
తిరుమల కల్యాణ వేదికలో పుష్పప్రదర్శనశాలప్రారంభం
తిరుమల కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 18 రకాల పుష్పాలు, 72 వేల పూలతో నాలుగు యుగాలు, 14 రకాల థీమ్స్ను అందంగా ఆవిష్కరించారు.

తిరుమల కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 18 రకాల పుష్పాలు, 72 వేల పూలతో నాలుగు యుగాలు, 14 రకాల థీమ్స్ను అందంగా ఆవిష్కరించారు.

Marigold, Chrysanthemum and Gulchhadi Flower Rates Soars during Ganesh Chaturthi Festival in Hyderabad. However, these prices increase two folds by the time flowers reach a retailer or a roadside vendor, especially when turned into garlands. Garlands have become double. పండగ నేపథ్యంలో.. పూల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు. మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది. వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే

బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ తన భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఆమెను తలచుకుంటూ ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటోను పూలతో అలంకరించి, భార్య ఫొటోను తన పక్కన ఉంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ యూజర్ సూరజ్ ఎస్ కురుప్ ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధుడైన ఆటో డ్రైవర్ను చూసిన ఆయన, ఆటో ముందు భాగంలో చక్కగా అమర్చిన పూలను గమనించారు. వీడియోలో సూరజ్ తన కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆ పూలు ఎవరి కోసం? అని అడిగారు. డ్రైవర్ నవ్వుతూ తన భార్య ఫొటో వైపు చూపించాడు. ఆమె ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయిందని వివరించాడు. తనకు ఓ కుమారుడు, కుమార్తె, ఆరుగురు మనవళ్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంట్లో ఉండకుండా ఇప్పటికీ ఆటో ఎందుకు నడుపుతున్నారని సూరజ్ అడిగారు. ఇంట్లో కూర్చుంటే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ వివరించాడు. అందుకే ప్రతిరోజూ ఆటో నడుపుతూ, దారిలో ఎదురయ్యే వారితో మాట్లాడుతూ తనను తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నానని చెప్పాడు. పూలు, తన భార్య ఫొటో ఆయన రోజువారీ జీవితంలో భాగంగానే కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఆమె ఉనికిని తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. ఈ సాధారణ సంభాషణ వీడియోను చూసిన వారిని భావోద్వేగానికి గురిచేసింది. భార్య చనిపోయి అన్నేళ్లు గడిచినా ఆమె కోసం పూలు కొని, వాటిని అలంకరిస్తున్న దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదీ చదవండి: 120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు.. కొంతమంది దీనిని ఎన్నటికీ చెక్కుచెదరని ప్రేమకు అందమైన ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు, మరణం తర్వాత కూడా ఇంతే బలంగా నిలిచే ప్రేమ తమ జీవితంలో కూడా ఉండాలని కోరుకునేలా ఈ కథ ఉందని పేర్కొన్నారు. తనకు సమీపంలోనే ఆ డ్రైవర్ నివసిస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఇదే విధంగా ఆయన తన ఆటోను శుభ్రం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: ప్రపంచ మార్కెట్లలో బంగారం మరోసారి దూసుకుపోతోంది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు వరుసగా మూడో వారంలోనూ లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ వారం మాత్రమే దాదాపు 5 శాతం పెరిగిన బంగారం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పెరుగుదల వెనుక ఒకే కారణం కాకుండా అనేక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కలిసి పనిచేస్తున్నాయి. డాలర్ బలహీనత ప్రధాన కారణం: బంగారం ధరల పెరుగుదలకు ప్రస్తుతం అతిపెద్ద కారణం అమెరికా డాలర్ బలహీనపడటం. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం చౌకగా మారుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల అమెరికా ట్రెజరీ తీసుకున్న బాండ్ బైబ్యాక్ నిర్ణయాల తర్వాత డాలర్ మే నెల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకోవడం బంగారానికి భారీ మద్దతు ఇచ్చింది. అమెరికా రుణభారం ఆందోళనలు: అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచుతోంది. భవిష్యత్తులో డాలర్ విలువ మరింత తగ్గే అవకాశం ఉందనే భావనతో చాలామంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. అందుకే ప్రస్తుతం బంగారాన్ని "కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణ కవచం"గా చూస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడం కూడా బంగారానికి అనుకూలంగా మారింది. ఇటీవల వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు, మందగించిన ఉద్యోగ వృద్ధి, తగ్గిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయొచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు స్థిరంగా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cauliflower gobi dishes ban in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఒకవైపు వీకెండ్ , మరోవైపు శ్రావణ మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో విపరీతంగా భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం 31 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు వేచి ఉన్నారు. అంతే కాకుండా శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. టీటీడీ భక్తులకు అల్పాహరం, తాగునీటి సదుపాయాల్ని కల్పిస్తుంది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంది. తిరుమలలో ప్రస్తుతం ప్రతి బుధవారం రోజు ఎస్ఎస్ డీ టొకెన్ల జారీని నిలిపివేశారు. ఇక ఎస్ ఎస్ డీ టొకెన్లు ఉన్నవారికి దర్శనాలకు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. రూ. 300 టొకెన్లు ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇక తిరుమలలో రీల్స్, రాజకీయాలు మాట్లాడటంపై టీటీడీ సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అయితే.. టీటీడీ తిరుమలలో కాలీఫ్లవర్ వంటకాన్ని నిషేధించింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో.. తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. ఇటీవల తిరుమల ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేకచోట్ల గోబీల్లో పురుగులు, కీటకాలు ఉండటంను అధికారులు గుర్తించారు. Read more: తిరుచానూరు ఆలయంలో నేత్రపర్వంగా వరలక్ష్మీ వ్రతం.. బంగారు చీరలో దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు! ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో చైనీస్

క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో గరిష్ఠంగా 4.8 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో 24.5 శాతం లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్లను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడం బిట్కాయిన్ జోరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో దీర్ఘకాలిక బాండ్ రాబడులు తగ్గాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది.బిట్కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి తీసుకున్న భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీంతో క్రిప్టో ధర మరింత వేగంగా పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా మే తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్కు సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 13 ఈటీఎఫ్ల్లోకి ఈ వారం ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.2025 అక్టోబర్లో బిట్కాయిన్ దాదాపు 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 80 వేల డాలర్లకు చేరువగా దూసుకెళుతోంది

ఈ సారి తెలుగు నేలను వరుణ దేవుడు కరుణించకపోయినా.. కృష్ణమ్మ మాత్రం అన్నదాతకు అండగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎగువను కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక స్థిరంగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 44,720 క్యూసెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. దీనికి అనుగుణంగా డ్యామ్ అధికారులు దిగువ ప్రాంతాలకు 35,315 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి నీటి నిల్వ పరిమాణాన్ని, ఇన్ ఫ్లో వివరాలను జలవనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 875.80 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా, ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 167.4860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాబోయే గంటల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోటెత్తుతున్న కృష్ణమ్మ- శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం, గేట్లు ఎత్తివేత..!!ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి.. కుడి గట్టున తాత్కాలిక విరామంవరద నీటి రాక నేపథ్యంలో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితిని సరిచేసి త్వరలోనే అక్కడ కూడా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.అక్కడ అన్ని గేట్లు ఎత్తివేత- శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లుఅధికారులు అప్రమత్తంరాబోయే సమయంలో ఎగువ నుంచి ప్రవాహాలు మరింత పుంజుకునే సూచనలు ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, దిగువ ప్రాంత

గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత రూపాయి శుక్రవారం ట్రేడింగ్లో తీవ్ర గందరగోళానికి గురైంది. ఒక్కో దశలో మంచి లాభాల్లోకి దూసుకెళ్లినప్పటికీ... అంతిమంగా స్వల్ప లాభంతో ముగిసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కేవలం 3 పైసలు పుంజుకుని 95.71 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్లలో డాలర్ కొంత బలహీనపడటం రూపాయికి కలసివచ్చినప్పటికీ, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయి దూకుడుకు అడ్డుకట్ట వేశాయి.ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఉదయం రూపాయి 95.69 వద్ద లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించింది. ఒక దశలో గరిష్ఠంగా 95.65 స్థాయికి చేరుకుని ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో వెంటనే కోలుకున్న డాలర్ ధాటికి ఒకానొక సమయంలో 95.75 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి గురువారం నాటి ముగింపు (95.74) కంటే కేవలం 3 పైసలు మాత్రమే మెరుగై 95.71 వద్ద ట్రేడింగ్ను ముగించింది.గడువు కుదింపు.. ఒక్కసారిగా $56 బిలియన్ల వరద!గడిచిన 30 రోజుల్లో అతిపెద్ద పరిణామం ఏమిటంటే.. ప్రత్యేక విదేశీ డిపాజిట్ పథకానికి (FCNR-B) ఇచ్చిన గడువును ఆర్బీఐ ఆగస్టు 31 వరకు కుదించింది. ఈ ముందస్తు ఆదేశంతో ఒక్కసారిగా విదేశీ కరెన్సీ భారత్కు పోటెత్తింది. దీనిద్వారా దేశంలోకి ఏకంగా 56.84 బిలియన్ డాలర్ల నిధులు రాగా, మొత్తం విదేశీ నిధుల ప్రవాహం 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఈ నిధుల వరద రూపాయి పతనానికి బలమైన అడ్డుకట్టగా మారింది.చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్కు ఊరట!రూ.707 బిలియన్లకు చేరిన విదేశీ కరెన్సీ నిల్వలుగత కొద్ది వారాల్లో భారత్ ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా $14.13 బిలియన్లు పెరిగి $707 బిలియన్ మార్కును అధిగమించాయి. ఈ బలమైన ఆర్థిక పునాదితో ఆర్బీఐ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను కట్టడి చేస్తూ, రూపాయి విలువను నిలకడగా
శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంది. పూజలు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.హిందువులకు శ్రావణ మాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. మహిళలు తాము ముస్తాబవ్వడమే కాకుండా ఇంటిని కూడా చూడచక్కని విధంగా అలంకరిస్తారు. దాంతో ప్రతి శుభకార్యంలో తప్పక కావాల్సిన తమలపాకు ధరకు రెక్కలు వచ్చాయి. ప్రతీ తాంబూలంలోనూ తమలపాకే ముఖ్యం. తమలపాకు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. దాంతో తమలపాకుతో పాటు అరటిపళ్లు, కొబ్బరి కాయలు, పూల రేట్లకు రెక్కలు వచ్చాయి.రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న చింతలపూడి, మాచవరం, ములుకుదురు ప్రాంతాల్లో తమలపాకు తోటలు ఉన్నాయి. రైతు వద్ద తక్కువకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. తమ కొట్లల్లో మాత్రం భారీగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే పండగ సీజన్లో తమలపాకుకు ఉన్న డిమాండ్ అలాంటిది. రైతు వద్ద 150 ఆకుల కట్టను రూ. 16కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. విడిగా ప్రజలకు మాత్రం ఒక్కొక్కటి రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అయితే 30 ఆకులను రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు.READ ALSO గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!తమలపాకుతో పాటు కొబ్బరి కాయలు కూడా భారీగా పెరిగాయి. శ్రావణ మాసానికి ముందు కొబ్బరి కాయ సైజును బట్టి రూ. 15 నుంచి రూ. 35 మధ్య అమ్మేవారు. ప్రస్తుతం మీడియం సైజు కాయ ధరే రూ. 50 ఉంది. అరటి పళ్లు కూడా గతంలో డజను రూ. 40 నుంచి రూ. 60 వరకు అమ్మేవారు. ఇప్పుడు అదే అరటి కాయ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. యావరేజ్గా రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మేస్తున్నారు.వర్షాభావ పరిస్థితుల్లో పూలకు మంచి డిమాండ్ పెరిగింది. వర్షాలు సరిగా లేకపోవడంతో కాల్వల కింద, బోర్ల కింద పండిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. గతంలో రూ. 200 లోపే

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు పూజలు, కఠిన ఉపవాసాలు, అభిషేకాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో జపతాపాలు, నిత్య పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విధిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో చేసే దానాలు అనంత పుణ్యఫలాలతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.వైదిక శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసే దానాల వల్ల కష్టాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదలకు వారి అవసరాన్ని బట్టి తోచిన సహాయం చేయడం వల్ల సత్కర్మల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మన శక్తి కొద్దీ ఇతరులకు దానధర్మాలు చేయడం ద్వారా ఆ భోళాశంకరుని అనుగ్రహం నేరుగా భక్తులపై ప్రసరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర మాసంలో ఎటువంటి వస్తువులను దానం చేయాలో స్పష్టంగా తెలుసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులలో మొదటిగా చెప్పుకోవాల్సింది.. ఆహార ధాన్యాలు, అన్నదానం. పేదలకు అన్నం పెట్టడం లేదా అవసరమైనన్ని వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను దానంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ విధమైన దానం చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ కొరత రాదని, లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.పూలు, పండ్ల రేట్లు స్కైరాకెట్: ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్కగ్రహ పీడల నివారణ కోసం నల్ల నువ్వులు, కొంత నగదును దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల.. ముఖ్యంగా శని దేవుని ఆగ్రహం, జాతకంలోని శని మహాదశ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, కోర్టు/ఆస్తి

