
శ్రీరామ జన్మభూమిట్రస్ట్ విచారణ.. ప్రభుత్వానికి సిట్ నివేదిక
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. CM Yogi Adityanath Serious: అయోధ్య రామ మందిరంలో భక్తుల కానుకలు పక్కదోవపట్టించారనే విషయం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. అయోధ్య రామమందిరం నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. కానుకల చోరీకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ కీలకశాఖల్లో ఉన్న ముగ్గురు ప్రభుత్వ సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటుచేశారు. కానులను దారిమళ్లిన కేసును లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. తప్పుచేసిన వారిని వదిలిపెట్టొద్ధనే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులను విచారించారు. ఆలయ ఉద్యోగులను విచారించి కానులను తస్కరించిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 80లక్షల మేర నగదును రికవరీ చేశారు. అయోధ్య కానుకల కేసులో ఆసక్తికర విషయాలు.. రామమందిరానికి భక్తులు అందించిన విరాళాలను, బంగారం, వెండి ఆభరణాలను, హుండీ కానుకలను దశలవారీగా ఆలయ ఉద్యోగులే దోచుకెళ్లారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. సిట్ అధికారులు రంగంలోకి దిగగానే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. మహా కుంభమేళా సమయంలో భారీ ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని、ట్రస్ట్ ఉద్యోగులు కొందరు చేతివాటం ప్రదర్శించి సొమ్ము చేసుకున్నారని పోలీసులు తేల్చారు. భక్తులు సమర్పించిన హుండీల్లో డబ్బును ట్రస్ట్ ఉద్యోగులు దొంగిలించారని విచారణ అధికారులు గుర్తించారు。స్వామివారికి కానుకగా అందించిన బంగారు ఆభరణాలను తూకం వేసే సమయంలో మోసం జరిగిందని దర్యాప్తులో తేలింది。ఈ

