
Ayesha Khan : ధురంధర్ ఫేమ్ అయేషా ఖాన్ బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
ధురంధర్ ఫేమ్ అయేషా ఖాన్ (Ayesha Khan) తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

ధురంధర్ ఫేమ్ అయేషా ఖాన్ (Ayesha Khan) తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే సందేహాలు తరచుగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తేలికపాటి స్నాక్గా ప్రాచుర్యం పొందిన..

Aamir Khan | లోకేశ్ కనగరాజ్ ఔట్.. అమీర్ ఖాన్ సూపర్ హీరో ఫిల్మ్పై క్రేజీ టాక్..!
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

సాక్షి, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకూ 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. వేరు వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభివించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరికొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ రోజు బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. వాటిలో అత్యధికంగా నైనిటాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

సింగరేణికి చెందిన భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. హైదరాబాద్, సెప్టెంబర్ 02: సంస్థకు చెందిన భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. సంస్థకు చెందిన భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బుధవారం యాజమాన్యం ఖండించింది. ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత కోసం భూగర్భ గనులను కొనసాగిస్తామని పేర్కొంది. గనులు మూసివేయడం, ప్రైవేటు పరం చేయడం తమ లక్ష్యం కాదన్న సింగరేణి యాజమాన్యం ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టింది. ఉత్పత్తి పెంచి, నిర్వహణ వ్యయాలు తగ్గించి గనులను లాభాల్లోకి తీసుకురావడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యమని యాజమాన్యం వెల్లడించింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శాంతిఖని గనిపై ఈఓఐ (Expression of Interest) కేవలం పైలట్ అధ్యయనం కోసమేనని వివరించింది. ఎండీఓ (మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్) విధానంతో ఖర్చులు, నష్టాలు తగ్గుతాయా? అనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. శాంతిఖని ఈఓఐ ఆధారంగా ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. సంస్థలోని ఉద్యోగులు, వారి కుటుంబాల్లో అనవసర ఆందోళన కలిగించే వార్తలను ప్రచారం చేయొద్దంటూ సింగరేణి విజ్ఞప్తి చేసింది. శాంతిఖని ఈఓఐకి స్పందన రాకపోవడంతో ఈ ప్రక్రియను సింగరేణి విరమించుకున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇందిరాభవన్కు మహేశ్ గౌడ్, మీనాక్షి.. సురేఖ అంశం చర్చించే ఛాన్స్ ఉందన్న టీపీసీసీ చీఫ్

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలు అవినీతి ఆరోపణలు సహా పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నాడు. ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అనుమతి లేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా.. హైకోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది. పాకిస్థాన్ తెహ్రిక్ -ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని పేర్కొంటూ ఆయన సోదరి అలీమా ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటీషన్ వేసింది. బుష్రా బీబీ తరపున ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. ఇకపై వారిని ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ మధ్య సమావేశం జరిగేలా జైలు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించడంతో పాటు జైలు నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యతను అదియాలా జైలు సూపరింటెండెంట్కు అప్పగించింది. ఆదేశాలు అమలు చేసిన తీరుపై 15 రోజుల్లోగా
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఉపశమనం లభించింది. వారికి ఇకపై ఏకాంత నిర్బంధం విధించవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. చట్టం ప్రకారం ఖాన్, ఆయన భార్య సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని అడియాలా జైలు అధికారులకు స్పష్టం చేసింది. జీ ప్రధాని 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో అవినీతి, సంబంధిత కేసుల్లో సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా.. బుష్రా బీబీ కుమార్తె ముబషరా ఖవార్ మనేకా ఆమెకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ ఖాదిమ్ హుస్సేన్ సూమ్రో విచారణ చేపట్టి ఈ తీర్పు వెలువరించారు.జైలు నిబంధనల ప్రకారం ఖాన్ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ సంభాషణలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనలకు అనుగుణంగా ఆయనకు వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు. కోర్టు ఆదేశాలను అమలుచేసి, 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని జైలు సూపరింటెండెంట్కు జస్టిస్ ఖాదిమ్ స్పష్టం చేశారు.జైలులో ఇమ్రాన్ ఖాన్ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, సరైన వైద్య సంరక్షణ కూడా అందజేయడం లేదని ఆయన మద్దతుదారులు, బంధువులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. అవినీతికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో బీబీని 2024 జనవరి 31న జైలుకు పంపారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అదే ఏడాది అక్టోబర్ 24న ఆమె బెయిల్పై విడుదలయ్యారు.మరో అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఆమెను 2025 జనవరి 17న తిరిగి

అవినీతి ఆరోపణలపై మూడేళ్లుగా జైలు జీవితం గడుపుతూ, తరచుగా అనారోగ్యం పాలవుతున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీకి ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ హైకోర్టు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అనంతరం ఇమ్రాన్ తో పాటు ఆయన భార్యకు పలు వెసులుబాట్లు కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.ఇ లార్డ్స్ టెస్టు బాయ్ కాట్ కు పాక్ విఫలయత్నం..? ఇమ్రాన్ కొడుకుల ఇంటర్వ్యూ చిచ్చు..!ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచకూడదని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం వీరిద్దరూ సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టు అడియాలా జైలు అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా, బుష్రా బీబీకి సంబంధించి ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన 21 మాజీ కెప్టెన్లు- భారత్ నుంచి వీరే..!జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఖాదిమ్ హుస్సేన్ ఆదేశించారు.ఇమ్రాన్ ఖాన్ కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనల ప్రకారం వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కూడా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేసేలా చూడాలని, 15 రోజుల్లోగా అమలుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు

ఇంటర్నెట్ డెస్క్: అవినీతి సంబంధిత కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. రావల్పిండిలోని అడియాలా కారాగారంలో ఉన్న ఈ ఇద్దరిని జైలులో ఒంటరిగా నిర్బంధించకుండా చూడాలని అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఇమ్రాన్ను కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని, తన కుమారులతో ఆయన టెలిఫోన్లో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), బుష్రా బీబీలను జైలులో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపిస్తూ.. కుటుంబసభ్యులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఆగస్టు 6న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్కు రోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు ఇవ్వాలని, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదు: పాక్కు సూటిగా చెప్పిన మోదీ 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనీయకుండా, తగిన వైద్య సేవలు అందనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన మద్దతుదారులు, బంధువులు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఇటీవల పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్య పరీక్షల అనంతరం ఇమ్రాన్ను తిరిగి జైలుకు తరలించింది. అల్ షిపా ఆస్పత్రి డాక్టర్ల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని ప్రకటించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. ఇంటర్నెట్ డెస్క్: ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బంక్లో నిలిపి ఉంచిన కారులో.. సీఎన్జీని పైపు ద్వారా నింపుతున్నారు. కారుకు ఆ పైపును పెట్టి వదిలేశారు. బంకులోని వారంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా కారుకు పెట్టి ఉన్న సీఎస్జీ పైపు ఊడిపోయింది. అందులోని గ్యాస్ ఉద్ధృతికి ఆ పైప్ వాయువేగంతో కదిలింది. ఈ పరిణామాన్ని అక్కడ ఉన్న వారెవరూ అసలు ఊహించలేదు. అంతలో అక్కడే ఉన్న వ్యక్తిని ఆ గ్యాస్ పైప్ హ్యాండ్లర్ బలంగా తగిలింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అక్కడి వారంతా భయంతో తలోదిక్కు పరుగులు తీశారు. ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి.. సీఎన్జీని ఆఫ్ చేశాడు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. అతడి పేరు తుషార్ ఖుమ్రీ. ఈ ఘటన ఆగస్ట్ 27వ తేదీన జార్ఖండ్లోని జంషెడుపూర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సహజ వాయువుతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. సీఎన్జీ పైపు అలా వదిలివేయకుండా ఉండి ఉంటే.. ఈ ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు

సింగరేణి కాలరీస్ నష్ట నివారణా చర్యలపై దృష్టి సారిస్తోంది. సింగరేణి కాలరీస్ కు సంబంధించి భూగర్భ గనులలో భారీగా నష్టాలు నమోదు అవుతున్న క్రమంలో కేంద్రం సూచనలను పరిశీలిస్తోంది. భారీ నష్టాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది.సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!నష్టాలను తగ్గించుకునే ఆలోచనలో సింగరేణికేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు గని అభివృద్ధి, నిర్వహణ ఎండీవో విధానంలో ఈ బదిలీ జరుగుతుంది. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ వంటి జాతీయ సంస్థలు ఇదే విధానం ద్వారా నష్టాలను తగ్గించుకున్న నేపథ్యంలో సింగరేణి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!శాంతిఖని భూగర్భ గని త్వరలో ప్రైవేటీకరణమందమర్రి ప్రాంతంలోని శాంతిఖని భూగర్భ గనిని ప్రయోగాత్మకంగా అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఒక ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థ సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి నిర్ణీత ధరకు సింగరేణికి అందిస్తుంది. సింగరేణి ఆ బొగ్గును మార్కెట్లో విక్రయిస్తుంది.రూ.1,924 కోట్లు నష్టాల్లో భూగర్భ గనులుప్రస్తుతం శాంతిఖనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి సుమారు రూ.21,558 ఖర్చవుతుండగా విక్రయ ధర కేవలం రూ.4,167 మాత్రమే. ఆడ్రియాల గనిలో టన్నుకు ఉత్పత్తి వ్యయం రూ.30,333 కాగా విక్రయ ధర రూ.2,492 మాత్రమే. ఒక్క గనిలోనే గతేడాది రూ.302 కోట్లకు పైగా నష్టం వచ్చింది. 2025 చివరి నాటికి 22 భూగర్భ గనుల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. వాటి మొత్తం నష్టం రూ.1,924 కోట్లు దాటింది.సింగరేణి పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకునే ప్రమాదంఇంత నష్టాలలో ఉన్న సింగరేణి గట్టెక్కాలి అంటే ప్రైవేటీకరణ మార్గం అని కేంద్ర బొగ్గు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో ఎండీవో విధానంలో ప్రైవేట్ కు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో విషాదాంతం చోటుచేసుకుంది. గోదావరి నదిలో గల్లంతైన ఆయన భార్య మీనా (55) మృతదేహం శనివారం లభ్యమైంది. ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలకు దీంతో ముగింపు పలికినట్లయింది.వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఏఈ నూకరాజు తన కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో మనవడు కార్తికేయ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో గల్లంతైన మిగతా ముగ్గురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ క్రమంలో ఈ నెల 17న నూకరాజు, 20న ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలను అధికారులు వెలికితీశారు. తాజాగా శనివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన, ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద మీనా మృతదేహాన్ని గాలింపు బృందాలు గుర్తించాయి. మీనా మృతదేహం కూడా లభ్యం కావడంతో నదిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా జలసమాధి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో మరింత బలపడింది. దేశవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్కు ఇప్పుడు మరో కొత్త బిరుదు దక్కింది. అదే ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్స్టార్’ (Indias Biggest superstar). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ప్రమోషనల్ కంటెంట్లో ఈ ట్యాగ్ను ఉపయోగించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో ఈ బిరుదుపై చర్చ మొదలైంది. కొందరు అభిమానులు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ ట్యాగ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శలతో చిత్రబృందం వెనక్కి తగ్గలేదు. తదుపరి విడుదల చేసిన పోస్టర్లలోనూ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్స్టార్’ అనే ట్యాగ్ను కొనసాగించింది. దీంతో అసలు ఈ బిరుదును ప్రభాస్ ఎలా తీసుకున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడైన ప్రణయ్.. ‘రొమాంచకం’ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ రియాక్షన్ను బయటపెట్టారు. “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్స్టార్” అనే ట్యాగ్ గురించి ప్రభాస్కు చెప్పినప్పుడు.. ‘మీ ఇష్టం డార్లింగ్’ అని ఆయన అన్నారు అని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్గా మారింది. తనకు ఇచ్చిన బిరుదుపై ప్రభాస్ ఎలాంటి హైప్ లేకుండా చాలా కూల్గా స్పందించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తనను తాను స్టార్గా చెప్పుకోవడం కంటే.. తన సినిమాలే తన స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా ప్రభాస్ రియాక్షన్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. నవంబర్ 10 లేదా 11న గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించి గెస్ట్ లిస్ట్ విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్లను మాత్రమే ఆహ్వానించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇతర ప్రధాన స్టార్లకు ఆహ్వానాలు అందలేదనే వార్త అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఇద్దరి వివాహబంధం గురించిన వార్తలు 2025 నుంచే నిరంతరం ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఆ సమయంలో అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వార్తలను సాధారణ సరదా పోస్ట్తో కొట్టిపారేశాడు. అయితే 2026 జూన్ నెలలో అనిరుధ్ మేనమామ వై.జీ. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో వీరి పెళ్లి వార్త నిజమేనని స్పష్టంగా వెల్లడించారు. కావ్య మారన్ సామర్థ్యాన్ని కొనియాడుతూ వీరి వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన ధృవీకరించారు. అనంతరం ఆగస్టు నెలలో పలు సంస్థలు దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల్లోనే గ్రీస్లో పెళ్లి జరగనుందని కథనాలను ప్రచురించాయి. దక్షిణాది చిత్రసీమలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పనిచేసిన అనిరుధ్ అతిథుల జాబితాను పరిమితం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విజయ్, ధనుష్ వంటి అగ్ర కథానాయకులతో అనిరుధ్కు అత్యంత బలమైన కెరీర్ సంబంధాలు మరియు హిట్లు ఉన్నాయి. దీంతో కొందరికే ఆహ్వానం అందించడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేవలం రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్లను మాత్రమే పిలవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అనిరుధ్కు ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

Husband Killed Case : వివాహేతర సంబంధాలతో భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ప్రేమవివాహం చేసుకున్న మహిళ.. భర్త షాపులో పనిచేసే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజుల తరువాత భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. భర్త మృతిని కారు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఇద్దరు మైనర్లతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఉత్తరాఖండ్ లోని రామ్నగర్కు చెందిన సంజీవ్ కుమార్ (24) టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహించేవాడు. ఐదేళ్ల క్రితం సంజీవ్ కుమార్, నిషాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ వివాహంకు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను ఎదిరించి నిషాను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే, కొంతకాలం తరువాత భర్త టెంట్ హౌస్లో పనిచేసే 17ఏళ్ల బాలుడితో నిషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. సంజీవ్ కుమార్ ను హత్య చేసేందుకు తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాలుడిని పురమాయించింది. దీంతో అతను మరో మైనర్ బాలుడితో కలిసి ఆగస్టు 16న తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల పేరుతో నిషా భర్త సంజీవ్ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఒప్పించారు. కారులో సంజీవ్ డ్రైవింగ్ చేస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న మైనర్ బాలుడు తుపాకీతో సంజీవ్ మెడపై కాల్పులు జరిపాడు. దీంతో సంజీవ్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఇద్దరు మైనర్ బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. సంజీవ్ కారు ప్రమాదంలో మరణించినట్లుగా నిషా అందరిని నమ్మించింది. పోలీసు కేసు కావడంతో నిబంధనల ప్రకారం సంజీవ్ కుమార్ కు