వరలక్ష్మి వ్రతం వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. పెరిగిన డిమాండ్ కారణంగా పూలు, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాలు, పూజా ద్రవ్యాల ధరలు భారీగా పెరిగినప్పటికీ, సాంప్రదాయ పండుగ కావడంతో భక్తులు కొనుగోళ్లకు ఏమాత్రం వెనకాడటం లేదు.పండుగ నేపథ్యంలో కనకాంబరం ధర కిలో ఏకంగా 3,000 రూపాయల దరకు పెరిగింది. పండుగ రోజు నాటికి 4,500 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తోన్నారు. మల్లెపూలు కిలో 500 నుండి 800 రూపాయల వరకు పలుకుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించే తామర పూల ధర కూడా అసాధారణంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 15 నుండి 25 రూపాయలు పలికే తామర కాడ.. పండుగ రోజుల్లో 50 నుండి 100 రూపాయల వరకు అమ్ముడవుతోంది.గన్నేరు వంటి సాధారణ పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదివరకు కిలో 100 రూపాయలు ఉన్న గన్నేరు పూలు ప్రస్తుతం 500 రూపాయలకు చేరాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పూల దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైందని చెబుతున్నారు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!ఈ ధరల పెరుగుదల పూలకే పరిమితం కావట్లేదు. పండ్ల రేట్లు కూడా కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఆపిల్, దానిమ్మ, అరటి, బత్తాయి ధరలు కిలోపై 100 రూపాయల వరకు పెరిగాయి. కిందటి వారం వరకూ కిలో 200 రూపాయలు ఉన్న ఆపిల్ ధర ఇప్పుడు 300 రూపాయలకు చేరింది. దేశీ ఆపిల్ ధర కిలో 200 రూపాయలను దాటేసింది. దానిమ్మ పండ్లను కిలో 150 నుండి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అరటి కిలో 80 నుండి 120 రూపాయల మధ్య ఉంటోంది.వాస్తు ప్రకారం మెట్ల

ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..!ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..! August 19 Jyothi Gadda కీళ్ల నొప్పుల నివారణ: జిల్లేడు ఆకులను వేడి చేసి బాధిస్తున్న కీళ్లపై కట్టడం లేదా ఆకుల రసాన్ని క్రమంగా రాయడం వల్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు: జిల్లేడు పువ్వులు లేదా ఆకుల డికాక్షన్ శ్వాసనాళాల్లోని కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడం ద్వారా ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పికి చక్కటి పరిష్కారం: జిల్లేడు ఆకులను మెత్తగా నూరి నుదిటిపై పేస్ట్లా రాయడం వల్ల అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి. చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ: ఆకుల పేస్ట్ లేదా రసాన్ని చర్మంపై పూయడం వల్ల తామర, దురదలు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు పెరగకుండా అరికట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైల్స్ సమస్యకు ఉపశమనం: పైల్స్ గాయాలు, నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పేస్ట్ను గాయంపై తరచూ అప్లై చేయడం వల్ల మంట తగ్గి గాయాలు త్వరగా నయమవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: జిల్లేడు భాగాలను సంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో సరైన మోతాదులో వాడటం వల్ల మలబద్ధకం, విరేచనాలు, కడుపు పూతల వంటి సమస్యలు తగ్గుతాయి. గాయాలను త్వరగా మానపడం: ఈ మొక్కలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరంపైన ఏర్పడే దెబ్బలు, గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో బాగా తోడ్పడతాయి. దంత సమస్యల నివారణ: జిల్లేడు వేరు లేదా పాలు ఆయుర్వేదంలో దంత క్షయం, పంటి నొప్పి, చిగుళ్ల వాపుల నివారణలో ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఎంతగానో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ: జిల్లేడు ఆకుల్లోని ప్రత్యేక గుణాలు శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మరిన్ని

