
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు
తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా అగ్రనేత నక్కా సుశీల అలియాస్ రేలా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా అగ్రనేత నక్కా సుశీల అలియాస్ రేలా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంప్పై అడుగులేశాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఘనంగా జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, అందమైన చేనేత చీరలు ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, నడకలోని ధీమాను చూసి సభికులు మంత్రముగ్ధులై చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరై వారిని అభినందించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే సీఎం విష్ణు దేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి బస్తర్ అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. సుమారు 40-50 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రశాంతంగా మారిందని, ముఖ్యంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సి ఉందని సీఎం వెల్లడించారు. ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్గా నిలిచిన బస్తర్.. మావోయిస్టులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉండేది. అయితే, ‘ఆపరేషన్ కగర్’ వంటి ప్రత్యేక ఆపరేషన్లతో భద్రతా బలగాలు మావోయిస్టుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలతో భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారు. గత మే నెలలో బస్తర్ను సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ ప్రాంతం పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో భద్రత నుంచి అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సానుకూల పరిణామాలన్నీ బస్తర్లో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఆధార్ వినియోగదారులకు గుడ్న్యూస్.. అప్డేట్కు ఇక సెంటర్ అవసరం లేదు ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ

దేశంలో సాయుధ నక్సలిజం, మావోయిస్టు హింసను దాదాపుగా అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే మావోయిస్టు భావజాలం మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. ఆ ఆలోచనా విధానంతో ఉన్న వారిని ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, సమాజంలో హింస, అశాంతిని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో సాయుధ నక్సల్స్ను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని అన్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతమైనా వారి భావజాలం పూర్తిగా అంతం కాలేదని పేర్కొన్నారు. మావోయిస్టు ఆలోచనా విధానం ఉన్న కొందరు సంస్థలు, వ్యవస్థల్లోకి చొరబడి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. యువత, కుటుంబాలు, భద్రతా బలగాలు ఈ హింసతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. తుపాకీ భయంతో ప్రజలను బందీలుగా మార్చిన పరిస్థితులు ఉండేవని, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రస్తుతం నక్సలిజం చివరి దశలో ఉందని, పూర్తిగా నిర్మూలించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.సాయుధ నక్సలిజంపై

ఒకప్పుడు బస్తర్ అడవులు అంటేనే ఎదురుకాల్పులు, తుపాకుల మోతలు, మావోయిస్టుల అంబూష్లే గుర్తుకువచ్చేవి. కానీ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో దృశ్యం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆకుపచ్చ యూనిఫామ్ వేసుకుని భుజాన తుపాకులు మోసిన మాజీ మహిళా మావోయిస్టులు, ఇప్పుడు బస్తర్ సంప్రదాయ చేనేత, కోసా సిల్క్ దుస్తులు ధరించి రంగురంగుల వెలుగుల్లో ర్యాంప్ వాక్ చేశారు. స్వదేశీ ఫ్యాషన్ షోలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బస్తర్ లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన ఈ మహిళలకు రాయ్పూర్లో ప్రత్యేకంగా వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ మోడలింగ్ ట్రెయినర్ వీరికి ర్యాంప్పై ఎలా నడవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్తో ఎలా ప్రెజెంట్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మాద్వి మల్లే అనే మహిళ మాట్లాడుతూ.. ప్రారంభంలో భయపడ్డాననీ, కానీ ప్రాక్టీస్ చేశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. ఇంత పెద్ద క్రౌడ్ ముందు ర్యాంప్ వాక్ చేస్తానని కలలు కూడా కనలేదని పూనం దేవీ సంతోషం వ్యక్తం చేశారు. వీరిలో చాలామందికి రాయ్పూర్ నగరాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ కూడా పాల్గొని వారితో ముచ్చటించారు. మావోయిస్టు బాట వీడిన వారికి లోంగుబాటు అనేది సివిలియన్ లైఫ్లోకి రావడానికి పడే మొదటి అడుగు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాల ఆపరేషన్లతో పాటు లోంగుబాటు, పునరావాసం, వృత్తి విద్యా శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తూ వారిని సమాజంలోకి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాయ్పూర్ ఫ్యాషన్ షో అనేది ఈ రీ-ఇంటిగ్రేషన్ ప్రసారంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రాణాలమీదికి తెచ్చే అడవి పోరాటాల నుంచి బయటపడి, తమ