10 అంగుళాల పిజ్జాకు ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఇంటికి చేరింది మాత్రం 7 అంగుళాల పిజ్జా. సైజు మూడు అంగుళాలు తగ్గిందని వినియోగదారుడు వదిలిపెట్టలేదు. రిఫండ్ కోసం పోరాడాడు. చివరికి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. ఇప్పుడు ఆ పిజ్జా ధర కంటే 20 రెట్లు ఎక్కువ పరిహారం పొందాడు.ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రూ.505 విలువైన 10 అంగుళాల పిజ్జాను ఓ వినియోగదారుడు ఆర్డర్ చేశాడు. డెలివరీ వచ్చిన తర్వాత సైజు చూసి ఆశ్చర్యపోయాడు. అది కేవలం 7 అంగుళాల పిజ్జా అని తేలింది.దీనిపై వెంటనే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ కస్టమర్ సపోర్ట్ను సంప్రదించాడు. రిఫండ్ ఇవ్వాలని కోరాడు. కానీ అతడి అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్, సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్ను ఆశ్రయించాడు. లీగల్ నోటీసు కూడా పంపించాడు. ఫలితం లేకపోవడంతో వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశాడు.విచారణ జరిపిన కమిషన్.. వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే సైజు పిజ్జాను పంపడం సేవల్లో లోపమని తేల్చింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతేనని పేర్కొంది.ఫుడ్ డెలివరీ సంస్థ, రెస్టారెంట్ కలిసి వినియోగదారుడికి రూ.10,520 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిజ్జా ధర రూ.505, డెలివరీ ఛార్జీలు రూ.15 ఉన్నాయి. మానసిక, శారీరక వేధింపులకు రూ.5,000 పరిహారం చెల్లించాలని చెప్పింది. కేసు ఖర్చుల కింద మరో రూ.5,000 ఇవ్వాలని ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.తాము కేవలం రెస్టారెంట్లు, వినియోగదారుల మధ్య మధ్యవర్తులమని ఫుడ్ డెలివరీ సంస్థ

Love Affairs: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీమిండియాను ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రావల్పిండి జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిణామాల మధ్య, గతంలో బాలీవుడ్ అందాల భామలతో ఆయన నడిపిన సీక్రెట్ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు నాయకుడిగా దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. 70వ దశకంలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జీనత్ అమన్, ఇమ్రాన్ ఖాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. క్రికెట్ టూర్ల సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ప్రేమాయణం గురించి వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ఈ బంధం ఎక్కువ కాలం నిలవకపోయినా, ఇప్పటికీ వీరిద్దరి పేరు చర్చకు వస్తూనే ఉంటుంది. ఇది కూడా చదవండి: Sachin vs Kohli: సచిన్ కంటే కోహ్లీనే తోపు.. ఏం వాగుతున్నావ్ బ్రో..సౌతాఫ్రికా దిగ్గజం పై నెటిజన్లు ఫైర్ బెంగాలీ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మున్మున్ సేన్తో ఇమ్రాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్షిప్ అప్పట్లో ముఖ్యాంశంగా మారింది. ఇమ్రాన్ ఆకర్షణకు మున్మున్ సేన్ ఫిదా అయ్యారని, వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని కథనాలు వచ్చాయి. ఇద్దరూ బహిరంగంగా తమ బంధాన్ని ధ్రువీకరించనప్పటికీ, వీరి కలయిక అప్పట్లో బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. దిగ్గజ నటి షబానా ఆజ్మీ పేరు కూడా ఇమ్రాన్ ఖాన్తో ముడిపడి ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహంపై ఆ రోజుల్లో పత్రకాయల్లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై ఇటు శబానా ఆజ్మీ గానీ, అటు ఇమ్రాన్ ఖాన్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇదంతా కేవలం మీడియా సృష్టించిన పుకారుగానే మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా సల్మాన్ ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. గతంలో సంగీతా బిజ్లానీ, సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్ వంటి తారలతో ఆయన నడిపిన ప్రేమకథలు బాలీవుడ్లో ఎంతగానో చర్చనీయాంశమయ్యాయి. పెళ్లిపీటల వరకు వెళ్లి ఆగిపోయిన ఆయన వివాహ బంధంపై ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వలన జరిగింది. ఈమధ్య ఏఐ పెళ్లి వీడియోలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ టామ్ హలండ్, జెండయా ఏఐ పెళ్లి వేడుక ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగే ఏఐ ద్వారా సల్మాన్ ఖాన్కు అత్యంత అట్టహాసంగా పెళ్లి జరిగింది. ఈ వీడియోలో పెళ్లికూతురు ముఖాన్ని ఎవరికీ కనిపించకుండా మల్లెపూల దండలతో మూసి ఉంచడం విశేషం. ఈ అపూర్వ వివాహ మహోత్సవానికి భారతీయ చిత్రసీమలోని తారల ప్రపంచమంతా కదిలి వచ్చినట్లు ఏఐ సాంకేతికత ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ఏఐ పెళ్లి వీడియోలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్లు సన్నాయి వాయిస్తుండగా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు అదిరిపోయే స్టెప్పులతో రచ్చ చేశారు. ఇక దక్షిణాది చిత్రసీమ నుంచి టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్లతో పాటు కోలీవుడ్, మోలీవుడ్, శాండల్వుడ్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోలు ఈ పెళ్లికి హాజరై సల్మాన్ను ఆశీర్వదిస్తున్నట్లు చూపించారు. వీడియో చివర్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. రియాలిటీకి చాలా దగ్గరగా, ఎంతో క్రియేటివ్గా ఉన్న

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే ఉంటారు. 2012 అక్టోబర్లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు ఇద్దరు కుమారులు – తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan) ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే ఉంటారు. 2012 అక్టోబర్లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు ఇద్దరు కుమారులు – తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. ఇద్దరి పిల్లల జననం సమయంలోనూ కరీనా తన ఫిట్నెస్, ప్రెగ్నెన్సీ ఫ్యాషన్తో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు ఆమె మూడోసారి గర్భవతి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం తీవ్రంగా సాగుతోంది. ఇటీవల ఆమె ముంబైలో ఒక జిమ్ వెలుపల కనిపిస్తున్న వీడియో ఆధారంగా, ఆమె బేబీ బంప్తో ఉందంటూ నెటిజన్లు ప్రెగ్నెన్సీ ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే, ఈ రూమర్స్ వెలువడటానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే కరీనా షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఆగస్టు 16న భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కరీనా తన ఇన్స్టాగ్రామ్లో వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె బికినీ ధరించి ఎంతో స్లిమ్గా, ఫిట్గా కనిపించింది. ఆ ఫోటోలలో ఎక్కడా బేబీ బంప్ ఆనవాళ్లు లేవు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం అంత ఫిట్గా ఉన్న కరీనా, ఉన్నపళంగా జిమ్ వెలుపల లూజ్ కాస్ట్యూమ్లో బేబీ బంప్తో ఎలా కనిపిస్తుందంటూ నెటిజన్లు విపరీతంగా చర్చించుకుంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లో బేబీ బంప్ రావడం సాధ్యమేనా?.. లేదా అది కేవలం కెమెరా యాంగిల్, ఆమె వేసుకున్న వదులైన దుస్తుల వల్ల వచ్చిన పొరపాటా? అని ఫ్యాన్స్ తలలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన్ స్పందిస్తూ... నిరంతరం డెత్ సెల్లో ఉంచి, బయటి ప్రపంచంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడనివ్వకుండా సుదీర్ఘకాలం పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచడం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని తన సోదరుడు తనతో చెప్పారని తెలిపారు. ఇది తనకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ను సుదీర్ఘంగా ఒంటరిగా ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి బీపీ, గుండె సంబంధిత తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్రాన్ కు పూర్తిస్థాయి మెరుగైన వైద్యం అందించాలని, రాజకీయ కక్షసాధింపులకు స్వస్తి చెప్పాలని పీటీఐ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