జలాశయంలో ప్రస్తుతం 169 టీఎంసీలే 40 వేలకుపైగా క్యూసెక్కులతో తెలంగాణ విద్యుదుత్పాదన ఏపీ వాడుకున్నది 9,718 క్యూసెక్కులు సాగర్కు 50,673 క్యూసెక్కులు విడుదల శ్రీశైలం/విజయపురి సౌత్/అచ్చంపేట, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఎగువ నుంచి వచ్చిన వరదతో వా రం క్రితం 879.50 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 876.20 అడుగులకు తగ్గింది. డ్యాం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 169 టీఎంసీలే ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కుడి, ఎడమగట్టు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఏపీ కుడిగట్టున 9,718 క్యూసెక్కుల నీటిని వినియోగించగా, ఎడమ గట్టున తెలంగాణ 40,955 క్యూసెక్కులు వాడింది. సోమవారం మొత్తంగా 50,673 క్యూసెక్కులను దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేశా రు. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం బాగా తగ్గిపోయింది. ఆలమట్టి నుంచి 23,325 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. నారాయణపూర్ నుంచి 20,783 క్యూసెక్కులు జూరాలకు వస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 37,313 క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్కు విడుదల చేశారు. తుంగభద్రకు 16,923 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 7880 క్యూసెక్కులు వదులుతున్నారు. వార్తలు కూడా చదవండి... నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ Read Latest AP News And Telangana News And National News And Telugu News
ఇడ్లీ, దోశె పిండి రాత్రి రుబ్బి పెట్టుకుంటే…తెల్లారేసరికి పొంగిపోతూ ఉంటుంది. దానివల్ల కిచెన్ చిందర వందరగా అయిపోతుంది. అందుకే పెద్ద గిన్నెలో వేసి పెడతారు. సౌత్ ఇండియాలో టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశె కామన్. అవి లేకపోతే టిఫిన్ కంప్లీట్ కాదు. రోజూ చేసుకోయాలంటే పిండి రుబ్బడం, కలపడం శ్రమతో కూడిన పని. అందుకే ముందే కాస్త ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజూ వేసుకుంటారు. ఇడ్లీ, దోశె అంటే ముందు రోజు రాత్రే పిండి రుబ్బి పులియబెట్టాలి. ఇలాంటి సమయంలో ఎదురయ్యే పెద్ద చిరాకు.. పిండి పొంగి గిన్నెలోంచి బయటకు వచ్చేయడం. ఉదయం లేచి చూస్తే కిచెన్ కౌంటర్టాప్ అంతా పడిపోయింటుంది. దాన్ని శుభ్రం చేయడం అదో పెద్ద తలనొప్పి. ఎంత పెద్ద గిన్నె వాడినా కొన్నిసార్లు పిండి పొంగిపోతుంది. ఈ సమస్యకు మా అమ్మమ్మల కాలం నాటి ఒక సింపుల్, అద్భుతమైన కిచెన్ హ్యాక్ ఉంది. పిండి గిన్నెలోంచి బయటకు రాకుండా ఆపాలంటే మీకు కావాల్సింది కేవలం ఒక చిన్న స్టీల్ గ్లాసు మాత్రమే. అవును, మీరు పిండిని నిల్వ చేసే గిన్నె అడుగున ఒక గ్లాసును బోర్లించి పెడితే మీ పని చాలా సులభం అవుతుంది. ముందుగా పిండి వేయడానికి ఉపయోగించే గిన్నెను తీసుకోండి. ఆ గిన్నె మధ్యలో ఒక చిన్న స్టీల్ గ్లాసును బోర్లించి పెట్టండి. ఇప్పుడు ఆ గ్లాసు పైనుంచి ఇడ్లీ లేదా దోశ పిండిని పోయండి. ఎప్పటిలాగే గిన్నెపై మూత పెట్టుకోండి. గిన్నె అడుగున గ్లాసును బోర్లించి పెట్టడం వల్ల అక్కడ ఒక గాలి బుడగ ఏర్పడుతుంది. పిండి పులిసేటప్పుడు గాలి బుడగలు ఎక్కువగా ఏర్పడతాయి. అప్పుడు ఈ గ్లాసు పిండి ఒత్తిడిని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల పిండి పైకి ఉబ్బినా, గిన్నె అంచు దాటి బయటకు పొంగిపోదు

