ఆఫ్రికాలో లహరి సందడి.. టాప్ లేపేసిన తేజు.. ట్రెండీగాశ్రీముఖి
బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం
బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్లు

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్వర్క్పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ

Qutubullapur: 14 ఎకరాల ఆలయ భూమికి హద్దులు; రంగంలోకి రెవెన్యూ! Qutubullapur: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరి రక్షణకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా సర్వీ దేవాదాయ శాఖ కుత్బుల్లా పూర్ మండల రెవెన్యూ అధికారులు ఆలయ ప్రాంగ ణంలో స్థానిక నాయకులతో మంగళవారం సమా వేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆట యానికి కేటాయించిన Mఏకరాల 10 గుంటల స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 318/1లో గల స్థలానికి సరిహద్దులను పరిశీలిస్తు న్నారు. కబ్జా అయిన ఆలయ స్థలాన్ని గుర్తించడా వికీ డిజిటల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు వినాయక చవితి వండగలోపు డిజిటల్ సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేయాలని, కళ్ళా అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. సర్వే దేవి ఆలయ భూములను రికార్డుల్లోకి ఎక్కిబడను వ్నట్లు అధికారులు. అదికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 12 వారాల్లో సర్వేపూర్తి చేయాల్సి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు వట్టాదారులతో ఉన్న మిబాబత్ వల్లనే ఇప్పటి వరకు సర్వే చేయకుండా తాత్సర్యం చేశారని నాయకులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్న రెవెన్యూ అది కబ్జాదారుల గుండెల్లో గుబులు జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు శ్రీకారం ముట్టడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. కుల సంఘాల ముసుగులో ఆలయ స్థలాన్ని కబ్జాచేసి గదులు కట్టి లక్షల రూపాయ బంచారు. రెవెన్యూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తే కబ్జాల బాగోతం బయేట పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తమపై కేసులు నమోదు అవుతాయని కంగారు పడుతున్నారు. దీంతో అధికారులు, నాయకుల మాటూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారు. కాదులు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తు న్నారని

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. 'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో

మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ‘మారెమ్మ’ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు, మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మారెమ్మ’ (Maremma). దీపా బాలు కథానాయిక. వికాశ్, వినోద్ కుమార్, రూపలక్ష్మి, దయానంద్రెడ్డి కీలక పాత్రదారులు. మయూర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ‘ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామ దేవత మారెమ్మ ఇతివృత్తంగా తెలంగాణ పల్లె కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే ఆర్థమౌతుంది

తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ (CRIF) రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పనుల పురోగతి మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 3,918 కి.మీ రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరు అయ్యాయని వివరించారు. 2025-26లో రూ.868 కోట్లతో 422.36 కి.మీ రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నార్కట్పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 2026, డిసెంబర్ నాటికి సచివాలయంలో సోలార్ కార్ పార్కింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో సోలార్ కార్ పార్కింగ్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సోలార్ పార్కింగ్తో సచివాలయానికి 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. దీంతో నెల వారీ విద్యుత్ బిల్లులో 16 శాతం ఆదా అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ స్టార్ యశ్ (Yash)హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’(Toxic Movie). ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్ను కూడా విడుదల చేసింది (Toxic English Trailer ). ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్తో అదరగొట్టారు. ఈ చిత్రంలో యశ్తో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు

గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. మన ఆడియన్స్కు హాలీవుడ్ మేకింగ్, అక్కడి విజువల్స్ విపరీతంగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకైతే మన దగ్గర ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భాషతో సంబంధం లేకుండా సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చే సినిమాలను మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన పలు హారర్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. 'ది కంజూరింగ్: ది లాస్ట్ రైట్స్', అలానే 'ఈవిల్ డెడ్ బర్న్' లాంటి సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ సినిమాలు కేవలం భయపెట్టడమే కాకుండా, థియేటర్లకు భారీగా జనాలను రప్పించి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి. లోకల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ సైతం హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ఇండియన్ సినిమా లవర్స్ ఇప్పుడు సరికొత్త హారర్ వరల్డ్ను ఎంతలా ఆస్వాదిస్తున్నారో ఈ కలెక్షన్లే నిరూపించాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో బాక్సాఫీస్పై దండయాత్ర చేసేందుకు మరో భయంకరమైన మూవీ సిద్ధమైంది. అదే ఇన్సీడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (Insidious: Out of the Further). హారర్ సినిమా ప్రియులకు ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దెయ్యాలు, ఆత్మలు తిరిగే ది ఫర్దర్ అనే డార్క్ డైమెన్షన్ కాన్సెప్ట్తో వచ్చిన మునుపటి భాగాలు ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా, మన ఇండియాలోనూ కల్ట్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాయి. జంప్ స్కేర్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లలో కూర్చున్న

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఒక ప్రైవేటు భూమిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ గద్దెను నిర్మించారు బిఆర్ఎస్ శ్రేణులు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అనుమతి తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆ గద్దెను కూల్చివేశారు.నర్సంపేటలో పొలిటికల్ హీట్ఆ తర్వాత మళ్లీ బిఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, మున్సిపల్ అధికారులు మళ్ళీ విగ్రహాన్ని తొలగించారు. దీంతో నర్సంపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు.పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత, బీఆర్ఎస్ రాస్తారోకో, నర్సంపేటలో ఉద్రిక్తత!నేడు నర్సంపేట బంద్మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడంతో బిఆర్ఎస్ నేడు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుండి నర్సంపేటలోపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నర్సంపేటలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తుఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. నర్సంపేట కు తరలి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్
తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి తిరుపతి జిల్లా చిట్వేలు - రాపూర్ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిట్వేలు నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు రాత్రి వేళ మూడో మలుపు వద్ద చిరుత సంచరిస్తుండటాన్ని గమనించారు. ప్రస్తుతం పెంచలకోనలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బైక్లపై వెళ్లే భక్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు హెచ్చరించారు. ఈ వార్తకు సంబంధించిన

పుట్టినరోజు వేడుకలకు ఉత్సాహంగా హాజరైన అతిథులకు చేతు అనుభవం ఎదురైంది. బర్త్డే సందర్భంగా కట్ చేసిన కేకు తిన్న 11 మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలోని నలసోపారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బర్త్డే వేడుకల్లో భాగంగా కట్ చేసి తిన్న కేక్లో చనిపోయిన బల్లి ఉండటాన్ని వారు గుర్తించారు. అప్పటికే ఆ కేక్ తినడం వల్ల ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ ఒక్కసారిగా కడుపు, ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. థానేలోని కళ్యాణ్లో ఒక స్టోర్లోని ఐస్క్రీమ్ ఫ్రీజర్లో ఎలుక ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. అలాగే మలాడ్లోని మరో కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పలు ఉల్లంఘనలను గుర్తించి ఆ సంస్థ లైసెన్స్ను నిలిపివేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు! అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు మరియు వసతి గదుల బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై తిరుమల తిరుపతి దేవస్థానాలు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. టీటీడీ నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ అకౌంట్లు మరియు సోషల్ మీడియా పేజీల ద్వారా భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. టీటీడీ అధికారిక ముద్ర, లోగో, చిత్రాలు మరియు ట్రేడ్మార్క్లను అక్రమంగా ఉపయోగిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో టీటీడీ ఐటీ, విజిలెన్స్ మరియు సైబర్ క్రైమ్ పోలీసు విభాగాల సమన్వయంతో సుమారు 259 టీటీడీ నకిలీ వెబ్సైట్లు గుర్తించి బ్లాక్ చేశారు. మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే వారిపై కాపీరైట్, ట్రేడ్మార్క్ మరియు సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కూడా ttddevasthanam.online వంటి నకిలీ పోర్టల్స్ ద్వారా ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయని తప్పుడు ప్రచారం నిర్వహించారు. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం తక్షణమే స్పందించి సదరు డొమైన్ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసి ఆ సైట్లను నిలిపివేసే చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరస్థులపై చట్టపరమైన విచారణ వేగవంతం చేశారు. గతంలో కేరళ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ మరియు జిల్లా పోలీసులు సంయుక్తంగా అనేక నకిలీ లింకులను తొలగించారు. ఈ నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనం మరియు వసతి సేవలను కేవలం ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫలితంగా గూగుల్ సెర్చ్లో కనిపించే స్పాన్సర్డ్ లింకులు, అనధికారిక సైట్లు మరియు వాట్సాప్ సందేశాలను నమ్మి నగదు పంపవద్దని తేల్చి చెప్పారు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. నెల్లూరు, ఆగస్టు 14: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులు... ఇష్టారాజ్యంగా భూములు, స్థలాలను పందారం చేసినట్లు తేలింది. వెంకటచాలం మండలం కనుపూరు బిట్ - 1లో దేవాదాయశాఖ భూముల్లో జగనన్న లే అవుట్ నిర్మించారని, 185 మందికి పట్టాలు పంపిణీ చేశారని, 310 స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అలాగే, సర్వేపల్లి బిట్ -2లో కోర్టుల్లో ఉన్న 57.16 ఎకరాల భూములని మాజీ మంత్రి కాకాణి అల్లుడికి చెందిన JKS ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సంస్థకి అధికారులు కారుచౌకగా కట్టబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఆరుగురు తహశీల్దార్లు, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వోలపై అభియోగాలు నమోదు చేసిన అధికారులు.. పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెవెన్యూశాఖ అధికార వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. మెడికో మృతి శ్రావణ మాసం మొదటి శుక్రవారం.. దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి

వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్: తాండూరులో రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తాండూరులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైలులో గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తాండూరులో రైలు దిగి, అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంజాయిని తరలించేందుకు నిందితులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. బ్రీఫ్కేసుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టుకుని తరలిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మధు ప్రధాన్ (34), సింబా సాహక్ (22), నీల్ మండల్ (22)లను అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఎక్సైజ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం

ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక నేపథ్యంలో కోట్లాది మంది ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాల భద్రతపై తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు మరియు ఫిషింగ్ లింకుల ద్వారా పిఎఫ్ చందాదారుల సున్నితమైన వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక ప్రకారం యూఏఎన్, ఆధార్, పాన్ మరియు బ్యాంక్ వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆగస్టు 9న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ తన సభ్యులను అప్రమత్తం చేస్తూ అత్యవసర సూచనలు జారీ చేసింది. ఆన్లైన్ సేవలను పొందే సమయంలో అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని సంస్థ స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం విశేషం. ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక ద్వారా సామాజిక భద్రతా నిధులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ వెబ్సైట్ యూఆర్ఎల్ స్పష్టంగా తనిఖీ చేయాలని సూచించారు. సైబర్ నేరస్థులు వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయాలంటూ మోసపూరితమైన మేసేజ్లను వినియోగదారుల ఫోన్లకు పంపుతున్నారు. దీంతో అమాయక పీఎఫ్ చందాదారులు అసలైన పోర్టల్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లలో తమ లాగిన్ వివరాలను నమోదు చేసి మోసపోతున్నారు. ఇదిలా ఉండగా ఓటీపీ మరియు పాస్వర్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కితే ఖాతాలోని నిధులు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక అందుకున్న చందాదారులు అధికారిక వెబ్సైట్ అయిన epfindia.gov.in ద్వారా మాత్రమే సేవలను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఫలితంగా నకిలీ డొమైన్ల బారిన పడకుండా ఉండటానికి బ్రౌజర్లో చిరునామాను స్వయంగా టైప్ చేయడం ఎంతో సురక్షితమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా అనుమానాస్పద లింక్ కనిపిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు. భవిష్యత్తులో డిజిటల్ మోసాలను నివారించడానికి చందాదారులు ఉమాంగ్ యాప్ వంటి అధికారిక

తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..! తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల పనితీరు, ప్రవర్తనపై రాష్ట్ర పోలీస్ బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు విభాగంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారుల తీరుపై డీజీపీ సీవీ ఆనంద్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. శాఖలోని నలుగురు అధికారుల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని డీజీపీ వ్యాఖ్యానించారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా క్రమశిక్షణా రాహిత్యం ప్రదర్శిస్తున్న సదరు అధికారులకు ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగతంగా, అంతర్గతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశామని ఆయన వెల్లడించారు. అనేకసార్లు మందలించినప్పటికీ, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ నలుగురు అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపట్ల డీజీపీ తీవ్ర అసంతృప్తి చెందారు. ఇప్పటికైనా వారు తమ పనితీరును, ప్రవర్తనను మెరుగుపరచుకోకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ బాస్ నుంచి నేరుగా ఇలాంటి గంభీర హెచ్చరిక రావడంతో తెలంగాణ పోలీస్ శాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. డీజీపీ వేలెత్తి చూపిన ఆ నలుగురు అధికారులు ఎవరు, వారిపై ఏయే అంశాల్లో ఫిర్యాదులు లేదా ఆరోపణలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం తీవ్రమైన ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయడం, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా ఉన్నతాధికారులు పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు అనివార్యమని పోలీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల సహనం వహించేది లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. గతంలోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన సీవీ ఆనంద్, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడరనే పేరుంది. ఈ నేపథ్యంలోనే శాఖలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు, అధికారుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించేందుకు ఈ తరహా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పాలనలో పారదర్శకత
EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారులకు ఆన్లైన్ భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో పీఎఫ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఉద్యోగులను ఈపీఎఫ్ఓ అప్రమత్తం చేసింది. ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్త వహించాలని, వాటి బారిన పడొద్దని సూచించింది. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింక్లను నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది.సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే నకిలీ లింకులు, ఇ-మెయిల్స్ ను ఓపెన్ చేయవద్దని కోరింది. ఇటీవల ఈపీఎఫ్ఓ సిస్టమ్ అప్ గ్రెడేషన్ చేసింది. ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు ఉద్యోగులకు తెలియజేసింది. సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు 6 ముఖ్యమైన సూచనలు చేసింది.సూచనలు ఇవే అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ మాత్రమే సందర్శించాలి సోషల్ మీడియా, ఎస్ఎంఎస్ లేదా ఇ-మెయిల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో కాకుండా ఇతర ఏ ప్లాట్ ఫామ్లో యూఏఎన్, పీపీఓ, పాస్వర్డ్, పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలను ఇవ్వవద్దు అకౌంట్ లాగిన్ అయ్యో ముందే సైట్ యూఆర్ఎల్ స్పెల్లింగ్, డొమైన నేమ్ చెక్ చేయాలి అనుమానాస్పద సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్కు, సైబర్ సెక్యూరిటీకి రిపోర్ట్ చేయాలి. ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఓటీపీలు, లాగిన్ వివరాలు అడగదని గుర్తుంచుకోవాలి.అధికారిక వెబ్సైట్ లింకులు ఇవే..ఈపీఎఫ్ఓకు చెందిన మూడు అధికారిక వెబ్సైట్ లింకులను ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పంచుకుంది. ఈపీఎఫ్ఇండియా