Prashanth Varma’s Mahakali Movie Release Date: ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)ను మరింత విస్తరించే పనిలో ఉన్నారు. విభిన్నమైన కథలు, భారతీయ పురాణాలు, సూపర్ హీరో కాన్సెప్ట్స్ను కలిపి సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న ఆయన.. ‘జై హనుమాన్’తో పాటు ‘మహాకాళి’ ప్రాజెక్ట్ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మహాకాళి ప్రాజెక్ట్కు ప్రత్యేక స్థానం ఉండబోతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా మహాకాళి సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు సూపర్ హీరో కథల్లో పురుష పాత్రల ఆధిపత్యం ఎక్కువగా కనిపించగా.. మహాకాళిలో కాళీదేవి స్ఫూర్తితో స్త్రీ శక్తిని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. ఆగస్టు 24న మహాకాళి మాస్ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ గ్లింప్స్లో సినిమాకు సంబంధించిన విజువల్స్, కథా ప్రపంచం, పాత్రలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈరోజు మహాకాళి రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమా బరిలోకి దిగనుంది. 2027 జనవరి 8న మహాకాళి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రవితేజ నటించిన ‘ఇరుముడి’ మార్నింగ్ షో అనంతరం మీడియాకు మహాకాళికి సంబంధించిన ప్రత్యేక టీజర్ను ప్రదర్శించారు. గూస్బంప్స్ తెప్పించేలా ఈ టీజర్ను కట్ చేశారు. టీజర్లోని విజువల్స్, కాన్సెప్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ‘హనుమాన్’తో సూపర్ హీరో జానర్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ‘మహాకాళి’తో స్త్రీ శక్తిని సూపర్ హీరో ప్రపంచంలో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా

ఇంటర్నెట్ డెస్క్: వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) కోచ్లోకి దూరేందుకు 10 అడుగుల కొండచిలువ (Python) యత్నించింది. దీంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. దెహ్రాదూన్-ఆనంద్ విహార్ వందేభారత్ ఎక్స్ప్రెస్ వాషింగ్ కోసం గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో హరిద్వార్ స్టేషన్లోని ‘వాషింగ్ లైన్’ వద్దకు చేరుకుంది. సిబ్బంది దానిని శుభ్రం చేస్తుండగా.. ఓ కొండచిలువ కోచ్లోకి దూరేందుకు యత్నిస్తుండడాన్ని గమనించారు. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్కు చేరుకున్న హరిద్వార్ ఫారెస్ట్ రేంజ్ బృందం రెండు గంటల పాటు శ్రమించి కొండచిలువను పట్టుకుంది. అనంతరం దానిని సురక్షితంగా అడవిలో వదిలేశారు. ఇదీ చదవండి: వరదలో చిక్కుకున్న వృద్ధురాలిని మోసుకెళ్లిన ఆశా వర్కర్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది

సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు టైటిల్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SVC63. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్కు ‘మాన్స్టర్’ (Monster) అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ వింటేనే బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే రేంజ్ వైబ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్కు సంబంధించి సినీ ప్రియుల మైండ్ బ్లాంక్ అయ్యే మరో బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) థియేట్రికల్ ప్రింట్లకు సల్మాన్ ఖాన్ ‘మాన్స్టర్’ టీజర్ను అటాచ్ చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు బిగ్ స్క్రీన్పై రజనీకాంత్ విధ్వంసం, దానికి తోడు సల్మాన్ ఖాన్ ‘మాన్స్టర్’ టీజర్ జతకలిస్తే థియేటర్లలో బాక్సాఫీస్ సునామీ రావడం ఖాయమని సినీ లవర్స్, ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే ఇద్దరు అతిపెద్ద మెగాస్టార్ల మాస్ పవర్ ఒకేసారి థియేటర్లలో కనిపించనుండటం సినీ వర్గాల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండటంతో నార్త్, సౌత్ అనే తేడా

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పీటీఐ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇమ్రాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దాదాపు మూడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అనంతరం మళ్లీ రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించింది. ఆరోగ్యం చక్కబడే వరకూ ఇమ్రాన్ ఖాన్ను ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్కు త్వరలో తన ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే అవకాశం కూడా రావొచ్చని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి ఇమ్రాన్ రీఎంట్రీకి ఇది తొలి అడుగు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇమ్రాన్ విడుదల వెనుక ఏదో డీల్ జరిగే ఉంటుందని కొందరు అన్నారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. గురువారం అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్ను ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.73 ఏళ్ల ఇమ్రాన్కు ఆరుగురు నిపుణులైన వైద్యులతో కూడిన బృందం పరీక్షలు చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె దడ, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను పరిశీలించారు. కుడి కంటికి గతంలో తలెత్తిన సమస్యపై కూడా పరీక్షలు నిర్వహించారు.పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. జైలులోనే ఉండటం సురక్షితమని వైద్య బృందం సూచించింది.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇమ్రాన్ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించారు.ఆగస్టు 2023లో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, నిర్బంధం పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వేకువ జామున ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చేర్చారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండి లోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా వెలుగులోకి రాలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.. ఇమ్రాన్ ఖాన్ ను తాజా ఆసుపత్రికి తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను తరలించే సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు రాకుండా భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.2022 ఏప్రిల్ వరకు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. అనంతరం తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ కూడా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ వాదిస్తోంది. బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.పాకిస్తాన్ కు చుక్కలే: కేంద్రం డేగకన్ను: ఏకంగా రూ. 1,943 కోట్లతో మెరుపు తీగెలు లీజ్శిక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. అడియాలా జైలు గోడల మధ్య దాదాపు 1,111 రోజుల పాటు అంటే మూడేళ్లకు పైగా సుదీర్ఘ ఖైదు అనుభవిస్తూ వస్తోన్నారాయన. ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయటికొచ్చారు. హైబీపీ

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్మన్ గిల్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇప్పుడు ఒక్క ఇండియన్ సినిమా మార్కెట్ లోనే కాకుండా ప్రపంచ సినిమా దగ్గరే భారతీయ సినిమాని సగర్వంగా ముందుకి తీసుకెళ్తున్న ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ వేసిన దారి లోనే అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్టార్ట్ చేసిన ట్రెండ్ తోనే ప్రపంచ వ్యాప్తంగా రీచ్ ని సొంతం చేసుకోవాలని అనేక సినిమాలు, మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ కొందరిలో టార్గెట్ అయ్యింది అనే మాట కూడా వాస్తవం. ముఖ్యంగా బాలీవుడ్ లో ఓ సెక్షన్ తెలుగు సినిమాలు, ఆడియెన్స్ మరియు దర్శకుల పట్ల సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ ఇంకొక సెక్షన్ మాత్రం తమ అక్కసు బయటపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆ లిస్ట్ లో ఇపుడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేరడం సోషల్ మీడియాలో టాలీవుడ్ యువత నడుమ చర్చగా మారింది. ఆ మధ్య అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ విషయంలో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో ఎవరో నెటిజన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు అన్నీ ప్లాప్స్ అయ్యాయని ఓ లిస్ట్ పెడితే దానికి వ్యంగ్యంగా సపోర్ట్ చేస్తూ ‘ఊప్స్’ అంటూ సిద్ధార్థ్ ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీనితో ఇక మన తెలుగు యువత తగులుకున్నారు. వార్, పఠాన్ లాంటి సినిమాలు ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి హీరోతో కింగ్ సినిమా వంటివి చేస్తున్నప్పటికీ సిద్ధార్థ్ ఆనంద్ ఎందుకు ఇలాంటి ఆలోచనా ధోరణితో ఉండిపోయాడు అంటూ సోషల్ మీడియాలో తన రిప్లైకి మరింత పదునైన రిప్లైలు అందిస్తున్నారు. అయితే మన సినిమాలు ప్లాప్ అయ్యాయి అని చెప్పిన వ్యక్తి పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు కానీ సిద్ధార్థ్ రిప్లై మాత్రం ఉండిపోయింది. అయితే ఇదేమి సిద్ధార్థ్ సైడ్ నుంచి ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య ప్రభాస్ ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ స్పిరిట్

‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. ఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో తన ప్రసంగం అనంతరం చోటుచేసుకున్న ‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హల్ద్వానీలో తాను ప్రసంగించిన వేదికను అనంతరం ‘శుద్ధి’ చేశారనే అంశంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి ఖర్గే వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగించిన వేదికను కొందరు ‘ప్రక్షాళన’ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఖర్గే గతంలో బహిరంగంగానే స్పందించారు. తన ప్రసంగం అనంతరం అదే ప్రదేశంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన కుల వివక్షకు సంబంధించినదిగా పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ వివాదంపై పార్టీకి చెందిన పలువురు నాయకులు తనకు మద్దతుగా స్పందించకపోవడం ఖర్గేను బాధించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు ఇలాంటి సందర్భంలో నేతల నుంచి మద్దతు ఉంటుందని ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. సొంత పార్టీ నేతల మౌనం తనను నిరాశకు గురిచేసిందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ

హైదరాబాద్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీ నెట్వర్క్కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీ నెట్వర్క్కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాక్ ఐఎస్ఐ నెట్వర్క్తో హైదరాబాద్కు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా 253 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 253 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు అరెస్టైనట్లు గుర్తించారు. వీరికి గాజియాబాద్కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్కు కీలక లింకులు ఉన్నట్లు బయటపడింది. జాయిద్ ఖాన్.. ఫిబ్రవరిలో మేడ్చల్లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్తో పరిచయం ఏర్పడిందని, అనంతరం ఐఎస్ఐ సానుభూతిపరులతో జాయిద్ ఖాన్ చాటింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఐఏఎస్ సానుభూతిపరులు హమీద్, రాణా హుస్సేన్లతో జాయిద్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్.. వీరి చాటింగ్పై నిఘా పెట్టింది. తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు నగల బ్యాగ్ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uttarakhand School Holidays: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా నారాయణ్బగడ్ ప్రాంతంలో హింసాత్మక కుక్కల బెడద విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ్ బాగ్లోని 10 పాఠశాలలకు ఏకంగా నాలుగు రోజులను సెలవులుగా మంజూరు చేశారు. అయితే ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు ఆన్లైన్లో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మధ్య నారాయణబగడ్ వరుసగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పాఠశాలకు రాకపోకలు సాగించేటప్పుడు పిల్లలను ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడమే థ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆన్లైన్ తరగతులను ప్రతిపాదించడం జరిగింది. అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థులతో అనుసంధానమై వారికి బోధిస్తారు. దీనివల్ల సాధారణ తరగతులు మూసివేసినప్పటికీ పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని అనవసరంగా బయటకు వెళ్లనివ్వవద్దని కూడా కోరారు. దూకుడు స్వభావం గల కుక్కల ఉనికి పాఠశాల విద్యార్థులకే కాకుండా స్థానిక నివాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతాలలో ప్రజలు

Ayesha Khan Engagement Photos: 'ధురంధర్' సినిమాలోని 'షరారత్' పాటతో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ప్రముఖ నటి ఆయేషా ఖాన్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని కొత్త ఫోటోలు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఆయేషా ఖాన్ ఇటీవల ఒక అపరిచితుడితో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. ఈ చిత్రాలలో ఆమె చేతికి ధరించిన వజ్రపు ఉంగరం స్పష్టంగా కనిపించడంతో, నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిపోయిందంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వైరల్ ఫోటోలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగానే రహస్య నిశ్చితార్థం కావచ్చని కొందరు అభిమానులు భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ఏదైనా నగల బ్రాండ్ (జ్యూయెలరీ ఫోటోషూట్) ప్రమోషన్లో భాగమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. నటి ఆయేషా ఖాన్ కానీ, ఆమె టీమ్ కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రంలోని 'షరారత్' పాటలో ఆయేషా గ్లామరస్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో తాను పడిన ఇబ్బందులను ఇటీవల ఆమె పంచుకున్నారు. నెలసరి సమయంలోనూ షూటింగ్లో పాల్గొనాల్సి రావడంతో శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయి కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు. గమనిక: ఆయేషా ఖాన్ లేదా ఆమె బృందం నుండి స్పష్టత వచ్చే వరకు ఈ నిశ్చితార్థ వార్తలను కేవలం ఊహాగానాలుగానే భావించాలి

రెండు నెలల్లోపు డిమాండ్లను నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమిస్తామని స్పష్టీకరణ హేమంత్ సోరెన్ సర్కార్కు పరీక్షార్థుల అల్టిమేటమ్ రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం గత 25 రోజులుగా ఉద్యమిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థులు రాంచీలోని జైపాల్సింగ్ ముండా స్టేడియంలో తమ నిరసనకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పాత పరీక్షల రద్దు, జేపీఎస్సీ,జేఎస్ఎస్సీల్లో అస్తవ్యçస్త విధానాలు, పరీక్ష విధానంలో లోపాలను రూపుమాపాలంటూ తాము చేసిన డిమాండ్ల, పలు అంశాలను రెండు నెలల్లోపు పరిష్కరించాలని హేమంత్ సోరెన్ సర్కార్కు ఉద్యమనేతలు బుధవారం అల్టిమేటమ్ ఇచ్చారు. 22 నియామక పరీక్షలను, పబ్లిక్ సర్వీస్కమిషన్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిర్వహించిన మరో 23 పరీక్షలను రద్దుచేస్తున్నట్లు సోరెన్ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఉద్యమనేతలు ఇలా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘మా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం. నియామక పరీక్షల్లో అక్రమాలపై సమగ్రస్థాయిలో దర్యాప్తుతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి రెండు నెలల గడువిస్తున్నాం. ఆలోపు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిచేయకపోతే మళ్లీ ఉద్యమాన్ని మొదలెడతాం’’అని జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి పియూశ్ కుమార్ సింగ్ స్పష్టంచేశారు. ఉద్యమానికి విరామం ప్రకటించిన నేపథ్యంలో గత 15 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రూపేశ్ కుమార్ పాల్, సవితా కుమారీ, రాహుల్ క్రాంతిలు దీక్షను విరమించారు. 26 రోజుల ఉద్యమధాటికి ప్రభుత్వం 22 రిక్రూట్మెంట్ ఎగ్జామ్లను, 23 ఇతర పరీక్షలను రద్దుచేసిందని మంచ్ నేత రవీంద్ర పాశ్వాన్ చెప్పారు. ‘‘ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలను బయటపెట్టిన ప్రజావేగు(విజిల్బ్లోయర్), ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్ మస్తానాను సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. గత పరీక్షల రద్దు నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయే వారి మీద మాకు సానుభూతి ఉంది. ఈ విషయంలో తప్పు అంతా ప్రభుత్వానిదే’’అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు)

రాంచీ: పరీక్షార్థుల ఉద్యమధాటికి 45 పరీక్షలను జార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేస్తూ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేయడంతో గత పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకిస్తూ ఆందోళనలను ఉధృతంచేశారు. బుధవారం వందలాది మంది అభ్యర్థులు రాంచీలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమ సమస్యల్ని వివరిస్తామంటూ అభ్యర్థులు సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. దీంతో వీళ్లను ప్రధాన కార్యాలయం లోపలి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన అభ్యర్థులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. ప్రాంగణంలోకి రాకుండా అక్కడ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాసరే వాటిని లెక్కచేయకుండా పోలీసులను తోసుకుంటూ అభ్యర్థులు సెక్రటేరియట్ ప్రాంగణంలోకి వెళ్లి బైఠాయించారు. పరీక్షల్లో అక్రమాల కోణంలో దర్యాప్తు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మొత్తం పరీక్షల రద్దు అంటే తమ ఉద్యోగభవిష్యత్తు అంధకారంలో పడుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకునే దురుద్దేశం మాకు లేదు. శాంతియుతంగా ధర్నాలుచేసేందుకు మాకు ఒకటి, రెండు ధర్నాస్థలిలను ప్రభుత్వం సూచించింది. అక్కడ నిరసనలు ఆగవు. పరీక్షల్ని రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్ను ఉపసంహరించుకునేదాకా మా ఆందోళనలు కొనసాగుతాయి’’అని అభ్యర్థుల నేత, ఇటీవల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం పొందిన చందన్ కుమార్ స్పష్టంచేశారు. హైకోర్టులో పలువురి పిటిషన్లు.. పరీక్షల్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్చేస్తూ పలువురు అభ్యర్థులు బుధవారం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘పరీక్షల్ని రద్దుచేస్తే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. కుటుంబాలు వీధిన పడతాయి. అభ్యర్థుల భవిష్యత్ నాశనమవుతుంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుంటున్న అభ్యర్థులకు ఉపశమనం కల్పించేలా తగు ఆదేశాలు ఇవ్వండి. ప్రభుత్వ నిర్ణయం అమలుకాకుండా నిలువరించండి’’అని అద్వేష్ కుమార్ తదితరులు పిటిషన్లు దాఖలుచేశారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల

అయేషా ఖాన్ (Ayesha Khan) గురించి పరిచయం అక్కర్లేదు. “ధురంధర్” సినిమాలో సూపర్ హిట్ ఐటెం సాంగ్ లో కనిపించి ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులరైంది ఈ బ్యూటీ. అందుకే ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగింది. దాంతో, ఆమెకి ఇన్ స్టా లో ప్రొమోషన్ ల కోసం భారీగా డబ్బులు ముట్టచెప్తున్నాయి బ్రాండ్స్. తాజాగా ఒక బ్రాండ్ కోసం ఒక ఫోటోషూట్ చేసి చేసింది. ఐతే మొదట ఫోటోలు షేర్ చేసినప్పుడు జనం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుందేమో అని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే చేతికి రింగ్ పెట్టుకొని ఒక అబ్బాయిని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేసింది. ఆ అబ్బాయి ఫేస్ కనిపించకుండా ‘ఎంగేజ్డ్” అన్నట్లుగా మెసెజ్ పెట్టింది. దాంతో ఎవరా లక్కీ గై అంటూ అభిమానులు ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మరిన్ని ఫోటోలు అప్లోడ్ చేసి క్లారిటీ ఇచ్చింది. ఒక నగల బ్రాండ్ కోసం చేసిన యాడ్ అది అని అర్థం అయింది. ఆమె నిశ్చితార్థం కాదు. ఆయేషా ఖాన్ తెలుగులో కూడా నటించింది. “ముఖ చిత్రం”, “ఓం భీం బుష్”, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, “మనమే” వంటి నాలుగు చిత్రాల్లో నటించింది. ఐతే, “ధురంధర్”లో “శరరత్” పాటతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది

ఆయేషా ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇందులో ఉన్న మిస్టరీ మ్యాన్ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చేతికి మెరుస్తున్న డైమండ్ రింగ్ ఉండటంతో, ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద అడుగు వేసిందని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు 'ఇదొక కల' అని చిన్న క్యాప్షన్ పెట్టడంతో, ఇది ఎంగేజ్మెంట్ ప్రకటన అయ్యుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఆయేషా మాత్రం ఇప్పటివరకు తన ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయేషా ఖాన్ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. 2022లో ఆమె ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నటించింది. అయేషా ఖాన్ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన క్రేజీ సెలెబ్రిటీ. ధురంధర్ మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ తో నేషనల్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకుంది

రియా చక్రవర్తి తన కొత్త ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇల్లు తను ఊహించినట్లే చాలా స్టైలిష్గా ఉంది. ఫిల్మ్మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ను రియా తన ఇంటికి ఆహ్వానించింది. ఫరా ఖాన్ ఇంటిలోని ప్రతీ మూలను చూసి, దాని డిజైన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఫరా ఖాన్ తన కుక్ దిలీప్తో కలిసి ప్రైవేట్ లిఫ్ట్ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టారు. మరోవైపు ఉన్న గ్లాస్ డోర్స్ వల్ల ఇల్లు మరింత విశాలంగా, ఓపెన్గా కనిపిస్తోంది. ఇంటి ఇంటీరియర్స్లో ఎక్కువగా తెలుపు రంగే వాడారు. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తోంది. లివింగ్ రూమ్ను ఓపెన్-ప్లాన్ లేఅవుట్లో డిజైన్ చేశారు. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ ఏరియా కలిసిపోయి ఉన్నాయి. ఇంటిలో ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉన్న కిటికీలు ప్రధాన ఆకర్షణ. వీటివల్ల గదిలోకి సహజమైన వెలుతురు బాగా వస్తుంది. దీంతో ఇల్లు మరింత విశాలంగా అనిపిస్తుంది. ట్రాక్ లైట్లు, ఆధునిక ఫిక్చర్స్ అన్నీ మినిమలిస్ట్ డెకర్లో చక్కగా కలిసిపోయాయి. ఫర్నిచర్ కూడా ఇంటికి ప్రత్యేక అందాన్ని తెచ్చింది. క్రీమ్ కలర్ రగ్ మధ్యలో ఒక రౌండ్ కాఫీ టేబుల్ ఉంది. దాని చుట్టూ ఒక వైట్ సోఫా, సేజ్ గ్రీన్ సోఫా, విక్టోరియన్-స్టైల్ యాక్సెంట్ చైర్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో నాలుగు సీట్ల రౌండ్ టేబుల్ ఉంది. దానిపై ప్లేట్లు, గ్లాసులు, కత్తిపీటలు చక్కగా అమర్చారు. దగ్గర్లోనే పువ్వులతో అలంకరించిన వైట్ స్టోరేజ్ క్యాబినెట్ ఉంది. ఇండోర్ ప్లాంట్స్ లివింగ్ స్పేస్కు పచ్చదనాన్ని జోడిస్తున్నాయి. ఆ తర్వాత ఫరా ఖాన్, రియాను తన బెడ్రూమ్ చూపించమని అడిగింది. ఆ గది కొంచెం చిందరవందరగా ఉందని రియా చెప్పినా, లోపలికి అడుగుపెట్టిన ఫరా మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆ గదిలో పెద్ద కిటికీలు, గ్లాస్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి. దీనివల్ల గది చాలా ప్రకాశవంతంగా, విశాలంగా కనిపిస్తుంది. ఇది గదిలా కాకుండా, ఓ ఇల్లులా

ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో పులి దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామ్నగర్లోని గర్జియా ప్రాంతంలో పర్యాటకులు చూస్తుండగానే ఓ బెంగాల్ టైగర్ తన ప్రతాపం చూపించింది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో పులి దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామ్నగర్లోని గర్జియా ప్రాంతంలో పర్యాటకులు చూస్తుండగానే ఓ బెంగాల్ టైగర్ తన ప్రతాపం చూపించింది. గుర్రంపై దాడి చేసి, దాన్ని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనను పర్యాటకులు తమ కెమెరాల్లో చిత్రీకరించారు (Jim Corbett Tiger Attack). గర్జియా ప్రాంతంలోని ఓ కూడలి సమీపంలో ఓ పులి ఒక్కసారిగా గుర్రంపై దాడి చేసింది. అనంతరం గుర్రం మెడను నోటితో పట్టుకుని అడవి లోపలికి లాక్కెళ్లింది. సఫారీ వాహనాల్లో ఉన్న పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి గుర్రాన్ని ఈడ్చుకెళ్తున్న సమయంలో కొందరు పిల్లలు భయంతో కేకలు వేయడం వీడియోలో వినిపించింది. పర్యాటక వాహనాలు దగ్గర్లోనే ఉన్నప్పటికీ, పులి ఏమాత్రం భయపడకుండా తన ఆహారాన్ని అడవిలోకి తీసుకెళ్లింది (Tiger Attacks Horse). జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దేశంలోనే అత్యధిక పులులను కలిగిన అభయారణ్యాల్లో ఒకటి (Tiger Attack Video). ప్రస్తుతం ఇక్కడ 260కి పైగా బెంగాల్ పులులు ఉన్నట్లు అంచనా. ఈ అభయారణ్యానికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అడవిని సందర్శించే వారితో పాటు ప్రసిద్ధ గర్జియా ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.. పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్

భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ, తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రాబోతోంది. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanuman) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను విస్తరిస్తూ ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma), తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’ (Mahakali). భారతదేశపు మొట్టమొదటి ఫిమేల్ సూపర్ హీరో చిత్రంగా భారీ కాన్వాస్పై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ అందించారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna).. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అక్షయ్ ఖన్నా రాక్షసుల గురువైన ‘శుక్రాచార్య’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను పరిచయం చేస్తూ ఆగస్ట్ 24న చిత్ర బృందం ‘ఫస్ట్ గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘ఆగస్టు 24 - ది ఎండ్ బిగిన్స్’ అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటన సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక పురాణ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రోహిత్ సరాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, మూల కాన్సెప్ట్ అందించగా, ప్రతిభావంతురాలైన పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవితంలోని వివాదాస్పద ఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారంలో ఉన్న 'కాలా హిరన్' చిత్ర వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సినిమా టీజర్తో పాటు అన్ని ప్రచార సామగ్రిని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చిత్ర నిర్మాత అమిత్ జానీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.1998 నాటి కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని, ఇది తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని సల్మాన్ ఖాన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా టీజర్లోని ఒక పాత్ర, తాను ధరించే నీలిరంగు బ్రాస్లెట్ను పోలిన ఆభరణాన్ని ధరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 'కాలా హిరన్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ' చిత్ర టీజర్, ప్రచార విజువల్స్, సంబంధిత ఇంటర్వ్యూ లింకులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ తీర్పు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని పేర్కొంటూ నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సినిమా నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన తన పిటిషన్లో ఆరోపించారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dog costume in Khandwa collectorate Madhya Pradesh: సాధారణంగా చాలా మంది ప్రభుత్వాలు సరిగ్గా ప్రజలకు కావాల్సిన సదుపాయలు, ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే నిరసనలు చేస్తారు. కొంత మంది ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు వినూత్నంగా నిరసనలు చేస్తారు. దీనితో ఓవర్ నైట్ లో ఫెమస్ అయి ఉన్నతాధికారుల వరకు వీరి బాధలు చేరుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వాలో ఒక వ్యక్తి తమ గ్రామంలో కొన్ని రోజులుగా ఉన్న కుక్కల బెడదను లేకుండా చేయాలని అధికారుల చుట్టు తిరిగాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో వెరైటీ నిరసలు చేయాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా ఖాండ్వాలోని కలెక్టర్ ఆఫీసు లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు దీపక్ రాథోర్ వెరైటీగా కుక్క మాదిరిగా కాస్ట్యూమ్ ను వేసుకున్నాడు. నేరుగా కలెక్టర్ కు శునకంలా వేషం వేసుకుని మరీ వెళ్లి గత నాలుగేళ్లలో కుక్కల సంతాన నిరోధక కార్యక్రమాలపై రూ. 40 లక్షలు ఖర్చు చేయగా, 13, 225 కుక్కకాటు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం యొక్క ఖర్చు, అమలుపై విచారణ జరపాలని ఆయన కలెక్టరేట్ ఆఫీస్ లో తమ గొడును చెప్పుకున్నారు. నగరంలో ఇంత ఖర్చుచేసిన కూడా వీధి శునకాల కాటులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇటీవల కుక్క కాటు ఘటనలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. Read more: Snake Video: ఏంటాలెంట్ భయ్యా.!. పాము బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..?.. వీడియో వైరల్

నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది. తమ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన మొత్తంలో 20 శాతాన్ని వెంటనే ఎఫ్.డి.సి.లో జమ చేయమని కోరింది. తెలుగు సినిమాల టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల పచ్చ జెండా ఊపింది. అయితే అందుకు ఓ షరతును విధించింది. నిర్మాతలు ఎవరైనా సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవాలని అనుకుంటే, పెంచిన టిక్కెట్ ఛార్జీలలోని లాభంలో ఇరవై శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడానికై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో జమ చేయాలని చెప్పింది. అందుకు కొందరు నిర్మాతలు ఆమోదం తెలిపి, తమ చిత్రాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి సిద్థపడ్డారు. అలా గత యేడాది డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ 'అఖండ 2' సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారూ', ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాలు ఉన్నాయి. అలానే ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా సైతం టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఉపయోగించుకుంది. కానీ ఈ నలుగురు నిర్మాతలు ఇంతవరకూ టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా వచ్చిన లాభంలో ఇరవై శాతాన్ని ఎఫ్.డి.సి.లో నమోదు చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఈ నాలుగు సినిమాల నిర్మాణ సంస్థలకు లేఖ రాసింది. ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి, ఎఫ్.డి.సి.లో జమ చేయాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదే అని స్పష్టం చేసింది. ఆ రకంగా 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్ ఇండియా, వృద్ధి సినిమాలకు లేఖను పంపింది. మరి వీరు ఎప్పటిలోగా ఆ డబ్బుల్ని జమ చేస్తారో చూడాలి

