.webp)
కష్టపడి చదవండి.. మీ కలల బాధ్యత నాది.. మంత్రి లోకేశ్ అభయం
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయకూడదని, అలాంటి వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సదస్సులో వారి సమస్యలను, ఉన్నత ఆశయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ వేదికపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా రాష్ట్ర విద్యా రంగంలోకి త్వరలోనే ‘ఏఐ ట్యూటర్’ (కృత్రిమ మేధస్సు ఆధారిత ట్యూటర్)ను తీసుకురాబోతున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాన్ని తట్టుకునేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ ల్యాబ్స్, ఫండమెంటల్స్పై శిక్షణ ఇస్తామని ప్రకటించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో లైబ్రరీలను బలోపేతం చేయడంతో పాటు, ఏడాది వ్యవధిలోనే రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ను కూడా మంజూరు చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల వ్యక్తిగత గాథలు అందరినీ కదిలించాయి. తండ్రి అనారోగ్యం కారణంగా కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్న చాందిని అనే విద్యార్థినికి నీట్ కోచింగ్ ఇప్పిస్తామని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల