
తిరుమల కల్యాణ వేదికలో పుష్పప్రదర్శనశాలప్రారంభం
తిరుమల కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 18 రకాల పుష్పాలు, 72 వేల పూలతో నాలుగు యుగాలు, 14 రకాల థీమ్స్ను అందంగా ఆవిష్కరించారు.

తిరుమల కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 18 రకాల పుష్పాలు, 72 వేల పూలతో నాలుగు యుగాలు, 14 రకాల థీమ్స్ను అందంగా ఆవిష్కరించారు.

Marigold, Chrysanthemum and Gulchhadi Flower Rates Soars during Ganesh Chaturthi Festival in Hyderabad. However, these prices increase two folds by the time flowers reach a retailer or a roadside vendor, especially when turned into garlands. Garlands have become double. పండగ నేపథ్యంలో.. పూల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్లో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. నారింజ, నిమ్మ, గ్రేప్ఫ్రూట్లో విటమిన్ సి, ఫోలేట్తో పాటుగా, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. బీన్స్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి. టోపు, ఎడమామే, సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ను స్థిరంగా ఉంచుతాయి. సోయా ఫుడ్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోకు దాదాపు మిలియన్కు చేరువలో వ్యూస్ రావడం విశేషం. కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్కు చెందిన ఈ క్రికెటర్కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్నెస్, లైఫ్స్టైల్ ఐకాన్లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్లకు మద్దతుగా క్రికెట్లోని అతిపెద్ద ఐకాన్లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి

బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ తన భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఆమెను తలచుకుంటూ ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటోను పూలతో అలంకరించి, భార్య ఫొటోను తన పక్కన ఉంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ యూజర్ సూరజ్ ఎస్ కురుప్ ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధుడైన ఆటో డ్రైవర్ను చూసిన ఆయన, ఆటో ముందు భాగంలో చక్కగా అమర్చిన పూలను గమనించారు. వీడియోలో సూరజ్ తన కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆ పూలు ఎవరి కోసం? అని అడిగారు. డ్రైవర్ నవ్వుతూ తన భార్య ఫొటో వైపు చూపించాడు. ఆమె ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయిందని వివరించాడు. తనకు ఓ కుమారుడు, కుమార్తె, ఆరుగురు మనవళ్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంట్లో ఉండకుండా ఇప్పటికీ ఆటో ఎందుకు నడుపుతున్నారని సూరజ్ అడిగారు. ఇంట్లో కూర్చుంటే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ వివరించాడు. అందుకే ప్రతిరోజూ ఆటో నడుపుతూ, దారిలో ఎదురయ్యే వారితో మాట్లాడుతూ తనను తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నానని చెప్పాడు. పూలు, తన భార్య ఫొటో ఆయన రోజువారీ జీవితంలో భాగంగానే కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఆమె ఉనికిని తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. ఈ సాధారణ సంభాషణ వీడియోను చూసిన వారిని భావోద్వేగానికి గురిచేసింది. భార్య చనిపోయి అన్నేళ్లు గడిచినా ఆమె కోసం పూలు కొని, వాటిని అలంకరిస్తున్న దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదీ చదవండి: 120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు.. కొంతమంది దీనిని ఎన్నటికీ చెక్కుచెదరని ప్రేమకు అందమైన ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు, మరణం తర్వాత కూడా ఇంతే బలంగా నిలిచే ప్రేమ తమ జీవితంలో కూడా ఉండాలని కోరుకునేలా ఈ కథ ఉందని పేర్కొన్నారు. తనకు సమీపంలోనే ఆ డ్రైవర్ నివసిస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఇదే విధంగా ఆయన తన ఆటోను శుభ్రం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cauliflower gobi dishes ban in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఒకవైపు వీకెండ్ , మరోవైపు శ్రావణ మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో విపరీతంగా భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం 31 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు వేచి ఉన్నారు. అంతే కాకుండా శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. టీటీడీ భక్తులకు అల్పాహరం, తాగునీటి సదుపాయాల్ని కల్పిస్తుంది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంది. తిరుమలలో ప్రస్తుతం ప్రతి బుధవారం రోజు ఎస్ఎస్ డీ టొకెన్ల జారీని నిలిపివేశారు. ఇక ఎస్ ఎస్ డీ టొకెన్లు ఉన్నవారికి దర్శనాలకు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. రూ. 300 టొకెన్లు ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇక తిరుమలలో రీల్స్, రాజకీయాలు మాట్లాడటంపై టీటీడీ సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అయితే.. టీటీడీ తిరుమలలో కాలీఫ్లవర్ వంటకాన్ని నిషేధించింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో.. తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. ఇటీవల తిరుమల ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేకచోట్ల గోబీల్లో పురుగులు, కీటకాలు ఉండటంను అధికారులు గుర్తించారు. Read more: తిరుచానూరు ఆలయంలో నేత్రపర్వంగా వరలక్ష్మీ వ్రతం.. బంగారు చీరలో దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు! ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో చైనీస్
శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంది. పూజలు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.హిందువులకు శ్రావణ మాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. మహిళలు తాము ముస్తాబవ్వడమే కాకుండా ఇంటిని కూడా చూడచక్కని విధంగా అలంకరిస్తారు. దాంతో ప్రతి శుభకార్యంలో తప్పక కావాల్సిన తమలపాకు ధరకు రెక్కలు వచ్చాయి. ప్రతీ తాంబూలంలోనూ తమలపాకే ముఖ్యం. తమలపాకు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. దాంతో తమలపాకుతో పాటు అరటిపళ్లు, కొబ్బరి కాయలు, పూల రేట్లకు రెక్కలు వచ్చాయి.రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న చింతలపూడి, మాచవరం, ములుకుదురు ప్రాంతాల్లో తమలపాకు తోటలు ఉన్నాయి. రైతు వద్ద తక్కువకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. తమ కొట్లల్లో మాత్రం భారీగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే పండగ సీజన్లో తమలపాకుకు ఉన్న డిమాండ్ అలాంటిది. రైతు వద్ద 150 ఆకుల కట్టను రూ. 16కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. విడిగా ప్రజలకు మాత్రం ఒక్కొక్కటి రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అయితే 30 ఆకులను రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు.READ ALSO గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!తమలపాకుతో పాటు కొబ్బరి కాయలు కూడా భారీగా పెరిగాయి. శ్రావణ మాసానికి ముందు కొబ్బరి కాయ సైజును బట్టి రూ. 15 నుంచి రూ. 35 మధ్య అమ్మేవారు. ప్రస్తుతం మీడియం సైజు కాయ ధరే రూ. 50 ఉంది. అరటి పళ్లు కూడా గతంలో డజను రూ. 40 నుంచి రూ. 60 వరకు అమ్మేవారు. ఇప్పుడు అదే అరటి కాయ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. యావరేజ్గా రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మేస్తున్నారు.వర్షాభావ పరిస్థితుల్లో పూలకు మంచి డిమాండ్ పెరిగింది. వర్షాలు సరిగా లేకపోవడంతో కాల్వల కింద, బోర్ల కింద పండిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. గతంలో రూ. 200 లోపే

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు పూజలు, కఠిన ఉపవాసాలు, అభిషేకాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో జపతాపాలు, నిత్య పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విధిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో చేసే దానాలు అనంత పుణ్యఫలాలతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.వైదిక శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసే దానాల వల్ల కష్టాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదలకు వారి అవసరాన్ని బట్టి తోచిన సహాయం చేయడం వల్ల సత్కర్మల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మన శక్తి కొద్దీ ఇతరులకు దానధర్మాలు చేయడం ద్వారా ఆ భోళాశంకరుని అనుగ్రహం నేరుగా భక్తులపై ప్రసరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర మాసంలో ఎటువంటి వస్తువులను దానం చేయాలో స్పష్టంగా తెలుసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులలో మొదటిగా చెప్పుకోవాల్సింది.. ఆహార ధాన్యాలు, అన్నదానం. పేదలకు అన్నం పెట్టడం లేదా అవసరమైనన్ని వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను దానంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ విధమైన దానం చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ కొరత రాదని, లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.పూలు, పండ్ల రేట్లు స్కైరాకెట్: ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్కగ్రహ పీడల నివారణ కోసం నల్ల నువ్వులు, కొంత నగదును దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల.. ముఖ్యంగా శని దేవుని ఆగ్రహం, జాతకంలోని శని మహాదశ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, కోర్టు/ఆస్తి

లోయర్ ట్యాంక్బండ్లో గల డా.బీ.ఆర్ అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): లోయర్ ట్యాంక్బండ్లో గల డా.బీ.ఆర్ అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేందిర బోయి ఉత్తర్వులు జారీ చేశారు. లోయర్ ట్యాంక్బండ్లో ఉన్న పాత అంబేడ్కర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, 12 ఏళ్ల నుంచి వినియోగంలో లేదని ఆ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు 10 అంతస్తుల కొత్త భవనంగా నిర్మించాలంటూ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఆర్కిటెక్చరల్, నిర్మాణ సేవల కన్సల్టెన్సీకి రూ.25 కోట్లు కలిపి మొత్తం రూ.108 కోట్లను ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వం మంజూరు చేసింది

వరలక్ష్మి వ్రతం వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. పెరిగిన డిమాండ్ కారణంగా పూలు, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాలు, పూజా ద్రవ్యాల ధరలు భారీగా పెరిగినప్పటికీ, సాంప్రదాయ పండుగ కావడంతో భక్తులు కొనుగోళ్లకు ఏమాత్రం వెనకాడటం లేదు.పండుగ నేపథ్యంలో కనకాంబరం ధర కిలో ఏకంగా 3,000 రూపాయల దరకు పెరిగింది. పండుగ రోజు నాటికి 4,500 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తోన్నారు. మల్లెపూలు కిలో 500 నుండి 800 రూపాయల వరకు పలుకుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించే తామర పూల ధర కూడా అసాధారణంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 15 నుండి 25 రూపాయలు పలికే తామర కాడ.. పండుగ రోజుల్లో 50 నుండి 100 రూపాయల వరకు అమ్ముడవుతోంది.గన్నేరు వంటి సాధారణ పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదివరకు కిలో 100 రూపాయలు ఉన్న గన్నేరు పూలు ప్రస్తుతం 500 రూపాయలకు చేరాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పూల దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైందని చెబుతున్నారు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!ఈ ధరల పెరుగుదల పూలకే పరిమితం కావట్లేదు. పండ్ల రేట్లు కూడా కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఆపిల్, దానిమ్మ, అరటి, బత్తాయి ధరలు కిలోపై 100 రూపాయల వరకు పెరిగాయి. కిందటి వారం వరకూ కిలో 200 రూపాయలు ఉన్న ఆపిల్ ధర ఇప్పుడు 300 రూపాయలకు చేరింది. దేశీ ఆపిల్ ధర కిలో 200 రూపాయలను దాటేసింది. దానిమ్మ పండ్లను కిలో 150 నుండి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అరటి కిలో 80 నుండి 120 రూపాయల మధ్య ఉంటోంది.వాస్తు ప్రకారం మెట్ల

ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..!ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..! August 19 Jyothi Gadda కీళ్ల నొప్పుల నివారణ: జిల్లేడు ఆకులను వేడి చేసి బాధిస్తున్న కీళ్లపై కట్టడం లేదా ఆకుల రసాన్ని క్రమంగా రాయడం వల్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు: జిల్లేడు పువ్వులు లేదా ఆకుల డికాక్షన్ శ్వాసనాళాల్లోని కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడం ద్వారా ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పికి చక్కటి పరిష్కారం: జిల్లేడు ఆకులను మెత్తగా నూరి నుదిటిపై పేస్ట్లా రాయడం వల్ల అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి. చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ: ఆకుల పేస్ట్ లేదా రసాన్ని చర్మంపై పూయడం వల్ల తామర, దురదలు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు పెరగకుండా అరికట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైల్స్ సమస్యకు ఉపశమనం: పైల్స్ గాయాలు, నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పేస్ట్ను గాయంపై తరచూ అప్లై చేయడం వల్ల మంట తగ్గి గాయాలు త్వరగా నయమవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: జిల్లేడు భాగాలను సంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో సరైన మోతాదులో వాడటం వల్ల మలబద్ధకం, విరేచనాలు, కడుపు పూతల వంటి సమస్యలు తగ్గుతాయి. గాయాలను త్వరగా మానపడం: ఈ మొక్కలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరంపైన ఏర్పడే దెబ్బలు, గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో బాగా తోడ్పడతాయి. దంత సమస్యల నివారణ: జిల్లేడు వేరు లేదా పాలు ఆయుర్వేదంలో దంత క్షయం, పంటి నొప్పి, చిగుళ్ల వాపుల నివారణలో ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఎంతగానో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ: జిల్లేడు ఆకుల్లోని ప్రత్యేక గుణాలు శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మరిన్ని