ఆగస్టు నెల డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశం ఇస్తుంది. రైతులు ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఈ మూడు కూరగాయలు పండిస్తే మంచి డబ్బు సంపాదించవచ్చు. ఏయే పంటలు వేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ నెలలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. త్వరలో నవరాత్రులు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. కాబట్టి ఈ పంటలు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఎక్కువ పొలం కూడా అవసరం లేదు. ఆగస్టులో కాలీఫ్లవర్ పండించడం మొదలుపెట్టండి. ఈ సమయంలో నాటిన మొక్కలు అక్టోబర్ నాటికి పంటకొస్తాయి. అప్పటికి క్యాబేజీ ఇంకా మార్కెట్లోకి రాదు. సరఫరా తక్కువగా ఉండటంతో మంచి ధర వస్తుంది. ప్రతి వారం మీ జేబులోకి డబ్బులు రావాలంటే పచ్చిమిర్చి పండించండి. ఆగస్టులో నాటడం చాలా మంచిది. ఒక్కసారి నాటితే కొన్ని నెలల పాటు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఆగస్టు చివరి వారంలో కొత్తిమీర నాటడం ఉత్తమం. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుంది. కేవలం 35 నుంచి 40 రోజుల్లోనే పంట కోతకు సిద్ధమవుతుంది! వర్షాకాలం కావడంతో మార్కెట్లో కొత్తిమీరకు డిమాండ్ ఎక్కువగా, సరఫరా తక్కువగా ఉంటుంది. దీంతో కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. అందుకే లాభాలు కూడా భారీగా ఉంటాయి. Silver Rings: తక్కువ బడ్జెట్లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి! Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది! Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు Kurti Designs: డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి

భూమిపై ఉండే ప్రతి వస్తువు కిందకే రావాలి. దీనినే మనం గురుత్వాకర్షణ శక్తి అని అంటాం. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో మనం చదువుకుంది ఇదే. ఇప్పటి వరకు మీరు చాలా వాటర్ ఫాల్స్ చూసి ఉంటారు. కానీ, మన దేశంలో ఉన్న రివర్స్ వాటర్ ఫాల్ ఎప్పుడైనా చూశారా? ఇక్కడ నీరు కిందకు జారదు.. కింద నుంచి పైకి నీరు వెళుతుంది. ఆ రివర్స్ వాటర్ ఫాల్ గురించి ఇప్పుడు చూద్దాం... మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న నానేఘాట్ అనే ప్రసిద్ధ ఘాట్ రోడ్డు ప్రాంతంలో ఈ అద్భుతమైన రివర్స్ వాటర్ ఫాల్స్ ఉంది. సాధారణంగా... ప్రపంచంలో ఎక్కడైనా గ్రావిటివిటీ కారణంగా.. వాటర్ ఫాల్స్ లో వాటర్ పై నుంచి కిందకు జారుతుంది. కానీ.. ఈ నానేఘాట్ లో మాత్రం నీళ్లు కింద పడకుండా.. తుంపర్ల రూపంలో ఆకాశంలోకి ఎగురుతూ కనిపిస్తాయి. ఈ వింత చూడటానికే చాలా మంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్ దగ్గర నీరు కింద పడిపోకుండా పైకి వెళ్లడం వెనక మ్యాజిక్ ఏమీ లేదు. అక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంటుంది. నానేఘాట్ ప్రదేశం లోయల మధ్యలో చాలా ఎత్తైన కండల శిఖరాగ్రాన ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ గాలి వేగం ఊహించనంత చాలా ఎక్కువగా ఉంటుంది. జలపాతం పై నుంచి కిందకు ప్రవహించే నీటి బరువు కంటే, కింద నుంచి లోయ ద్వారా పైకి గాలి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల... ఆ గాలి ధాటికి.. నీరు పైకి తన్నుతుంది. అందుకే, నీరు కిందకు వెళ్లకుండా పైకి వస్తూ ఉంటుంది. వర్షాకాలంలోనే ఈ అద్భుతం: ఏడాది పొడవునా ఈ వింత చూడలేము. కేవలం వర్షాకాలంలో, గాలుల వేగం ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఈ 'రివర్స్ వాటర్ఫాల్' దృశ్యం మనకు కనపడుతుంది. భారత్లోనే ఏకైక ప్రాంతం కాదు: భారతదేశంలో నానేఘాట్తో

శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు!శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు! Samatha 15 August 2026 అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. చాలా పవిత్రమైన మాసాల్లో ఇది ముందుంటుంది. ఉపవాస దీక్ష చేస్తూ, నిత్యం శివుడిని ఆరాధిస్తారు. అయితే ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూలతో శివయ్యను పూజించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. శివుడికి మారేడు దళాలు చాలా ఇష్టం. అందువలన శ్రావణ మాసంలో మారేడు దళాలతో పూజ చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుందంట. అంతే కాకుండా ఉమ్మెత్త పూలు కూడా శివుడికి ప్రీతికరమైన పూలు. అందువలన వీటిని శివుడికి సమర్పించడం చాలా మంచిది. జిల్లేడు పూలు కూడా శివుడికి చాలా ఇష్టమైన పూలు. అందువలన వీటిని శివయ్యకు సమర్పించి పూజిస్తే అదృష్టం కలుగుతుం దంట. అలాగే గన్నేరు పూలు కూడా శివ పూజకు చాలా అద్భుతమైనవి వీటిని శివుడికి సమర్పించి పూజ చేయడం వలన అనారోగ్య సమస్యలు తొ లిగిపోతాయి. మోదుగు పూలు శివుడికి చాలా ఇష్టమైన పూలలో ఒకటి. ఈ పూలను శివుడికి సమర్పించడం వలన జీవితంలోని బాధలు తొలిగిపోతాయంట. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పులాగే పొద్దుతిరుగుడు గింజలను కూడా ప్రతిరోజూ గుప్పెడు తినాల్సిన అవసరం ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది. వీటిని నల్లని పొట్టుతో తినవచ్చు. లేదా పొట్టు తీసేస్తే ఇవి తెల్లగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరం. ఇవి కణాలను నష్టం నుండి కాపాడతాయి. విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఇవి చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తాయి. ఈ గింజలను నేరుగా తినొచ్చు లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగు వంటి వాటిపై చల్లుకుని కూడా తినొచ్చు. రోజుకు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పెద్దలే కాదు పిల్లలు కూడా వీటిని తినొచ్చు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పూలు, కూరగాయల కోసం అతిపెద్ద మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఆధునిక పూలు మరియు కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు 200 కోట్ల రూపాయలను కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయించారు.రాష్ట్రంలో పూలు, కూరగాయల సాగు విస్తీర్ణం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పూలకు ప్రత్యేకమైన మార్కెట్ లేదు. గుడిమల్కాపూర్ మార్కెట్లో కూరగాయలతో పాటు పువ్వులను కూడా విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4402 ఎకరాలలో వివిధ రకాల పూలను, 1.03 లక్షల ఎకరాలలో కూరగాయలను సాగు చేస్తున్నారు ఈ సాగులో మొత్తం 60% రాజధానికి చుట్టుపక్కల జిల్లాల రైతులు చేస్తున్న పరిస్థితి ఉంది.200కోట్ల రూపాయలతో పూలు, కూరగాయల మార్కెట్ అయితే పూలు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భారీ పూలు, కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 200కోట్ల రూపాయలను కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో పూలు, కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజిజ్ నగర్, హిమాయత్ నగర్ గ్రామాలలో మొత్తం 39ఎకరాల భూమిని ఈ ప్రయోజనం కోసం కేటాయించారు.బెంగళూరులోని కేఆర్ మార్కెట్ కంటే భారీగా, అధునాతనంగా మార్కెట్ ఇప్పటికే ఈ భూమిని మార్కెటింగ్ శాఖకు బదలాయించి డి పి ఆర్ తయారీ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద పూల మార్కెట్ అయినా బెంగళూరులోని కేఆర్ మార్కెట్ కంటే మెరుగైన సౌకర్యాలతో మరింత అధునాతన ఈ మార్కెట్ ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ మార్కెట్ ను అధికారులు ఇప్పటికే సందర్శించి అధ్యయనం చేశారు.ఈ జిల్లాల వారికి ఈజీగా రవాణా కొత్త కూరగాయలు, పూల మార్కెట్లో విశాలమైన భవనాలు, కోల్డ్