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే ప్రధాన కారణమని తేలింది. ప్రాణాలతో బయటపడిన ఏఈ మనవడు కార్తికేయ ఇచ్చిన సమాచారంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాధిక్ఖాన్పై హత్యాయత్నం, ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా మరో ఐదు కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఉప్పు అనుకుని సర్ఫ్ పౌడర్ వడ్డింపు.. 40 మంది పిల్లలకు అస్వస్థత!మభ్యపెట్టి కుటుంబాన్ని బందీగా చేసుకున్న వైనం షూటింగ్ అకాడమీ నడుపుతున్నషేక్ సాధిక్ ఖాన్.. తన వద్దకు షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన బాలుడిని అడ్డుపెట్టుకుని అతడి తల్లి సౌజన్యతో(నూకరాజు కూతురు) సన్నిహితంగా మెలిగాడు. మాటలతో మభ్యపెట్టి ఆ ఇంట్లోని వ్యవహారాలన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. వారి వద్ద ఉన్న విలువైన బంగారం, నగదు, బ్యాంక్ ఏటీఎం కార్డులతో పాటు ఆస్తి పత్రాలను కూడా లాక్కున్నాడు. ఆ కుటుంబం బయటకు చెప్పలేని విధంగా తీవ్ర మానసిక హింసకు గురిచేస్తూ నరకం చూపించాడు.వెలుగులోకి వచ్చిన లేఖ.. భర్తను విషమిచ్చి చంపాడంటూ ఆవేదన నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే ముందు అందుకు గల కారణాలను లేఖలో రాసి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా.. కూతురు సౌజన్య మరో లేఖ రాసి స్కూటర్ డిక్కీలో ఉంచింది. పోలీసులకు లభ్యమైన సౌజన్య లేఖలోని విషయాలు అధికారులను తీవ్రంగా కలిచివేశాయి. జులై 2న తన భర్త జగదీశ్వరరెడ్డి చనిపోవడం వెనుక సాధిక్ ఖాన్ హస్తం ఉందని.. అతడే విష పదార్థమిచ్చి చంపేశాడని ఆమె ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బెదిరించాడని, మతం మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. నిలకడలేని బంగారం ధరలతో రిస్క్ రెట్టింపు: నేడు మళ్లీ.. !!గాలింపు చేపట్టిన

ఇంటర్నెట్ డెస్క్: నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు పరోక్షంగా ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్గణ్ ( Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం-ఎఫ్డీఏ (Maharashtra FDA) షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఒక నిషేధిత ఉత్పత్తిని ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి ఆహార నియంత్రణ సంస్థకు చట్టపరమైన అధికారం ఉందా? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. మరి దీనికి చట్టం ఏం చెబుతోంది? సూపర్స్టార్లకు నోటీసులు జారీ చేసిన తుకారాం ముంఢే (Tukaram Mundhe) ఎవరు..? ఇలాచీ పేరుతో ప్రసారమవుతోన్న ప్రకటనలో నటించినందుకు గానూ.. 2006 నాటి ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని 24, 53 సెక్షన్ల కింద ఎఫ్డీఏ.. ఈ సెలబ్రిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటన వల్ల నిషేధిత ఉత్పత్తికి పరోక్ష ప్రచారం జరుగుతోందా?అనేది తాము పరిశీలించనున్నామని ఎఫ్డీఏ కమిషనర్ తుకారం ముంఢే చెబుతున్నారు. ఈ ఉత్పత్తుల ప్రచారంలో మీ పాత్ర ఏమిటి? ప్రకటనకు ముందు ఉత్పత్తిపై, దాని చట్టబద్ధతపై ఎలాంటి పరిశీలన చేశారు? వంటి వాటిపై వివరణ ఇవ్వాలని నటులను ఎఫ్డీఏ ఆదేశించింది. తమ ఎండార్స్మెంట్ ఒప్పందాలు, క్యాంపెయిన్ వివరాలు, ఉత్పత్తి సమాచారం, చెల్లింపుల వివరాలు, ప్రకటన సంస్థ, బ్రాండ్ యజమాని తదితర సమాచారాన్ని సమర్పించాలని తెలిపింది. అలాగే, ఈ ప్రచార కంటెంట్ను తమ సోషల్ మీడియా ఛానెళ్ల నుంచి తొలగించాలని, తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు ఈ నటులకు 15 రోజుల గడువు కల్పించింది. ఇలాంటి కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం రూ.10లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. నిషేధిత

ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లు నటించిన ‘విమల్ ఇలాచీ’ ప్రకటన తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుండా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, ఈ పరిణామం ‘సరోగెట్ అడ్వర్టైజింగ్’ (పరోక్ష ప్రకటనలు) కేసులలో సెలబ్రిటీల చట్టపరమైన బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది.మహారాష్ట్రలో 2026 జులై నుంచి పాన్ మసాలా తయారీ, అమ్మకం, నిల్వపై నిషేధం అమల్లో ఉంది. అయితే, ‘విమల్ ఇలాచీ’ పేరుతో వస్తున్న ప్రకటన, పాన్ మసాలాను గుర్తుచేసేలా ఉందని ఎఫ్డీఏ అభిప్రాయపడింది. ఆగస్టు మధ్యలో జారీ చేసిన ఈ నోటీసుల్లో, సదరు యాడ్ నుంచి తప్పుకోవాలని, సోషల్ మీడియా నుంచి దానికి సంబంధించిన కంటెంట్ను తొలగించాలని నటులను ఆదేశించింది. 15 రోజుల్లోగా తమ వివరణతో పాటు, ఎండార్స్మెంట్ ఒప్పంద వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.ఈ చర్యను ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే గట్టిగా సమర్థించారు. ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం ప్రకారం ప్రకటనల గొలుసులో భాగమైన తయారీదారులు, ప్రచురణకర్తలు, స్పాన్సర్లు, ప్రచారకర్తలు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. "ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ఆయన హెచ్చరించారు. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, మొదటి దశలో రూ

పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆస్తుల కోసం నరకం.. ఇస్లాంలోకి మారాలని నా కోడలిపై ఒత్తిడి మానసికంగా తీవ్ర వేధింపులు.. నా కుమారుడి మృతిలోనూ అతడి పాత్ర! షూటర్ సాదిక్ ఖాన్పై పోలీసులకు ఏఈ నూకరాజు వియ్యంకుడి ఫిర్యాదు కేసు నమోదు.. నూకరాజు భార్య, కుమార్తె కోసం గాలింపు ముమ్మరం కాకినాడ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నూకరాజు తన భార్య మీనా, కుమార్తె కొవ్వూరి సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితోసహా ఆదివారం రాత్రి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డి గత నెల రెండో తేదీన మరణించారు. అయితే, తన కుమారుడి మరణానికి సాదిక్ ఖానే కారణమని ఆరోపిస్తూ జగదీశ్వర్రెడ్డి తండ్రి, నూకరాజు వియ్యంకుడు భాస్కర్రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తన మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా, ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు. సాధిక్తోపాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి, అల్లుడి మరణానికీ సాధికే కారణం అనే కోణంలో అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.మరోవైపు గోదావరిలోకి దూకేందుకు ముందు నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో ఉంచిన మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. సాదిక్ తనను, తన కుటుంబ సభ్యులను ఎలా వేధిస్తున్నాడనే విషయాలను వాటిలో ప్రస్తావిస్తూ లెటర్ రాసినట్టుగా భాస్కర్రెడ్డి తెలిపారు. అంతేకాదు తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డిని ఏదో మందు ఇచ్చి సాదిక్ఖాన్ చంపినట్టు సౌజన్య ఆ లెటర్లో రాసిందని పోలీసులకు చెప్పారు. సౌజన్య ప్రైవేటు విషయాలను

ఓం భీం బుష్, ముఖచిత్రం, మనమే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. లాంటి పలు సినిమాలలో బోల్డ్ గా నటించి మెప్పించిన బాలీవుడ్ భామ అయేషాఖాన్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలకు.. ఒక కల. మీకు నచ్చిన సహజ వజ్రపు నిశ్చితార్థపు ఉంగరాన్ని ఇక్కడ వెతుక్కోండి అంటూ ఓ సంస్థ పేరు పెట్టడంతో ఇది ఎంగేజ్మెంట్ రింగ్ ప్రమోషనల్ ప్రకటనా లేక నిజంగానే నిశ్చితార్థం చేసుకుందా అనే డైలమాలో పడేసింది అందర్నీ. బాలీవుడ్ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అయేషాఖాన్ తెలుగు, బాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ షోలు చేస్తుంది