ఒప్పో A6c ఫోన్ 7000mAh బ్యాటరీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్ Oppo A6c Flipkart Deal : సూపర్ ఫోన్ భయ్యా.. ఒప్పో కొత్త ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఒప్పో A6c చౌకైన ధరకే లభిస్తోంది. గత మేలో భారత మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ లాంచ్ కాగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్లో 6.75-అంగుళాల డిస్ప్లే ఉంది. 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు ఆఫర్తో లభిస్తోంది. ఒప్పో A6c ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ : ఒప్పో A6c ఫోన్ను కంపెనీ రూ. 29,999 ధరతో లాంచ్ చేయగా ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ను డిస్కౌంట్తో అందిస్తోంది. అసలు ధరపై 43శాతం డిస్కౌంట్తో లిస్ట్ చేసింది. దాంతో అసలు ధర నుంచి రూ.16,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ. 13వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అదే బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్మి P4s వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీక్..! బ్యాంక్ డిస్కౌంట్ : బ్యాంక్ ఆఫర్తో ఒప్పో A6c అతి చౌకైన ధరకే పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొంటే అదనంగా రూ. 1,325 డిస్కౌంట్ పొందవచ్చు. ఒప్పో A6c స్పెసిఫికేషన్లు : ఒప్పో A6c ఫోన్ 720 × 1570 పిక్సెల్స్ రిజల్యూషన్తో 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో 7000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్

ఆగస్టు నెల డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశం ఇస్తుంది. రైతులు ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఈ మూడు కూరగాయలు పండిస్తే మంచి డబ్బు సంపాదించవచ్చు. ఏయే పంటలు వేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ నెలలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. త్వరలో నవరాత్రులు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. కాబట్టి ఈ పంటలు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఎక్కువ పొలం కూడా అవసరం లేదు. ఆగస్టులో కాలీఫ్లవర్ పండించడం మొదలుపెట్టండి. ఈ సమయంలో నాటిన మొక్కలు అక్టోబర్ నాటికి పంటకొస్తాయి. అప్పటికి క్యాబేజీ ఇంకా మార్కెట్లోకి రాదు. సరఫరా తక్కువగా ఉండటంతో మంచి ధర వస్తుంది. ప్రతి వారం మీ జేబులోకి డబ్బులు రావాలంటే పచ్చిమిర్చి పండించండి. ఆగస్టులో నాటడం చాలా మంచిది. ఒక్కసారి నాటితే కొన్ని నెలల పాటు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఆగస్టు చివరి వారంలో కొత్తిమీర నాటడం ఉత్తమం. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుంది. కేవలం 35 నుంచి 40 రోజుల్లోనే పంట కోతకు సిద్ధమవుతుంది! వర్షాకాలం కావడంతో మార్కెట్లో కొత్తిమీరకు డిమాండ్ ఎక్కువగా, సరఫరా తక్కువగా ఉంటుంది. దీంతో కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. అందుకే లాభాలు కూడా భారీగా ఉంటాయి. Silver Rings: తక్కువ బడ్జెట్లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి! Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది! Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు Kurti Designs: డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి

మన రోజువారి ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. అయితే, నేటి కాలంలో మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో అన్నం తినడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా "వేడి వేడి అన్నం తింటే షుగర్ పెరుగుతుందని తినడమే మానేస్తున్నారు". నిజంగా వేడి అన్నం తింటే డయాబెటీస్ పెరుగుతుందా? చద్దన్నంతిని బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసకోవచ్చా? శాస్త్రీయ దృక్కోణంలో వేడి అన్నం, చద్దన్నం , బ్లడ్ షుగర్ నియంత్రణకు సంబంధించిన ముఖ్య విషయాలను వివరంగా తెలుసుకుందాం. వండిన వెంటనే పొగలు కక్కే వేడి వేడి అన్నాన్ని తినడం వల్ల అందులోని పిండి పదార్థాలు (రైపిడ్లీ డైజెస్టిబుల్ స్టార్చ్) శరీరంలో చాలా వేగంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదలవుతుంది. దీనివల్ల 'బ్లడ్ షుగర్ స్పైక్స్' (రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగడం) ఏర్పడతాయి. తరచూ ఇలా వేడి అన్నం అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరిగి, డయాబెటిస్ నిర్వహణ కష్టతరం అవుతుంది. అన్నాన్ని వండిన తర్వాత చల్లార్చడం లేదా రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టి చద్దన్నంగా మార్చడం వల్ల ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఈ ప్రక్రియలో అన్నంలోని సాధారణ స్టార్చ్ 'రెసిస్టెంట్ స్టార్చ్' (Resistant Starch) గా మారుతుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ చిన్నపేగులో త్వరగా జీర్ణం కాకుండా, నేరుగా పెద్దపేగుకు చేరుకుంటుంది. అక్కడి మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) కు ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. 24 గంటలు ప్రిడ్జ్ లో చల్లారిన అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీనివల్ల తిన్న తర్వాత బ్లడ్ షుగర్ వేగంగా పెరగదు. అయితే దీనికి తగినంత ఫైబర్ ను ఆడ్ చేసుకుని తినడం చాలామంచింది. పీచు పదార్ధాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను దీనికి జత చేసి తింటే బ్లడ్ షుగర్ పెరగడం అనే మాట ఉండదు. అంతే కాదు ఈ రకంగా తినడం వల్ల రెసిస్టెంట్

శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు!శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు! Samatha 15 August 2026 అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. చాలా పవిత్రమైన మాసాల్లో ఇది ముందుంటుంది. ఉపవాస దీక్ష చేస్తూ, నిత్యం శివుడిని ఆరాధిస్తారు. అయితే ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూలతో శివయ్యను పూజించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. శివుడికి మారేడు దళాలు చాలా ఇష్టం. అందువలన శ్రావణ మాసంలో మారేడు దళాలతో పూజ చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుందంట. అంతే కాకుండా ఉమ్మెత్త పూలు కూడా శివుడికి ప్రీతికరమైన పూలు. అందువలన వీటిని శివుడికి సమర్పించడం చాలా మంచిది. జిల్లేడు పూలు కూడా శివుడికి చాలా ఇష్టమైన పూలు. అందువలన వీటిని శివయ్యకు సమర్పించి పూజిస్తే అదృష్టం కలుగుతుం దంట. అలాగే గన్నేరు పూలు కూడా శివ పూజకు చాలా అద్భుతమైనవి వీటిని శివుడికి సమర్పించి పూజ చేయడం వలన అనారోగ్య సమస్యలు తొ లిగిపోతాయి. మోదుగు పూలు శివుడికి చాలా ఇష్టమైన పూలలో ఒకటి. ఈ పూలను శివుడికి సమర్పించడం వలన జీవితంలోని బాధలు తొలిగిపోతాయంట. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పులాగే పొద్దుతిరుగుడు గింజలను కూడా ప్రతిరోజూ గుప్పెడు తినాల్సిన అవసరం ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది. వీటిని నల్లని పొట్టుతో తినవచ్చు. లేదా పొట్టు తీసేస్తే ఇవి తెల్లగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరం. ఇవి కణాలను నష్టం నుండి కాపాడతాయి. విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఇవి చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తాయి. ఈ గింజలను నేరుగా తినొచ్చు లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగు వంటి వాటిపై చల్లుకుని కూడా తినొచ్చు. రోజుకు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పెద్దలే కాదు పిల్లలు కూడా వీటిని తినొచ్చు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పూలు, కూరగాయల కోసం అతిపెద్ద మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఆధునిక పూలు మరియు కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు 200 కోట్ల రూపాయలను కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయించారు.రాష్ట్రంలో పూలు, కూరగాయల సాగు విస్తీర్ణం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పూలకు ప్రత్యేకమైన మార్కెట్ లేదు. గుడిమల్కాపూర్ మార్కెట్లో కూరగాయలతో పాటు పువ్వులను కూడా విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4402 ఎకరాలలో వివిధ రకాల పూలను, 1.03 లక్షల ఎకరాలలో కూరగాయలను సాగు చేస్తున్నారు ఈ సాగులో మొత్తం 60% రాజధానికి చుట్టుపక్కల జిల్లాల రైతులు చేస్తున్న పరిస్థితి ఉంది.200కోట్ల రూపాయలతో పూలు, కూరగాయల మార్కెట్ అయితే పూలు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భారీ పూలు, కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 200కోట్ల రూపాయలను కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో పూలు, కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజిజ్ నగర్, హిమాయత్ నగర్ గ్రామాలలో మొత్తం 39ఎకరాల భూమిని ఈ ప్రయోజనం కోసం కేటాయించారు.బెంగళూరులోని కేఆర్ మార్కెట్ కంటే భారీగా, అధునాతనంగా మార్కెట్ ఇప్పటికే ఈ భూమిని మార్కెటింగ్ శాఖకు బదలాయించి డి పి ఆర్ తయారీ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద పూల మార్కెట్ అయినా బెంగళూరులోని కేఆర్ మార్కెట్ కంటే మెరుగైన సౌకర్యాలతో మరింత అధునాతన ఈ మార్కెట్ ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ మార్కెట్ ను అధికారులు ఇప్పటికే సందర్శించి అధ్యయనం చేశారు.ఈ జిల్లాల వారికి ఈజీగా రవాణా కొత్త కూరగాయలు, పూల మార్కెట్లో విశాలమైన భవనాలు, కోల్డ్
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను ఈజీగా కరిగిస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది. దీనికోసం ప్రతిరోజూ ఉదయం పసుపు టీ తాగితే సరిపోతుంది. మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులు, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు రక్షణ కల్పిస్తాయి. గ్రీన్ టీలోని కెటాచిన్స్ శక్తివంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు మేలు చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్లో మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను రక్షిస్తాయి. యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను శోషించుకుని రక్తంలో లిపిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, వాల్నట్స్, గుమ్మడి, అవిసె లాంటి గింజల్లో స్టిరాల్స్, మెగ్నీషియం, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త నాళాలను శుభ్రంగా మారుస్తాయి

ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పాదన భారీగా పెరిగింది. శ్రీశైలం ఎడమ కాలువ, ప్రియదర్శిని జూరాల, లోయర్ జూరాల, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే 1.67 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండడంతో పెరిగిన ఉత్పత్తి శ్రీశైలం, జూరాల, సాగర్ల్లో కలిపి..శుక్రవారం రాష్ట్రంలో 1.67 కోట్ల యూనిట్ల ఉత్పాదన రాత్రి 12 గంటల తర్వాత పడిపోయిన విద్యుత్ ధరలు హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పాదన భారీగా పెరిగింది. శ్రీశైలం ఎడమ కాలువ, ప్రియదర్శిని జూరాల, లోయర్ జూరాల, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే 1.67 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో శుక్రవారం 9.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ప్రియదర్శిని జూరాలలో 3.28 మిలియన్ యూనిట్లు, లోయర్ జూరాలలో 1.60 మిలియన్ యూనిట్లు, నాగార్జుసాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలో 1.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. మొత్తంగా శుక్రవారం 1.67 కోట్ల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయింది. ఒక్కో యూనిట్ రూ.4 పలుకుతుండగా విద్యుత్ ఉత్పాదన ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది. కాగా, శ్రీశైలంలో ఒక్కోటి 150 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టులో జరిగిన ప్రమాదం వల్ల ఇందులోని నాలుగు యూనిట్లో పూర్తిగా విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. ఈ యూనిట్ను రెండు వారాల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ఈ యూనిట్ అందుబాటులోకి వచ్చి, వరద కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి మరింత పెరగనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం 2.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా రెండువైపుల జలవిద్యుత్ ఉత్పాదనను క్రమంగా పెంచారు. మరోపక్క, అర్ధరాత్రి వేళ విద్యుత్ ధరలు పడిపోయాయి. రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ తగ్గడమే ఇందుకు