రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించిందని తెలిపారు. రాజకీయ బేషజాలకు వెళ్లకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత పాలనలో పేరుకుపోయిన సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ : వ్యవసాయ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రోత్సాహకాలతో తెలంగాణ వరి ఉత్పత్తి పంజాబ్ను మించి రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు. Read Also : Vivo T5 Launch : బడ్జెట్లో బిగ్ బ్యాటరీ బీస్ట్.. 50MP కెమెరా, 7050mAh బ్యాటరీతో ఈ వివో 5G ఫోన్ దుమ్మురేపుతోంది! ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టామని అన్నారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meat shops closed in Hyderabad city on September 4: ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం. ఈనెలలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. అయితే.. సెప్టెంబర్ 4న మనం జన్మాష్టమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తారు. పలు చోట్ల దహి హండీ ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తారు. తమ పిల్లలకు చిన్నారి శ్రీకృష్ణుడు, రాధలా కాస్ట్యూమ్ లు వేసి పొంగిపోతారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసంతో రాత్రి వేళ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అష్టమి, రోహిణి తిథి ఉండేలా చూసుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న చికెన్, మటన్ అమ్మకాలపై ఒక రోజు నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Read more: Konda Surekha: నన్ను ఎవరు పిలువలేదు.. నేనే వచ్చా... ఉత్కంఠ వేళ కొండంత ట్విస్ట్ ఇచ్చిన మంత్రి సురేఖ..! ఈ మేరకు రిటైల్, చికెన్, మటన్ షాపులు, పశువధ శాలలన్ని మూసి వేసి ఉంచాలని అధికారులు తెల్చి చెప్పారు. ఎవరైన రహస్యంగా మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Janmashtami 2026 Famous Temples: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భక్తులు భారతదేశం అంతటా ఉన్న ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలను సందర్శిస్తుండటంతో, జన్మాష్టమి 2026ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జన్మాష్టమి భారతదేశంలోని అత్యంత ఆనందకరమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన పండుగలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ముస్తాబవుతాయి. అందమైన అలంకరణలు, గుంపులు గుంపులుగా తరలివచ్చే భక్తులు, గాలిలో మారుమోగే భజనలు, మీరు ఊహించిన దానికంటే చాలా సేపటి వరకు సాగే అర్ధరాత్రి వేడుకలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ సమయంలో మీరు కృష్ణ దేవాలయాన్ని సందర్శించగలిగితే, అది మీ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన అనుభూతిగా మారుతుంది. దైవ ఆశీస్సుల కోసం మీరు తప్పక సందర్శించవలసిన 7 ప్రసిద్ధ ఆలయాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 1) బాంకే బిహారీ దేవాలయం (బృందావన్) బృందావన్కు అనేక విధాలుగా ఇది ఒక కిరీటం వంటిది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలలో ఒకటి, జన్మాష్టమి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడి భక్తి శక్తి ఉప్పొంగే విధానాన్ని వర్ణించడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు. 2) కృష్ణ జన్మభూమి ఆలయం (మథుర) ఇది శ్రీకృష్ణుని అసలైన జన్మస్థలం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ జన్మాష్టమి జరుపుకోవడం అనేది ఇతర ఆలయాలు సరిపోల్చలేని ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం కృష్ణుడు జన్మించాడని చెప్పే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ప్రధాన పూజలు

కేజీఎఫ్, హిట్ 3 సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. తన రోజూవారీ పనుల్ని ఫొటోల రూపంలో పంచుకుంది. సినిమా డబ్బింగ్, ఊరిలో ఎద్దులని మచ్చిక చేసుకుంటూ కనిపించింది. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్ నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు. హరీష్రావుకు పొంగలేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సైలెంట్గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల

రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం, సెప్టెంబర్ 2: శ్రీశైలం జలాల కోసం వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి పేరుతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కొడుకు రవి కిషోర్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం వల్ల నీరు వచ్చే పరిస్థితి లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆరు నెలల క్రితమే స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కానీ వైసీపీ నాయకులు రైతులను అడ్డం పెట్టుకుని శ్రీశైలం జలాల కోసం పోరాటాలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఆయన అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వైసీపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు రైతులకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో నీటి సమస్యలను పరిష్కరించాలని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే మీరేం చేశారు.. పోలీసులతో రైతులను అడ్డగించలేదా..? ఆనాడు ఏం అయింది మీ చిత్తశుద్ధి?’ అని ఎమ్మెల్యే నిలదీశారు. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హిస్టారిక్ నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించేందుకు గాను బుధవారం సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ నివాసమైన మణిరామ్దాస్ ఛావనీలో ఈ భేటీ జరగనుండగా, అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఈఓ నియామకంతో పాటు ఖాళీగా ఉన్న కీలక పదవుల భర్తీపై కూడా ట్రస్ట్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అధికారిక ప్రకటన వెలువరించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉద్యోగ ప్రకటనకు ఏకంగా 5,585 దరఖాస్తులు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కొహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేశ్ హావరేలతో కూడిన ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించింది. సెర్చ్ కమిటీ మొత్తం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, చివరకు ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ జాబితాను ట్రస్ట్కు సమర్పించింది. 50 నుంచి 70 ఏళ్ల వయస్సు, కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి ఉండి, ప్రాక్టీసింగ్ హిందువుగా ఉన్న వారిని మూడేళ్ల కాంట్రాక్ట్ కాలపరిమితికి సీఈఓగా ఎంపిక చేయనున్నారు. ఈ సీఈఓ పదవితో పాటు ట్రస్ట్ తొలి సెక్రటరీగా ఐఐటీ బాంబే ఎంటెక్ గ్రాడ్యుయేట్, రామాలయ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జగదీశ్ ఆఫ్లే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వీహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాను కూడా ట్రస్ట్ సభ్యుడిగా చేర్చుకునే దిశగా చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలు, అలాగే ట్రస్టీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం వల్ల ట్రస్ట్లో మూడు కీలక స్థానాలు ఖాళీగా

కన్నడ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలియొచ్చేమో. 'ఈగ' విలన్ అంటే మాత్రం ఎక్కువగా గుర్తుపడతారు. సైరా, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం సొంత భాషకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఈ రోజు సుదీప్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) తెలుగు ప్రముఖ నిర్మాణ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుదీప్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాకు 'దేవరాయ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మనందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి సంగీత దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ బాగుంది. అలానే ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించడం వరకు బాగానే ఉంది. కానీ దర్శకుడు ఎవరనేది బయటపెట్టలేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ కాలేదా లేదంటే కావాలంటే పేరుని రివీల్ చేయలేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. అలానే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. (ఇదీ చదవండి: విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. 'జైలర్ 2' వాయిదా రూమర్స్.. తీరా చూస్తే) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

మాగనూరు, సెప్టెంబర్ 2: మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్నా ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాగనూరు మండలం నేరడగం గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు కాంగ్రెస్కు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేశారు. “నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?” నేరడగం, బూత్పూర్ గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవో తీసుకొచ్చానని చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. ‘‘నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?’’ అంటూ మంత్రిని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. [caption id="attachment_2500433" align="aligncenter" width="1280"] Chittem Rammohan Reddy1[/caption] మంత్రి సొంత నియోజకవర్గంలో నేరడగం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన, వార్డు నెంబర్లు, ఉట్కూరు అశోక్,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా

Madanapalle: మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు! Madanapalle: మదనపల్లె ప్రెస్క్లబ్లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మదనపల్లె ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 3) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడి ప్రసాదాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని బ్రహ్మకుమారి పద్మావతి కోరారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి పాల్గొననున్నట్లు తెలిపారు

Hyderabad: జూబ్లీహిల్స్లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధా-కృష్ణుల బంధం ఎప్పుడూ చర్చలోకి వస్తుంది. రాధా-కృష్ణుల ప్రేమను కేవలం ప్రేమకథగా మాత్రమే చూడరు. నమ్మకం, గౌరవం, అవగాహన, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం వంటి విషయాలకు వీరి అనుబంధాన్నే ఉదాహరణగా చెబుతారు. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య గొడవలు రావడం, అపార్థాలు పెరగడం, ఒకరిపై ఒకరికి అనుమానం రావడం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాధా-కృష్ణుల బంధం నుంచి కొన్ని మంచి విషయాలను నేటి జంటలు నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బంధం ఒకేలా ఉండదు. కానీ ప్రేమతో పాటు నమ్మకం, గౌరవం ఉంటే ఏ బంధమైనా మరింత బలపడుతుంది. ఏ ప్రేమ బంధానికైనా నమ్మకమే చాలా ముఖ్యం. భాగస్వామిపై పదే పదే అనుమానం పెట్టడం, ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. ఏదైనా విషయం అనుమానంగా అనిపిస్తే మనసులో పెట్టుకుని బాధపడకుండా నేరుగా మాట్లాడటం మంచిది. అలాగే భాగస్వామి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ముందుగా వారి మాటను పూర్తిగా వినాలి. వెంటనే మనదే సరైన మాట అని చెప్పకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమలో గౌరవం కూడా చాలా అవసరం. భాగస్వామి అభిప్రాయాలు, ఇష్టాలు, నిర్ణయాలను గౌరవించాలి. కోపంలో మాట్లాడే మాటలు ఎదుటివారిని చాలా బాధపెట్టవచ్చు. అందుకే గొడవ వచ్చినప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవడం మంచిది. బంధం బలంగా ఉందో లేదో సంతోష సమయంలో కంటే కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. భాగస్వామి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎగతాళి చేయకుండా, ఒంటరిగా వదిలేయకుండా అండగా నిలవాలి. కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం చెప్పడం కంటే ఎదుటివారి మాటను ప్రశాంతంగా వినడమే వారికి ఎంతో ధైర్యం ఇస్తుంది. అదే సమయంలో ప్రేమ పేరుతో భాగస్వామిపై ఎక్కువ ఆంక్షలు పెట్టకూడదు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఇష్టాలు, స్నేహితులు, వ్యక్తిగత సమయం ఉంటాయి. కాబట్టి ఒకరికి ఒకరు కొంత స్పేస్ ఇవ్వాలి

ఈ ఆదివారం జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ సందడి చేయబోతోంది. అందులో పాత కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రత్యేక ఎపిసోడ్కు మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సుధీర్, ధనరాజ్, గెటప్ సీను, చంటీ, ఇలా అందరు సందడి చేయడంతో పాటు 13 ఏళ్ల కిందటి జబర్దస్త్ వాతావరణానికి మళ్లీ క్రియేట్ చేయబోతున్నారు. ఈక్రమంలో నాగబాబు, ధనరాజ్, ఇంద్రజల మధ్య జరిగిన సరదా సంభాషణలు నవ్వులు పూయించాయించగా.. తాగుబోతు రమేష్, దీప్తి నల్లమోతు , రోహినీ ల కామెడీ కడుపుబ్బా నవ్వించింది. వీటితో పాటు సుధీర రష్మీల లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా.. రష్మీ సుధీర్ పై చేసిన కామెంట్స్.. ఆమె బోరున విలపించడం అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ల జంట ప్రేక్షకుల్లో పత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ షో టీఆర్పీ రేటింగ్స్ను విశేషంగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరు స్కిట్ లో ఏదో ఒక లవ్ ట్రాక్ పెడితే.. ఆరోజు ఆడియన్స్ కు పండగే.. ఇక ఆతరువాత కాలంలో సుధీర్ వెండితెరపై అవకాశాలు అందుకోవడంతో జబర్దస్త్ నుంచి బయటకు రాగా, రష్మీ యాంకర్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే చాలా విరామం తర్వాత సుధీర్ తిరిగి జబర్దస్త్ వేదికపైకి రావడం, ఆ సమయంలో రష్మీ తీవ్ర భావోద్వేగానికి గురికావడం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు రీ-ఎంట్రీతో జబర్దస్త్ షోకి కొత్త కళ వచ్చి చేరింది. ఆయనతో పాటు చంటి, ధనరాజ్, హైపర్ ఆది, సద్దాం వంటి పాత కమెడియన్లు తిరిగి స్టేజ్పై అలరిస్తున్నారు. ఈ వరుసలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పైకి అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్అయిన ప్రోమోలో హైపర్