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్సైట్లు, లింక్లు, మోసపూరిత మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్సైట్లు, లింక్లు, మోసపూరిత మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా చందాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పీఎఫ్ సేవలు పొందే సమయంలో వెబ్ లింక్లను పరిశీలించి.. వ్యక్తిగత వివరాలను భద్రంగా ఉంచుకోవాలని పేర్కొంది. పీఎఫ్ సేవల కోసం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను మాత్రమే వినియోగించాలి. ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్లో వచ్చే గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు. లాగిన్ చేసే ముందు వెబ్సైట్ మినహా ఇతర సైట్లలో యూఏఎన్, పీపీఓ, పాస్వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని నమోదు చేయొద్దు లాగిన్ చేసే ముందు వెబ్సైట్ యూఆర్ఎల్ను జాగ్రత్తగా పరిశీలించాలి. అక్షరాల్లో స్వల్ప మార్పులు, అనుమానాస్పద డొమైన్ పేర్లు ఉన్నాయోమో చూడాలి. అనుమానాస్పద వెబ్సైట్లు, మెసేజ్లు కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఈమెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎప్పుడూ ఓటీపీ, వ్యక్తిగత వివరాలు లేదా లాగిన్ సమాచారాన్ని అడగదని గుర్తుంచుకోవాలి. డిజిటల్ విధానంలో పీఎఫ్ సేవలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, లింక్లతో వినియోగదారులను మోసగించే అవకాశం ఉందని ఈపీఎఫ్వో పేర్కొంది. అధికారిక సైట్ నుంచే సేవలను పొందాలని సూచించింది. గుర్తుతెలియని సందేశాల్లో వచ్చే లింక్లను నమ్మకుండా.. ఈపీఎఫ్వో అధికారిక వెబ్సైట్ను స్వయంగా వెరిఫై చేసి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ఇంతకీ ఏం జరిగిందంటే? రెస్టారెంట్లో భారత మ్యాప్పై లవ్లీనా అభ్యంతరం.. ఆమె చర్యను ప్రశంసించిన మోదీ

ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 10: ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధం అక్టోబర్ 3 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యే వరకు కీలక అధికారుల బదిలీలకు బ్రేక్ పడనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు జులై 1, 2026 అర్హత తేదీగా నిర్ణయించారు. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది. దీని ప్రకారం, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈసీ సవరించిన షెడ్యూల్ నేపథ్యంలో బదిలీల నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నిర్ణయం ప్రకారం ఎన్నికల జాబితా సవరణకు సంబంధించిన కీలక అధికారులు అక్టోబర్ 3 వరకు అదే స్థానాల్లో కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ పేరుతో G.O.Rt.No.1545 జారీ అయ్యింది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్ లండన్లో మంత్రి నారాయణ బృందం.. అమరావతి ఐకానిక్ భవనాలపై కీలక చర్చలు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TRAI Recruitment 2026: భారతదేశం అంతటా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ నెట్వర్క్ , డిటిహెచ్ (DTH), ల్యాండ్లైన్ సేవలను అందిస్తున్న టెలికాం రంగంలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ నియామక ప్రక్రియను ప్రకటించింది. ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి, నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ పోస్టులకు ఎంపిక కావడానికి ఎటువంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదు. అభ్యర్థులు 'అసోసియేట్ కన్సల్టెంట్' పదవికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పదవిలో ఎంపికైన వారికి రూ.80 వేలు నుండి ఆకర్షణీయమైన జీతం అందుతుంది. ట్రాయ్ (TRAI) న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, అందులోని 'Vacancies' పోస్ట్ను ఎంపిక చేసుకుని, ఆపై 'Associate Consultant' అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ ఈసీఈ పదవికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్ కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడింది. దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 27వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఎంపికైన అభ్యర్థులను మొదట ఏడాది కాలం పాటు నియమించుకోనున్నారు, ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా ఆ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. ట్రాయ్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ విద్యార్హతలను నిశితంగా తనిఖీ చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా కొనసాగుతుంది, కాబట్టి

ఇప్పటి వరకూ కదులుతున్న బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఈ లిస్ట్లోకి రైలు కూడా చేరింది. మీరు విన్నది నిజమే. ట్రాక్పై దూసుకెళ్తున్న రైలు చక్కాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస రోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీ చక్రాలు రెండు జాయింట్ గా ఊడిపోయాయి.రైలు కదులుతుండగానే ఈ ఘటన జరగటంతో ఊడిపోయిన చక్రాలు రెండు పట్టాలపై నుంచి బయటకు వచ్చేసాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు, సాంకేతిక బృందాలు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన కారణంగా రైల్వే మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సమయానికి సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్ బ్లాస్టర్ తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్డేట్ తెలుసుకోవాల్సిందే