
నటీనటులు
నటీనటులు : M. శశికుమార్, యశ్వంత్, అనఘ, అపర్ణా దాస్, రేవతి శర్మ, వివేక్ ప్రసన్న దర్శకత్వం : ఆండ్రూ లూయిస్ నిర్మాతలు : పుష్కర్, గాయత్రి సంగీతం : సైమన్ కే కింగ్ ఛాయాగ్రహణం : శరవణన్ రామస్వామి కూర్పు : రిచర్డ్ కెవిన్ ఏ పాపులర్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ అయ్యిన పలు వెబ్ సిరీస్ లలో ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘వదంది’ కూడా ఒకటి. కొన్నేళ్ల కితం రిలీజ్ అయ్యిన ఈ సిరీస్ కి సీక్వెల్ ని ఇపుడు మేకర్స్ కొత్త తారాగణంతో తీసుకొచ్చారు. మరి ఈ సీజన్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడు పదంబత్తుర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా మూసా రజా (శశికుమార్) పని చేస్తూ ఉంటారు. తన పని విషయంలో నిజాయితీగా ఉండే తనకి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ హై వే ప్రాజెక్ట్ ని ఆరంభించే సమయంలో జరిపిన మొదటి తవ్వకంలోనే ఒక అస్థిపంజరం బయటపడి అందరికీ షాకిస్తుంది. దీంతో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో ఎస్పీ రతికా నైర్ (అనఘా) ఈ కేసుని మూసాపై నమ్మకంతో అప్పగిస్తుంది. ఇక ఇక్కడ నుంచి ఈ కేసు లోతుకి వెళుతున్న కొద్దీ వారికి మరిన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇందులో జల్లికట్టు ఆడే సాధారణ కుర్రాడు మడకతన్ మణి (యశ్వంత్) ఎలా ఇరుక్కున్నాడు? ఇంతకీ ఆ అస్థిపంజరం ఎవరిది? దీని వెనుక ఉన్న నేరస్థుడు ఎవరు? తనని పట్టుకున్నారా లేదా అనేవి ఇందులో మిగతా కథ. ఈసారి సీజన్ లో కూడా సెటప్ అంతా డీప్ గా వెళ్లే కొద్దీ కొత్త కొత్త అంశాలతో అక్కడక్కడా థ్రిల్ చేసే విధంగానే కొనసాగుతుంది. ఎపిసోడ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే మెయిన్ ప్లాట్ లోకి కథనం వెళుతుంది. అలా ఒకో ఎపిసోడ్