
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది
దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్ర్యం అని వివరించారు. తొలిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతరం గీతాన్ని ఆలపించామని అన్నారు. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని ప్రధాని మోదీ తెలిపారు. సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే.. సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందన్నారు. శౌచాలయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు 3 రెట్ల వేగంతో నిర్మించామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల సదుపాయాలు పెంచామని వివరించారు. ఆత్మనిర్భర భారత్ సాధనే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మూడు ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు చేపట్టాయని గుర్తు చేశారు. ఏడెనిమిదేళ్లలో దాదాపు 8 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం