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. ఇంటర్నెట్ డెస్క్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14-21, 7-21 తేడాతో లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఓటమితో 2026లో విక్టోర్ లాయ్తో లక్ష్య సేన్ హెడ్-టు-హెడ్ రికార్డు 1-3కు పడిపోయింది. ఈ ఏడాది లక్ష్యపై లాయ్కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లోనూ లక్ష్యసేన్కు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో ఓడిపోయాడు. చైనా మాస్టర్స్లో తొలుత లక్ష్యసేన్ ఫ్రాన్స్కు చెందిన అలెక్స్ లానియర్తో తలపడాల్సి ఉంది. అయితే ఢిల్లీలో టైటిల్ సాధించిన అనంతరం లానియర్ టోర్నీ నుంచి వైదొలగడంతో.. లక్ష్యకు మరోసారి విక్టోర్ లాయ్తో తలపడే అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఫలితం లక్ష్యకు అనుకూలంగా రాలేదు. ఇదిలా ఉంటే.. మరో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం చైనా మాస్టర్స్లో శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో చైనీస్ తైపీకి చెందిన చి యు-జెన్ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లాడు. 2023 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్లో శ్రీకాంత్ను తొలి రౌండ్లోనే ఓడించిన యు-జెన్పై ఈసారి భారత షట్లర్ పైచేయి సాధించాడు. తొలి గేమ్లో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. రెండో గేమ్లోనూ ప్రశాంతంగా ఆడి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది

ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన శ్రీశైలం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య దర్శనం. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన, ఎంతో మహిమాన్వితమైన మరొక అద్భుత ప్రదేశం ఉంది. అదే దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువైన ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. భారతదేశం మొత్తం మీద ‘ఇష్టకామేశ్వరి’ పేరుతో దేవి ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం మాత్రమే. సాధారణంగా కామేశ్వరీ దేవి అంటే ఎనిమిది భుజాలతో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో ప్రత్యేక స్వరూపంలో దర్శనమిస్తారు. ఇష్టకామేశ్వరి దేవి ఆలయంలో జరిగే అద్భుతం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ విగ్రహం రాతితో మలచబడినప్పటికీ, భక్తులు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టే సమయంలో ఆమె నుదుటి భాగం మనిషి చర్మంలా ఎంతో మెత్తగా తగులుతుంది. విగ్రహాన్ని తాకిన ప్రతిఒక్కరూ ఈ అనుభూతిని పొంది ఒళ్లు జలదరింపజేసే అద్భుతాన్ని కళ్లారా చూస్తారు. రాయిలా ఉండే విగ్రహం నుదుటి వద్ద మాత్రం మనుషుల చర్మంలా మెత్తగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు సాహసాలు చేసి మరి ఇక్కడికి వస్తుంటారు. తన వద్దకు వచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా, ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు వెంటనే నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి నుదుటన బొట్టు పెట్టి, మనసులోని కష్టాన్ని చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ సమస్య తీరిపోతుందని ప్రతీతి. పూర్వం ఈ ప్రదేశం కాపాలికులు, సిద్ధులకు ప్రధాన ధ్యాన కేంద్రంగా ఉండేది. నాగార్జునుడు వంటి సిద్ధులు ఇక్కడి మూలికలతో ఎన్నో ప్రయోగాలు చేశారని కథనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడి గుహలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహాలయానికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి సాధారణ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Government Employees: ఉపాధ్యాయులపై చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఆర్థిక శాఖ మంత్రి భార్యపై 10శాతం కమీషన్ ఆరోపణలు వచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రశ్నించారు. సాధారణ ఉపాధ్యాయుపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఓ రిటైర్డె ఉద్యోగురాలు బహిరంగాంగానే మంత్రి సతీమణిపై ఆరోపణలు చేసినా ఎందుకు స్పందించలేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరెండున్నరేళ్లలో మొదటి తారీఖున జీతం ఇవ్వడం మినహా చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 2 డీఏలు పెండింగ్ లో ఉంటే ఈ పాలనలో అవి ఏకంగా 6కు చేరుకున్నాయన్నారు. 2023 చివరి నాటికి రూ. 4వేల కోట్లుగా ఉన్న ఉద్యోగుల బకాయిలు.. ఇప్పుడు ఏకంగా రూ. 16వేల కోట్లకు చేరుకున్నాయని ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇక ఉద్యోగుల నుంచి 4 దఫాలుగా చందాలు వసూలు చేసినా.. ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో సర్కార్ దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ పదవిలో కొనసాగాలంటే మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పాలిటెక్నిక్ విద్య విషయంలోనూ

ఆత్మకూరు ఈటీవీ: ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడి పింఛను డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు ఒంటరిగా ఆత్మకూరులో నివసిస్తున్నాడు. మంగళవారం పింఛను డబ్బులు రావడంతో ఆ డబ్బులు, అతని వద్ద అదనంగా ఉన్న మరో రూ. వెయ్యి మొత్తం రూ.4,500 నగదును అతని వద్ద ఉంచుకుని నిద్రించాడు. ఇలా ఉండగా కొందరు యువకులు ఇతనిపై దాడికి పాల్పడి మొత్తం నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మకూరులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు చిల్లర దొంగతనాలకు, ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆకతాయిలా ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్లో కశ్మీర్కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన

Srikakulam Corporation : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు గ్రహణం పట్టుకుంది. 2005 వరకు సిక్కోలులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి 2010తో మున్సిపల్ కౌన్సిల్ సమయం ముగిసిన నాటినుండి నేటి వరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగలేదు. 2015లో టీడీపీ హయాంలో ఏడు పంచాయతీలను శ్రీకాకుళం మున్సిపాలిటీలో కలిపి కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. విలీనాన్ని వ్యతిరేకించిన పంచాయతీ గ్రామాల ప్రజలు కోర్టు మెట్లక్కడంతో.. సిక్కోలు కార్పొరేషన్కు పాలకులు లేకుండా పోయారు. 2005 ఎన్నికల తర్వాత దాదాపు 20 ఏళ్లకు పైగా ఎన్నికలు జరగకపోవడం 15 ఏళ్లుగా పాలకులు లేకపోవడం సిక్కోలు నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తుల ప్రారంభించడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్ర వాసులకు కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి అయినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధి బాటపడుతుందని కోటి ఆశలతో ఉన్నారు సిక్కోలు నగరవాసులు. శ్రీకాకుళం పట్టణంలో ఇప్పటికీ చాలారోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోవడంతో మురుగునీరు అంతా నాగావళి నదిలో కలుస్తుంది. దీంతో నాగవళి నది అంతా కాలుష్యంతో నిండిపోయింది. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కార్పొరేషన్కు పాలకవర్గం ఉంటేనే ప్రజల కోసం సరైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు సిక్కోలు వాసులు. ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్కు సమయం ముంచుకొస్తుండటం.. మరోవైపు కోర్టు కేసులు ఇంకా తేలకపోవడంతో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదోనన్న డైలమా కొనసాగుతోంది. సిక్కోలు కార్పొరేషన్ ఎన్నికలకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇస్తుందో లేదోనని..అధికార ప్రతిపక్ష నేతలు అంతా మల్ల గుల్లాలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోర్టు కేసులను వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ కామెడీ షో జబర్దస్త్ కు పునఃవైభవం తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఈ కామెడీ షోకు వెన్నెముకగా నిలిచిన స్టార్ కమెడియన్లను తిరిగి జబర్దస్త్ లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కు జడ్జీగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాతే జబర్దస్త్ కు కొత్త కళ వచ్చిందని చెప్పవచ్చు. కమెడియన్ల మధ్య పోటీ పెంచేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు నాగబాబు. తద్వారా జబర్దస్త్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు గతంలో జబర్దస్త్ లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటోన్న స్టార్ కమెడియన్లను తిరిగి ఈ షోలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే హైపర్ ఆది, ధనాధన్ ధన్రాజ్, చలాకీ కంటి, సద్దాం, వినోద్ అలియాస్ వినోదిని తదితరులు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీచ్చారు. తమదైన కామెడీ పంచులతో ఆడియెన్స్ ను మంచి వినోదం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఇద్దరు స్టార్ కమెడియన్లు చేరారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోన్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ‘కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్’ అంటూ జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే తన కామెడీ పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ ను కడుపుబ్వా నవ్వించారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను. అలాగే యాంకర్ రష్మీతో కలిసి ఇద్దరూ కామెడీ చశారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత సుధీర్ ను చూడాగానే యాంకర్ రష్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఇదే క్రమంలో కాస్త ఎమోషనలైంది రష్మీ. తాను, సుడిగాలి సుధీర్ ఒకేసారి జబర్దస్త్ మొదలుపెట్టామని, తను వెళ్లిపోయాడని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుందీ స్టార్ యాంకర్. మొత్తానికి జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా సరదాగా, ఎమోషనల్
Viral Video: సబ్స్రైబ్ చేస్తే చేస్తే తిరుమల లడ్డూ ఫ్రీ! సబ్స్క్రైబ్ చేస్తే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ఉచితమంటూ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎవరైనా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయిస్తే ఒక్కో లడ్డూ చొప్పున బహుమతిగా ఇస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు. ఇలా ఏకంగా 30 మందితో సబ్స్క్రైబ్ చేయించుకుని.. దానికి ప్రతిఫలంగా 30 లడ్డూలను పొందినట్లు.. ఆ వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ప్రపంచ ప్రఖ్యాత శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇలా సోషల్ మీడియా ప్రమోషన్లకు, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి వాడుకోవడం పట్ల భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తకు సంబంధించిన

బుచ్చిరెడ్డిపాలెం: పేదల సంక్షేమానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో మంగళవారం ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 62 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో పంచేడు పంచాయతీ పరిధిలో రూ.4.44 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్, 108 ఇళ్లకు సోలార్ కనెక్షన్లు కల్పించడంతో పాటు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, నుడా నిధులతో రూ.7.98 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అర్హులైన పేదలకు సొంతింటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచేడు-బుచ్చిరెడ్డిపాలెం రహదారి నిర్మాణానికి రూ. కోటి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించి మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సర్వేపల్లి(ఈటీవీ): కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ పోటాపోటీగా జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని కామాక్షినగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు తెదేపా అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. తన సొంతూరుతో సమానమైన తోటపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తోటపల్లి పంచాయతీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తోటపల్లి పంచాయతీలో ప్రతి నెలా రూ.7.50 లక్షల మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. మూడు జిల్లాల ప్రజల 30 ఏళ్ల కలను నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి నీటిని విడుదల చేశామని, త్వరలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించబోతున్నామని తెలిపారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన నీటిపారుదల శాఖకు పూర్వవైభవం తీసుకొస్తున్నామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25 Problems: నల్గొండ-హైదరాబాద్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ (SGT)లు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థకు పునాది వంటి ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు, మౌలిక వసతుల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడులు మూతపడకుండా కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బ్రతికించుకోవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు (SGT) విజ్ఞప్తి చేస్తున్నారు. జీఓ నెంబర్ 25 వల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1 నుండి 5 తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరినే ఉపాధ్యాయుడిగా ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 4,800 పాఠశాలలు ఒక్క టీచర్తోనే నడుస్తున్నాయని వాపోతున్నానరు. 21 నుండి 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లను ఇస్తున్నారు. కానీ, ఇద్దరు టీచర్లు ఒకే సమయంలో ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం అసాధ్యంగా మారింది. దీనినే బహుళ తరగతి బోధన అని పిలుస్తున్నప్పటికీ, ఆచరణలో ఇది విఫలమవుతోందని.. దీనివల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,100 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం: పాఠాలు చెప్పడంతో పాటు ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్రమైన బోధనేతర భారం మోపుతోందని వాపోతున్నారు. ప్రతిరోజూ యాప్లలో విద్యార్థుల, ఉపాధ్యాయుల

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Teachers Strike: ఉపాధ్యాయులతో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం చూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాలు. సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన లక్ష్యం నేడు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ప్రొగ్రేసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు నేతలు మాట్లాడారు. తమ డిమాండ్ల అమలుకు సర్కార్ తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు దఫాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదే నిజం కావాలంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు చేస్తేనే రెండు దఫాలు మీ ప్రభుత్వమే ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ఇచ్చి పీఆర్సీ కమిటీ వేయగానే.. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో అనేక అంశాలను చేర్చింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పీఆర్సీ పాత కమిటీ రద్దు చేసి దాని స్థానంలో కొత్త కమిటీ వేసి 6 నెలల్లోపే నివేదిక తెప్పించుకుంటారని తాము భావించాము. కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తూ.. వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా లేదా అనేది ఉద్యోగ సంఘాలకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీ ఉంటే ఎందుకు రిపోర్టు ప్రభుత్వానికి చేరడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు కార్యాచరణ తీసుకోగానే సీఎం పిలిచి

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి