
గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు.. బాసరలో రూ.20 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులు
గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు.. బాసరలో రూ.20 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులు

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు.. బాసరలో రూ.20 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులు

రూ.20 వడా పావ్ కోసం... 15 వేలు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళింది..! ఒక వర్గానికి మీరు ఆదర్శం మేడం..!

టెక్ దిగ్గజం గూగుల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్ "జెమినీ 3.8 ఫ్లాష్ సైబర్"ను పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. సైబర్ భద్రతకు సంబంధించిన లోపాలను అత్యంత వేగంగా గుర్తించి, వాటిని అంతే వేగంగా సరిదిద్దడంలో ఈ మోడల్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన పరిశ్రమల ప్రామాణిక 'సైబర్జిమ్' బెంచ్మార్క్లో ఇది 86.2 శాతం స్కోరును సాధించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా, లోపాలను సరిచేసే విషయంలో 'CWE-బెంచ్' పరీక్షలో 47.2 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. గూగుల్ అందిస్తున్న ఇతర ఫ్లాష్ మోడల్స్ తరహాలోనే ఇది కూడా వేగవంతమైన పనితీరును, తక్కువ ఖర్చుతో కూడిన లభ్యతను కలిగి ఉంటుందని సుందర్ పిచాయ్ వివరించారు.గూగుల్ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో దాదాపు 20 ప్రోగ్రామింగ్ భాషల్లోని లోపాలను కనుగొనడంలో ఈ మోడల్ 70 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును నమోదు చేసినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి పనితీరును కనబరుస్తూనే, "ఫ్లాష్" స్థాయి వేగంతో, సరసమైన ధరకే ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రకటించింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్ 770), ఎల్ఐసీ జీవన్ రక్ష (ప్లాన్ 894) పేరుతో వీటిని సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించారు. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. బీమా ప్లాటినం (Plan 770)ను పొదుపు, జీవిత రక్షణ, భవిష్యత్ ఆదాయం కలిపిన పాలసీగా ఎల్ఐసీ రూపొందించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత ప్లాన్. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియానికి రూ.70 గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన ఐదో సంవత్సరం చివర్లో పాలసీదారు జీవించి ఉంటే బేసిక్ సమ్ అష్యూర్డ్లో 70 శాతానికి సమానమైన బూస్టర్ ఇన్కమ్ బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాకుండా, పాలసీ పేఔట్ పీరియడ్లో ప్రతి సంవత్సరం బేసిక్ సమ్ అష్యూర్డ్లో 10 శాతం రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. పేఔట్ పీరియడ్ అంటే పాలసీ కాలవ్యవధి నుంచి ప్రీమియం చెల్లించే కాలాన్ని మినహాయించిన తర్వాత మిగిలే కాలం. బీమా ప్లాటినంలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు. గరిష్ఠ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన అండర్రైటింగ్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. బీమా మొత్తాన్ని రూ.10,000 చొప్పున పెంచుకుంటూ ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 7, 10, 12, 15 లేదా 18 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్ను బట్టి ప్రవేశ వయసు కనీసం 30 రోజులు, గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదనపు రక్షణ

వివో V80 లైట్ 5Gలో భారీ 10,000mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుంది సెల్ఫీల కోసం 32MP HD వైడ్-యాంగిల్ కెమెరా Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ మలేషియా మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఇటీవలే ఈ ఫోన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. వివో V80 లైట్ 5G మలేషియాలో లాంచ్ కాకముందే ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 10000mAh బ్యాటరీ (Vivo V80 Lite 5G) స్పెషల్ అట్రాక్షన్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో V80 లైట్ 5G లాంచ్ ముందు ఈ ఫోన్ ఇతర స్పెషల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లాంచ్ తేదీ, ధర (అంచనా) : ఈ వివో V80 లైట్ 5G ఫోన్ సెప్టెంబర్ 3న మలేషియా మార్కెట్లోకి లాంచ్ కానుంది. లాంచ్ ముందే ఈ ఫోన్ ఫీచర్లపై తెగ చర్చ నడుస్తోంది. ప్రీ-ఆర్డర్లు ముందే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ ఫోన్ను 3 మెయిన్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయనుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! అందులో 6GB+128GB, 6GB+256GB, 8GB+256GB వేరియంట్లు ఉన్నాయి. అలాగే, పింక్, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. ఈ ఫోన్ ధర RM9,999.00గా కంపెనీ నిర్ణయించినట్టు అంచనా. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ వివో V80 లైట్ 5జీలో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఈ మోడల్ నంబర్తో పాటు, డైమెన్సిటీ చిప్సెట్ కూడా
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీకి సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆయన 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 58 మిలియన్ డాలర్లు అంటే సుమారు 485 కోట్ల రూపాయల టార్గెట్ కాంపెన్సేషన్ పొందనున్నారు. ఇందులో బేసిక్ జీతం 3 మిలియన్ డాలర్లు కాగా 55 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లు భాగమై ఉన్నాయి. ఆపిల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ భారీ ప్యాకేజీ వివరాలు వెల్లడించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్ టెర్నస్ 2001లో ఆపిల్ సంస్థలో ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గత 25 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2021 నుంచి హార్డ్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్ వంటి కీలక ఉత్పత్తుల రూపకల్పనను ఆయనే పర్యవేక్షించారు. అనంతరం ఏప్రిల్ 20, 2026న కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ను కొత్త సీఈఓగా నియమించింది. దీంతో సుదీర్ఘ కాలం పాటు సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలోకి మారారు. ఈ మార్పులతో కంపెనీ నాయకత్వ పంపిణీలో స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆపిల్ సీఈఓ ప్యాకేజీలో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కాగా మిగిలిన 25 శాతం టైమ్ ఆధారిత ఈక్విటీగా కేటాయించారు. బోర్డు నిర్దేశించిన స్టాక్ మార్కెట్ లక్ష్యాలను అందుకోవడంపైనే ఈ ప్యాకేజీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ చివరి వరకు ఆపిల్ ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నందున 2026 చివరి వారాల కోసం ఆయనకు అదనంగా 2.5 మిలియన్ డాలర్ల ప్రొరేటెడ్ షేర్లు మంజూరయ్యాయి. అదే సమయంలో 15

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CPS Pension Issue: ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల పాటు తమ జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత సీపీఎస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా, గౌరవంగా బతకాలన్న ప్రతి ఉద్యోగి ఆశలను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అట్టడుగుకు తొక్కిపారేస్తోంది. ఐదేళ్ల పాటు పదవిలో ఉండి దిగిపోయే ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేలల్లో పెన్షన్లు, అలవెన్సులు కల్పించుకుంటున్న పాలకులు... జీవితాంతం ప్రజాసేవలో తరించిన ఉద్యోగికి మాత్రం రిటైర్మెంట్ తర్వాత కనీస అవసరాలు తీర్చలేని పెన్షన్ ఇస్తూ చీకటిలోకి నెట్టేస్తున్నారు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూసిన ఒక ఘటన సీపీఎస్ ఉద్యోగుల పాలిట ఎంతటి నరకమో కళ్లకు కడుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా పేదలు, వృద్ధులకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ నెలకు రూ. 4,000 కాగా, సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఒక సీపీఎస్ ఉద్యోగి చేతికి వస్తున్న నెలవారీ పెన్షన్ కేవలం రూ. 3,882 మాత్రమే... ఏ సమస్యా లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సామాజిక పింఛను కంటే, ముప్పై ఏళ్లు చెమటోడ్చి సేవ చేసిన ఉద్యోగికి వచ్చే పింఛను తక్కువగా ఉందంటే... ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి అదృష్టవంతుడా...లేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా అనేది నిర్ణయించే విచక్షణ పాలకులకే వదిలేయాలని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎదురైన ఈ దారుణమైన పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేపు తమకు కూడా రిటైర్మెంట్ తర్వాత ఇదే
జ్యోత్స్నని సూరజ్ మోసం చేయడానికి, ఆమె పెళ్లి ఆగిపోవడానికి దీప, కార్తీక్లే కారణం అని శివన్నారాయణ అనడం కాదు.. దశరథ్ కూడా అదే మాట అనడంతో తల్లడిల్లిపోతారు దీప, కార్తీక్లు. ఈరోజు (సెప్టెంబర్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశారు. దీప... ఈ దశరథ్, సుమిత్రల కన్న కూతురని నేను ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనమ్మా.. ఎందుకంటే జ్యోత్స్నకి అంత అన్యాయం చేశారు’ అని అంటాడు దశరథ. ఈ నిజం బయటపడిన రోజు సుమిత్ర ఆనంద పడదు.. బాధపడుతుంది. ఎందుకంటే.. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావ్ అని తెలిస్తే.. తట్టుకోలేదు. అప్పుడు నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది’ అని అంటాడు దశరథ. ఆ మాటతో దీప.. ‘మీరు నా జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు బావుండాలనే నేను కోరుకునేది నాన్నా’ అని ప్రవచనం మొదలుపెట్టడంతో.. ‘నీతో నేను మాట్లాడలేనమ్మా’ అని దండం పెట్టేస్తాడు దశరథ. చూడు కార్తీక్.. నీ భార్యని తీసుకుని వెళ్లిపో.. అని అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దశరథ. దాంతో దీప.. ఏంటి బావా ఇదీ?? నాన్న నన్ను ఇంత పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నాడు అంటూ కన్నీటిపర్యంతం అవుతుంది.నా కోసం.. నా ప్రేమ కోసం నువ్వు వస్తావని తెలుసు సూరజ్.. పరిస్థితులే అలా చేయిస్తున్నాయి.. మామయ్య పరిస్థితే ఇలా ఉంటే.. అక్కడ జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉందో అని అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. జ్యోత్స్న.. సూరజ్ విసిరి కొట్టిన తాళిని తీసుకుని కన్నీళ్లతో అతని ఊహల్లోనే ఉంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. వచ్చావా సూరజ్.. నాకోసం వస్తావ్ అని తెలుసు.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు.. నా ప్రేమ నిన్ను ఎందుకు మార్చదు అని అంటుంది జ్యోత్స్న. ‘లేదు.. నన్ను మర్చిపో అని చెప్పడానికి వచ్చాను’ అని అంటాడు సూరజ్. ‘నన్ను దూరం

ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ 7.8% జీడీపీ (GDP)వృద్ధితో దూసుకుపోతోందన్న వార్తలు దేశవ్యాప్తంగా గొప్ప ఆశాభావాన్ని నింపాయి.అయితే,పైకి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ గణాంకాల వెనుక ఉన్న అసలు ఆర్థిక చిత్రాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.కేవలం హెడ్లైన్ సంఖ్యలను చూసి సంబరపడకుండా,గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చారు.బేస్ ఇయర్ సవరణల మాయాజాలం:గార్గ్ విశ్లేషణ ప్రకారం,గత ఏడాది జీడీపీ అంచనాలను సవరించి 6.9%కి గణనీయంగా తగ్గించారు.ముఖ్యంగా ప్రస్తుత ధరల వద్ద గతేడాది తొలి త్రైమాసికం (Q1) జీడీపీ రూ.86 ట్రిలియన్లుగా అంచనా వేయగా,దానిని సవరించి రూ.80 ట్రిలియన్లకు కుదించారు.ఈ విధంగా గత ఏడాది ఆధారిత సంఖ్య తగ్గడం వల్ల,ఈ ఏడాది వృద్ధి రేటు గణాంకాలు స్వయంచాలకంగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.ఈ స్థాయిలో భారీ సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయన బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తయారీ రంగం మందగమనం - వినియోగంలో క్షీణత:ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం,గనుల రంగాలు మెరుగ్గా రాణించినప్పటికీ,ప్రభుత్వ మునుపటి డేటాతో పోలిస్తే తయారీ రంగం బలహీనంగా ఉందన్నారు.ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయం నిజమైనదేనని,అది 15% పైగా పెరిగిందని అంగీకరించినప్పటికీ..ఆయన ప్రధాన ఆందోళన మాత్రం సాధారణ ప్రజల వినియోగంపైనే ఉంది.ప్రభుత్వ పాత అంచనాలతో పోల్చి చూస్తే ప్రస్తుత వినియోగ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.నో డబుల్ స్టాండర్డ్స్: ప్రధాని మోదీ ఇన్ డైరెక్ట్ వార్నింగ్- పాకిస్తాన్ పీఎం ఎదురుగానేఆర్థిక వ్యవస్థ అసలైన బలానికి సాధారణ ప్రజల కొనుగోలు శక్తే ప్రాతిపదిక.కేవలం కాగితాలపై అంకెలను అందంగా చూపిస్తూ లోపలి బలహీనతలను దాచిపెట్టడం వల్ల నష్టం జరుగుతుంది.ఇప్పటికైనా పాలకులు హెడ్లైన్ నంబర్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా,గ్రౌండ్ లెవెల్లో వినియోగం తగ్గడానికి గల కారణాలను గుర్తించాలి.

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Rural Drinking Water Citizen Charter 2026:గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాగునీటి సరఫరాలో సమస్యలు, పైప్లైన్ లీకేజీలు, మోటార్ల రిపేర్లు వంటి సమస్యలకు ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు “రూరల్ డ్రింకింగ్ వాటర్ సిటిజన్ ఛార్టర్ 2026 (G.O. 829)”ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి కంప్యూటర్ రసీదు లేదా కంప్లైంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో తమ ఫిర్యాదు నమోదు అయిందా లేదా అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంటుంది. అలాగే సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిన్నపాటి నీటి సరఫరా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించాలి. గ్రామాల్లో నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లలో సమస్య వస్తే దాన్ని 48 గంటల్లోపు రిపేర్ చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో మోటార్ సమస్యల కారణంగా ఎక్కువ రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. పైప్లైన్ లీకేజీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. చిన్న లీకేజీలను 24 గంటల్లో, పెద్ద లీకేజీలను 72 గంటల్లోపు సరిచేయాలి. దీనివల్ల నీటి వృథాను తగ్గించడంతో పాటు ప్రజలకు నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించే అవకాశం

Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్ బౌలర్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్ కోల్పోయాడు. సెలెక్టర్లు అతని పనిభారాన్ని తగ్గించినా ఇబ్బందులు కొనసాగాయి. 2013లో 50 టెస్టులు పూర్తి చేసే సమయానికి అతని గణాంకాలు ఆశించిన స్థాయిలో లేవు. అయినా తర్వాత రీఎంట్రీ చేసి కీలక మ్యాచ్ల్లో ప్రభావం చూపించాడు. ముఖ్యంగా 2014 లార్డ్స్ టెస్టులో కెరీర్లోనే అత్యుత్తమంగా 7/74 నమోదు చేసి భారత్ విజయానికి ప్రధాన కారణమయ్యాడు. లార్డ్స్లో మరపురాని ప్రదర్శన..: ఇశాంత్ కెరీర్లో 2014 లార్డ్స్ టెస్టు ప్రత్యేక అధ్యాయం. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో అతను 7 వికెట్లు పడగొట్టి భారత్కు 95 పరుగుల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. ఆ తర్వాత 2015 శ్రీలంక పర్యటనలోనూ ఇశాంత్ కీలకంగా నిలిచాడు. కొలంబోలోని ఎస్ఎస్సీ వేదికగా జరిగిన టెస్టులో 8 వికెట్లు సాధించి, టెస్టు క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో మరో మంచి దశ..: 2018లో ఇంగ్లాండ్ పర్యటన ఇశాంత్కు మరో ముఖ్యమైన దశగా నిలిచింది. ఆ 5 టెస్టుల సిరీస్లో అతను 18 వికెట్లు తీసి భారత బౌలింగ్ విభాగంలో అత్యధిక ప్రభావం చూపిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్లో భారత బౌలర్గా 43 టెస్టు వికెట్లతో కపిల్దేవ్ రికార్డును సమం చేశాడు. పేస్ తగ్గిన దశను దాటి, మళ్లీ తన అనుభవం, లైన్-లెంగ్త్తో ప్రభావం చూపడం ఇశాంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ అంశం. 2008లో పెర్త్లో

మొన్నటి దాకా కాక్రోచ్ జనత పార్టీ ఆందోళనలతో అట్టుడికిపోయింది.. యావత్ దేశం. ఈ ఉద్యమాల ధాటికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగట్లేదు. మరో నూతన సామాజిక ఉద్యమం పురుడుపోసుకుంది. ఏకంగా ఏడాదిపాటు కొనసాగబోతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80వ సంవత్సరంలో అడుగు పెట్టినందున దీనికి ఇండియా @ 80 అని పేరు పెట్టారు.మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. దేశ రాజధానిలో సఫాయి కర్మాచారి ఆందోళన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనుషుల మలాన్ని చేతులతో ఎత్తే ఈ అనాచారం పూర్తిగా అంతరించిపోయిందంటూ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలపై క్షేత్రస్థాయి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయనడానికి ఇది.. తాజా నిదర్శనం.ఈ సభలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన మహిళా స్కావెంజర్లు హాజరయ్యారు. తమ నిత్య జీవితంలో నేటికీ ఎదుర్కొంటున్న చేదు వాస్తవాలను వెల్లడించారు. ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఈ బానిసత్వం నుండి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందని వారు నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తి కాబోతున్న తరుణంలో కూడా ఈ సామాజిక వివక్ష నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న పేద ప్రజలకు విముక్తి లభించకపోవడంపై సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.పసిడి రేట్లల్లో తీవ్ర ఒడిదొడుకులు.. మరోసారి మార్జినల్ పతనందేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థ పూర్తిగా తొలగిపోయిందంటూ కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రకటనలను సఫాయి కర్మచారి ఆందోళన్ ఖండించింది. పార్లమెంట్ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పారంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థ నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా సఫాయి కర్మాచారి ఆందోళన్ సంఘ్.. ఈ ఉద్యమానికి రూపకల్పన చేసింది. ఇండియా @ 80 పేరిట ఓ సంవత్సరం పాటు సాగే సుదీర్ఘ నిరసన ఉద్యమాన్ని

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను

ఎల్ఐసీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేర్లతో తీసుకొచ్చిన ఈ పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను తీసుకొచ్చింది. ‘LIC బీమా ప్లాటినమ్’, ‘LIC జీవన్ రక్ష’ పేర్లతో వీటిని ప్రకటించింది. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. LIC బీమా ప్లాటినమ్.. పొదుపుతో పాటు బీమా రక్షణ బీమా ప్లాటినమ్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత బీమా పథకం. పొదుపు లక్ష్యంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా దీన్ని రూపొందించారు. పాలసీ వ్యవధిలో ముందుగానే నిర్ణయించిన గ్యారెంటీడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ.1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్కు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ఈ పాలసీని 28 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారు తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 7, 10, 12, 15 లేదా 18 ఏళ్ల ఆప్షన్లు ఉన్నాయి. పాలసీ టర్మ్ను 17, 20, 22, 25 లేదా 28 ఏళ్లలో ఎంచుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ సమ్ అష్యూర్డ్పై పరిమితి లేదని సంస్థ పేర్కొంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే.. బేసిక్ సమ్ అష్యూర్డ్తో పాటు అర్హత కలిగిన గ్యారెంటీడ్ అడిషన్లు అందుతాయి. పాలసీ కాలంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే.. నిబంధనల ప్రకారం వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లకు సంబంధించిన అర్హత మొత్తాల్లో ఎక్కువదాన్ని డెత్ బెనిఫిట్గా చెల్లిస్తారు. అదనంగా ఎల్ఐసీ పాలసీదారులకు రిబేట్లు, రుణ సదుపాయం, అవసరానికి అనుగుణంగా రైడర్లను జోడించుకునే అవకాశం

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్ఫుల్స్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను సవరించేందుకు కొత్త పే కమిషన్లు ఏర్పాటవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్కు, రాబోతున్న 8వ పే కమిషన్కు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, , ఇంటి అద్దె భత్యం, పింఛన్ విధానాలలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 7వ పే కమిషన్ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, అది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్ 21 నెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక 8వ పే కమిషన్ను 2025 నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ఏర్పాటు చేశారు. 8వ పే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా, అంటే 2027 మే నాటికి తన తుది రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. 7వ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నాయకత్వం వహించారు. 8వ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. 7వ పే కమిషన్ అమలుకు రెఫరెన్స్ తేదీగా 2016 జనవరి 1ని నిర్ణయించారు. అదేవిధంగా, 8వ పే కమిషన్ ద్వారా జరిగే జీతాల సవరణకు కూడా రెఫరెన్స్ తేదీగా 2026 జనవరి 1ని నిర్ణయించారు. జీతాల పెంపును నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. 8వ పే కమిషన్లో ఇది ఇంకా ఖరారు కాలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇది 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.28 నుంచి 2.46 వరకు ఉండే అవకాశం ఉంది. 7వ పే కమిషన్లో కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. 8వ పే కమిషన్లో ఖరారయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను
బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరు ఎంత వర్త్.. ఎవరికి ఎంత స్పేస్ ఉంటుంది.. అని చెప్పాలి.. 15, 30, 45, 60 సెకన్లు అంటూ విభజించిన ఈ నాలుగు కేటగిరీల్లోంచి ఏదో ఒక బ్యాడ్జ్ మెడలో వేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో షాలిని, రామకృష్ణ, అపూర్వ, రాజ కుమారి, ఝాన్సీ ఇలా చాలా మంది మధ్య గొడవలు జరిగాయి. ఇక రామకృష్ణ, షాలినీ అయితే ఒకరి మీదకు ఒకరు వెళ్లారు. నీకు మాట్లాడటమే రాదు అని షాలినీపై అపూర్వ ఫైర్ అయింది. ఇక అప్పుడు కూడా షాలిని మీద మీదకు వెళ్లడంతో.. అసలు ఆమెకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వొచ్చు కదా అని షాలినీకి శ్రీముఖి కౌంటర్ వేస్తుంది.అలా ఈ టాస్క్లో చివరగా రోహిత్ వస్తాడు. అప్పుడు 60 సెకన్ల బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. కావాలంటే దీన్ని స్వాప్ చేసుకోవచ్చు అనే పవర్ ఇస్తాడు. దీంతో దీపక్ వద్ద ఉన్న 45 నిమిషాల బ్యాడ్జ్ తీసుకుని వన్ మినిట్ బ్యాడ్జ్ వేస్తాడు. మరి ప్రియాంకకి 45 సెకన్ల బ్యాడ్జ్ ఇస్తావా? అని అడిగితే. కాదు.. ఆమె 30 సెకన్స్ వర్త్ అని అంటాడు రోహిత్. మరి అలాంటప్పుడు 30 సెకన్స్ వర్త్ ఉన్న బ్యాడ్జ్తో స్వాప్ చేసుకోవచ్చు కదా అని జ్యూరీ అడుగుతుంది. వాళ్లకి వన్ మినిట్ బ్యాడ్జ్ వర్త్ కాదు కదా అని తన సమయస్పూర్తితో సమాధానం ఇస్తాడు. ఆ ఆన్సర్కి జ్యూరీ ఫిదా అవుతుంది.15 సెకన్స్ బ్యాడ్జ్ వచ్చిన ఐదుగురికి లీడర్ అయ్యే అవకాశం ఉంటుందని ట్విస్ట్ ఇస్తారు. భాగి, రామకృష్ణ, హేమంత్, అపూర్వ, అమన్లకు ఓ టాస్క్ ఇస్తారు. 70ఎంఎం దోశను ఇచ్చి.. ఎవరైతే ముందుగా ఫినిష్ చేస్తారో.. వాళ్లే ముందుగా టీంలను ఫాం చేస్తారని చెబుతారు. దీంతో దోశను ముందుగా భాగీ ఆ తర్వాత హేమంత్, ఆపై అమన్ చివరగా రామకృష్ణ, అపూర్వలు ఫినిష్ చేస్తారు. టాస్క్

భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 'హై వోల్టేజ్' ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని అన్నారు. రాగి వైర్ ధర రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వెల్లడించారు. 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని చెప్పారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికులు ఖర్చు ఇలా అన్ని పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగున పరిచి, గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయని అన్నారు. వీక్ సెంటీమెంట్ను ప్రతిఫలించట్లేదని చెప్పారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతుంటే నిరాశావాదులు మాత్రం అసత్యాలను ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు. ఈ వృద్ధి రేటు భారతీయుల సమష్టి శక్తికి

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం

భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అభినందనలు చెప్పారు. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నా భారత్ వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. భారత దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు దేశ ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని అన్నారు. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచరించారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని ఆయన తెలిపారు. ప్రభాస్ తన ఇతర సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసుకుని ఫ్రీ అయిన వెంటనే తర్వాతి షెడ్యూల్స్ను వేగంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తతో కల్కి 2 సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రొడక్షన్ పురోగతిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇంతకుముందు జూన్ నెలలో వచ్చిన నివేదికలతో పోలిస్తే ఈ ప్రకటన కొంత మార్పును సూచిస్తోంది. ఆ సమయంలో రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మొదలవుతుందని, రైటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కువగా పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ ప్లాన్ వాయిదా పడిందని ఆగస్టు నివేదికలు స్పష్టం చేశాయి. ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ప్రభాస్ను బిజీగా ఉంచడంతో కల్కి 2 సెట్స్కు ఆయన రావడం ఆలస్యమైంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ భాగాలు ఇప్పటికే కొంతవరకు పూర్తయినట్లు సమాచారం అందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ భైరవ లేదా కర్ణ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్గా కమల్ హాసన్ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. మరోవైపు సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే సెప్టెంబర్ 2025లో అధికారికంగా బయటకు రావడంతో ఆ ముఖ్యమైన పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ స్కేల్ చాలా పెద్దది కావడం వల్ల సినిమా నిర్మాణం మరింత సమయం తీసుకోనుంది. హెవీ VFX

'8 వసంతాలు' చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో నాకు లభించిన గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది మరియు నా మనస్సుకు బాగా దగ్గరైంది. ఆ సినిమా తర్వాత నా దగ్గరకు అనేక కథలు వచ్చినప్పటికీ, అవి నన్ను పూర్తి స్థాయిలో ఉత్సాహపరచలేకపోయాయి. అయితే 'రోమాంచకం' కథ విన్న వెంటనే నేను తీవ్రంగా ఎక్సైట్ అయ్యాను మరియు ఈ ప్రాజెక్ట్లో భాగం కావాలని వెంటనే నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా ఒక సరదా మరియు ఎనర్జిటిక్ బబ్లీ క్యారెక్టర్ చేయాలనేది నా కలగా ఉండేది, ఈ సినిమాతో ఆ నెరవేరుతోంది. నా సొంత స్వస్థలం కేరళలోని త్రిస్సూర్ కాగా, నా చిన్నతనం నుంచే భరతనాట్యం, మోహినియాట్టం, కూచిపూడి వంటి కళలతో పాటు కరాటేలో కూడా శిక్షణ తీసుకున్నాను. నా తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, అప్పులు చేసి మరీ నా కళల శిక్షణకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. 2023లో ‘మ్యాడ్’, 2025లో ‘8 వసంతాలు’ సినిమాలతో తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది. గతంలో నేను చేసిన ఇంటెన్స్ పాత్రలకు పూర్తి భిన్నంగా, ఈసారి 'రోమాంచకం'లో ఒక సరదా తమిళ అమ్మాయిగా ప్రేక్షకులను అలరించబోతున్నాను. ఈ సినిమాలో నా సహ నటుడు సుమంత్ ప్రభాస్ డేటింగ్ స్టార్టప్ నడుపుతున్న ఒక యువ ఎంట్రప్రెన్యూర్గా చాలా ఎనర్జిటిక్గా కనిపించనున్నారు. దీంతో ఆయన పాత్రకు పోటీగా ఉండేలా నా క్యారెక్టర్ను కూడా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా, షూటింగ్ సమయంలో సుమంత్ మరియు నా మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో నేచురల్గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా రూపుదిద్దుకున్నాయి. కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడే నాకు కలిగిన ఆనందం ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు కూడా అందుతుందని నమ్ముతున్నాను. మా సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఫలితంగా, ఈ చిత్రాన్ని యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ పై దర్శకుడు కీలక అప్డేట్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ (Kalki 2) ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సీక్వెల్పై మొదటి భాగం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘కల్కి 2’కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందనే విషయం స్పష్టమైంది. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన మిగతా సినిమాల కమిట్మెంట్స్ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘కల్కి 2’ తదుపరి షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథ, పురాణ అంశాలు, అత్యున్నత స్థాయి విజువల్స్తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో సీక్వెల్కు సంబంధించిన అంశాలను చూపించడంతో ‘కల్కి 2’పై ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా మెప్పించారు. కమల్ హాసన్ యాస్కిన్ పాత్రలో కనిపించి సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. ఈ ముగ్గురు నటులు సీక్వెల్లో కీలకంగా ఉండనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. శివన్నలో మరో యాంగిల్.. ఆసక్తికరంగా ‘కూర్మ అవతార్’ టీజర్

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీచేసే అవకాశాలపై మాట్లాడిన అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఆ విషయమై ఇప్పుడే చర్చ అక్కర్లేదని సమాధానాన్ని దాటవేశారు. 'హెగ్సెత్ అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుంది. ముందుగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికలను పూర్తి చేయాలి' అని ట్రంప్ అన్నారు. యూఎస్ ప్రెసిడెంట్గా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే అవకాశమున్న ట్రంప్.. 2029లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆయన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఉద్యమాన్ని ముందుకు నడిపించే తదుపరి నేత ఎవరన్న దానిపై రిపబ్లికన్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నా.. తాజాగా ఆ లిస్ట్లో హెగ్సెత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఐయోవా స్టేట్ ఫెయిర్లో రిపబ్లికన్ల తరఫున హెగ్సెత్ ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది. అయితే ఈ వార్తలను హెగ్సెత్ ఖండించారు. అవి '100 శాతం అవాస్తవం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారాయన. హెగ్సెత్ గతంలో ఆర్మీ నేషనల్ గార్డ్లో పనిచేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ ఛానల్లో టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ భవితవ్యంపై ట్రంప్ మరింత ఆసక్తికరంగా స్పందించారు. 'ప్రస్తుతం ఆయనకు సైన్యం, సైనికుల సంక్షేమం తప్ప మరేదీ ముఖ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు 2028 అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు నేతలు
జ్యోత్స్న పెళ్లి మా బాధ్యత అంటూ ముక్కు మొహం తెలియని గొట్టంగాడ్ని తీసుకొచ్చి.. ఆమె గొంతుకోసిన దీప, కార్తీక్లకు సరైన రీతిలో బుద్ధి చెప్పాడు సూరజ్. అసలు జ్యోత్స్నని ఇంత మోసం చేయడానికి కారణం మీరేనంటూ.. అసలు దీపా, కార్తీక్లు లేకపోతే ఆ ఇంట్లోకి అడుగుపెట్టేవాడ్ని కాదంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు సూరజ్. ఇక తన మనవరాలి పెళ్లి పీటలపై ఆగిపోవడానికి.. సుమిత్ర హాస్పిటల్ పాలు కావడానికి కారణం దీప కార్తీక్లే కారణం అని వాళ్లని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు శివన్నారాయణ. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. దీప, కార్తీక్లు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. సూరజ్ వెళ్తూ వెళ్తూ.. తన చేసిన తప్పుల్లో మనల్ని ఎందుకు భాగం చేశాడో అర్థం కావడం లేదు’ అని అంటుంది దీప. ‘నీకు ఇంకా అర్థం కాలేదా? సూరజ్ పక్కా ప్లాన్తో మనల్ని ఇరికించేశాడు. తండ్రి చావుకి పగ తీర్చుకోవడానికి సూరజ్, మాలిని, దక్షణమూర్తి ముగ్గురూ కలిసే ప్లాన్ చేశారు. సూరజ్ ముందే గ్రౌండ్ వర్క్ చేశాడు. . ముందు నాకు నా ద్వారా నీకు పరిచయం అయ్యాడు.మనమే వాడు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చేశాం.. మనమే వాడి గురించి సరిగా తెలుసుకోకుండా.. సర్టిఫికేట్ ఇచ్చేశాం. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? వాడు చేశాడు. మా నాన్న నాకు ఆరోజే చెప్పారు.. ‘ఒకడు తన సామర్థ్యాన్ని తగ్గించుకుని.. వెళ్లే అవకాశం ఉన్నా.. వెళ్లిపోకుండా ఉన్నాడంటే.. వాడ్ని ఏదో ఒక శక్తి ఆపుతుంది’ అని. ఆ శక్తి వాడి పగే. వాడే కోటేశ్వరుడైనప్పుడు వాడికెందుకు డబ్బు, జీతం. సూరజ్ విషయంలో మనం ఎప్పటికప్పుడు మోసపోతున్నాం.. మంచితనమే మనిషికి నిజమైన శత్రువు. దాన్ని అడ్డుపెట్టుకుని అందర్నీ మోసం చేసి.. మనల్ని దోషుల్ని చేశాడు. మన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం చూస్తూ ఊరుకోం అని.. వాడు చాలా తెలివిగా మనల్ని మన ఫ్యామిలీకి దూరం చేశాడు.ఆ
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్ను ఐపీసీ సెక్షన్లు

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు, సెప్టెంబర్ 01: నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది.. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.447.80 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరు చేయనున్నాయి. ఈ రూ.2.50 లక్షల్లో.. కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా.. రాష్ట్రం వాటా కింద రూ.లక్ష ఇస్తారు. వీటితో పాటుగా వీబీ జీరామ్జీ (ఉపాధి హామీ పథకం) కింద రూ.27వేలు.. అలాగే స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు ఇస్తారు. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.89 లక్షలు అందుతాయి. కేంద్రం పీఎంఏవై-2.0 కింద పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది.. వీటిని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించనుంది.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఈ 17,912 ఇళ్లను జిల్లాల వారీగా కేటాయించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ)ల పరిధిలో 15,793 ఇళ్లు ఉంటే.. పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల పరిధిలోకి మరో 2,119 ఇళ్లు వస్తాయి. ఈ 17,912 ఇళ్లలో అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 కేటాయించారు.. ఆ తర్వాత పల్నాడు జిల్లాకు (1,229), నెల్లూరు జిల్లాకు (1,057), కడప జిల్లాకు (1053) ఇళ్లు కేటాయించారు. రాష్ట్రంలో అత్యల్పంగా 212 ఇళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి జిల్లాల కలెక్టర్లు అనుమతులు ఇస్తారు.PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి కార్పెట్ ఏరియా కనీసం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు నమూనా డిజైన్లను

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025 నుంచి మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్ దారుణంగా నిరాశ పరిచాయి. 2026లోనూ పరిస్థితులు మారలేదు. 2026 వచ్చి 8 నెలలైపోయింది.. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025 నుంచి అసలు కనబడట్లేదు. అది కూడా టాలీవుడ్కు మైనస్సే. దాంతో 2026లోనూ 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. పుష్ప 2 తర్వాత సౌత్లో అసలు 1000 కోట్లు కొట్టిన సినిమానే లేదు. మరోవైపు ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్లోనే ఫస్ట్ పార్ట్తో 1400 కోట్లు, సెకండ్ పార్ట్తో 1800 కోట్లు వసూలు చేసింది. 2025-26లో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమా ఇదొక్కటే. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 మాత్రమే 850 కోట్లకు పైగా వసూలు చేసింది. దాని తర్వాత కూలీ తెచ్చిన 518 కోట్లే సౌత్లో హైయ్యస్ట్. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మాట్లాడితే మనమే
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్డ్రాప్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం

ఈ ఫోన్లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఆస్ఫెరిక్ లెన్స్, గీక్బెంచ్ లిస్టింగ్లో కనిపించింది వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానుంది Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V80 లైట్ 5G లాంచ్ ఖరారైనట్లు సమాచారం. ఈ ఫోన్లో భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇదే ఫోన్ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. వివో V80 లైట్ అతిపెద్ద బ్యాటరీతో వస్తోంది. గతంలో, కంపెనీ 10,200mAh బ్యాటరీతో వివో V600 ప్రోను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ దేశీయ మార్కెట్ మినహా మరే ఇతర మార్కెట్లోనూ లాంచ్ కాలేదు. వివో V80 లైట్ 5Gలోని ఇతర ఫీచర్లతో పాటు ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సెప్టెంబర్ 3న అధికారిక లాంచ్ : వచ్చే నెలలో వివో V80 లైట్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ను సెప్టెంబర్ 3న అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫేస్బుక్ పేజీలో ఈ ఫోన్కు సంబంధించిన టీజర్ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ గ్రీన్, రోజ్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బ్యాక్ కెమెరా కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ను మలేషియాలో లాంచ్ చేసేందుకు కంపెనీ ముందుగానే ప్లాన్ చేస్తోంది. Read Also : Motorola G37 Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ మోటోరోలా G37పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..! 50MP డ్యూయల్ కెమెరా సెటప్ : వివో V80 లైట్ 5G ఫోన్లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉండబోతోంది. దాంతో పాటు అల్ట్రావైడ్ సెన్సార్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన జేబీఎస్-శామీర్పేట కారిడార్లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్బేగంపేట విమానాశ్రయం రన్వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్లను దాటాల్సి ఉంటుంది.ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులుదీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్లో ఉంది. జాతీయ రహదారుల

‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే? తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్ వైజర్గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్తో ఫోన్ మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని భరోసా ఇవ్వడం, పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన లీవ్ తిరస్కరించడం లాంటి సహజమైన సన్నివేశాలతో కథనం మొదలవుతుంది. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ విసిరే క్రమంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోగా, ఓ కుక్క రిమోట్ను తీసుకురావడం.. ఆ రిమోట్ మాగ్నెట్ సాయంతో కీస్ను బయటకు తీసే క్రమంలో తుపాకులు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అద్దాలు ధరించిన మధ్యవయస్కుడైన ‘కె. సత్యం’ రూపంలో మెగాస్టార్ హుందాగా కనిపిస్తూనే, ఆ వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్ కావడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. అనంతరం వచ్చే ఫ్లాష్బ్యాక్లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజ్ మెగా ఫ్యాన్స్కు వింటేజ్ వైబ్స్ను గుర్తుచేస్తోంది. బాబీ మరోసారి చిరంజీవిలోని మాస్ అండ్ క్లాస్ వేరియేషన్లను పర్ఫెక్ట్గా ఒడిసిపట్టారు. విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ ఆద్యంతం రిచ్గా ఉంది. ముఖ్యంగా ఎస్. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అందులో ‘గ్యాంగ్ లీడర్’ నాటి ఐకానిక్ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్ జోడించడం గ్లింప్స్ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లింది lఈ చిత్రంలో అనస్వర రాజన్

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చేస్తోన్న చిత్రం ‘మెగా158’. మెగాస్టార్ బర్త్డే స్పెషల్గా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ని మేకర్స్ వదిలారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చేస్తోన్న చిత్రం ‘మెగా158’. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మేకర్స్ అందరికీ షాకిస్తూ.. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ని ఖరారు చేస్తూ స్పెషల్ గ్లింప్స్ వదిలారు. ఈ స్పెషల్ గ్లింప్స్ ఎలా ఉందో చూసేయండిక. ‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

సూర్య లేటెస్ట్ గా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. గత వారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వారు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చాయి. అయినా ఈ మూవీ కలెక్షన్లు తగ్గలేదు సరికదా, శుక్రవారం పెరగడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీకి ఎనిమిదో రోజు రూ.4.50కోట్లు వచ్చాయి. గురువారం రూ.4.20కోట్లు రాగా, ముప్పై లక్షలు పెరగడం విశేషం. వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటుందనేదానికిది నిదర్శనం. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.149.77కోట్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 150కోట్ల క్లబ్లో చేరింది. ఇండియాలో దీనికి రూ.99.52కోట్ల గ్రాస్ రాగా, రూ.86.10కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదో రోజు ఓవర్సీస్లో కోటిన్నర రాబట్టింది. మొత్తంగా అక్కడ రూ.50.26కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి తమిళంలో కంటే తెలుగులోనే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. 8వ రోజు కూడా తమిళంలో రూ.1.85కోట్లు వస్తే, తెలుగులో రూ.2.40కోట్లు రావడం విశేషం. ఓవరాల్ కలెక్షన్లలో కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి రూ.130కోట్ల బడ్జెట్ అయ్యింది. సుమారు రూ.90కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. ఈ లెక్కన సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటికే రూ.150కోట్లు దాటింది. ఈ వచ్చే వారంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష

ఇంటర్నెట్డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధానపాత్రలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీమ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా (Mega 158 Update) టైటిల్ను ‘కాకా’గా ఖరారు చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో (Kaaka) చిరంజీవి మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నారు. అక్వా సంస్థలో ఉద్యోగిగా చిరంజీవి సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు. ‘ఇది సత్య మాట.. ఇంకా డౌటా’ అనే డైలాగు ఆయన పాత్ర స్వభావాన్ని తెలుపుతోంది. ఇందులో కనిపించిన ‘ఐ లవ్ డాడీ’ అనే కీ చైన్కు.. ప్లాష్ బ్యాక్లో ఆయనకు తండ్రితో అనుబంధం ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్ అనంతరం యంగ్ అండ్ స్టైలిష్ లుక్లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజు.. మెగా ఫ్యాన్స్కు వింటేజ్ చిరును గుర్తుచేస్తోంది. ఇక ‘కాకా’ సినిమా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది (kaaka Movie Release Date). ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు - బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే ఈసారి ఓ చక్కటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో మరోసారి రాబోతోన్న మెగా158 చిత్ర టైటిల్ గ్లింప్స్ని మేకర్స్ వదిలారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’. మెగాస్టార్ పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగగా, అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్కు ‘కాకా’ (Kaaka) అనే ఊరమాస్ టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్లో చిరు స్వాగ్, బాబీ టేకింగ్ చూసి మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. విడుదలైన టైటిల్ గ్లింప్స్ విషయానికొస్తే.. ఆక్వా ఫ్యాక్టరీ బ్యాక్డ్రాప్లో సూపర్వైజర్ ‘కె. సత్యం’గా చిరంజీవి కనిపించారు. ‘ఏంట్రా తంబీ.. ఇది సత్యం మాట, ఇంకా డౌటా?’ అంటూ చిరు చెప్పిన డైలాగ్, ఆయన వేసుకున్న ‘ఐ లవ్ డాడ్’ కీచైన్తో కూడిన తాళంచెవిని రొటేట్ చేసే స్టైల్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. దీనికి తోడు ఎస్. థమన్ అందించిన ‘పాప రీపాప.. ఆడితే ఆట.. ఇస్తా తోట.. కాకా!’ అంటూ ‘గ్యాంగ్లీడర్’ వైబ్తో సాగే మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ వ్యక్తిలా కనిపిస్తూనే, లోపల ఉన్న విధ్వంసకర మాస్ కోణాన్ని చిరంజీవి ఆవిష్కరించిన తీరు గ్లింప్స్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆంటోనీ

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ(ఆగస్టు 22) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగాభిమానులు హంగామా చేస్తున్నారు. మెగాస్టార్ కు సంబంధించిన పాత సినిమాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి… — N Chandrababu Naidu (@ncbn) August 22, 2026 చిరంజీవి పుట్టిన రోజు.. ఆహా స్పెషల్ వీడియో
తెలుగు సినిమా చరిత్రను "చిరంజీవికి ముందు... చిరంజీవి తర్వాత" అని విభజించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఈలల వర్షం కురిసినా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మెగాస్టార్ చిరంజీవి . సామాన్య కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి మద్రాసు వీధుల్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిరంజీవి ఆనాడు పరిశ్రమలో దిగ్గజ హీరోల హవా నడుస్తున్న సమయంలో కేవలం తన అద్వితీయమైన నటన, అద్భుతమైన డ్యాన్స్ శైలి, ఫైట్లలో సరికొత్త వేగంతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ‘పునాదిరాళ్లు’తో తన కెరీర్కి పునాది వేసుకున్న చిరంజీవి సుప్రీం హీరోగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొంది మెగాస్టార్గా రూపాంతరం చెంది ఇప్పుడు ఒక్క కంటిసైగతో యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరుకున్నారు. నేడు (ఆగస్టు 22) చిరంజీవి తన 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మెగాస్టార్ పుట్టినరోజంటే కోట్లాది మంది అభిమానులకు ఒక పండుగ రోజు.ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన చిరంజీవికి చిన్న వయసు నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో యుక్త వయసు రాగానే మద్రాస్ చేరుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1978లో "పునాదిరాళ్ళు", "ప్రాణం ఖరీదు" చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలన్గా, సహాయ నటుడిగా, యాంటీ హీరోగా వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన "మనవూరి పాండవులు", కె. విశ్వనాథ్ గారి "శుభలేఖ" లాంటి చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి.ఖైదీతో సంచలనం1983లో విడుదలైన "ఖైదీ" చిత్రం తెలుగు చిత్రసీమ గమనాన్ని మార్చేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా, చిరంజీవిని మాస్ హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. చిరంజీవి రాకతో తెలుగు సినిమాల్లో యాక్షన్ శైలి మారింది
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభంకావడంతో ప్రయాణికులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భోగాపురానికి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.. వీరి కోసం ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్ వే బస్సుల్ని నడుపుతోంది. విశాఖ నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఒక బస్సును నడిపేలా ప్లాన్ చేశారు.. అయితే విశాఖపట్నంలో ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.విశాఖపట్నంలో ఎనిమిది ప్రాంతాల్లో బస్ బేలు నిర్మించబోతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే బస్ బేలలో ఏసీ సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఉండేలా చూస్తామన్నారు. మంత్రి విశాఖపట్నం హుడా పార్క్ నుంచి ఏరో ఎక్స్ప్రెస్ బస్సులో భోగాపురం విమానాశ్రయం వరకు ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రయాణం చేశారు. ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు నిర్ణీత సమయం ప్రకారం నడుస్తున్నాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.ఈ బస్సుల్లో ప్రస్తుతం ప్రయాణ సమయం 1.40 గంటలు పడుతోందని.. రాబోయే రోజుల్లో ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు మంత్రి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని.. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతందన్నారు. ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు లగేజీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.విశాఖపట్నం నుంచి ఎలక్ట్రిక్ బస్సులో విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన బస్స్టాండ్, చార్జింగ్ స్టేషన్ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి కల్పించిన ఆర్టీసీ రవాణా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి అరగంటకు ఒక ఎలక్ట్రిక్ బస్సును నడుపుతున్నట్లు
మీ అక్క బతికి ఉన్నన్నిరోజులు నన్ను బాగా చూసుకుంది.. అయినా మీ అక్కని చంపినందుకు ఈ నారాయణ జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా.. అయినా నీకు మీ అక్క పిల్లలు అంటే ప్రేమ లేదా? అని తాయారు అంటుంది. ఇప్పుడు ఈ చంపుకోవడం లాంటివి వద్దు అని అంటుంది. మామయ్య.. మేం చిన్నప్పటి నుంచి ఏ దిక్కు లేకుండా బతికాం. మా అందరినీ చూసి పై నుంచి అమ్మ ఆత్మ ఎంత బాధ పడి ఉంటుందో అని పెద్ది అంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ కూడా లేదు.. ఇప్పుడు నాన్నకి దూరం చేస్తారా? అని మహా అడుగుతుంది. వీడు నాకు ప్రాణ భిక్ష పెట్టడం ఏంటి.. అని నారాయణ పైపైకి వెళ్తుంటాడు. మా అక్క చూసి మిమ్మల్ని.. మీ మొహం చూసి ఈ నారాయణను ఇప్పుడు వదిలేస్తున్నా.. ఈ పగ మాత్రం చల్లారలేదు.. నీ చావంటూ ఉంటే.. అది నా చేతుల్లోనే అని దుర్గ ప్రసాద్ అంటాడు. దీంతో నారాయణ గొడవకు వెళ్తుంటాడు. అందరూ కలిసి నారాయణను బయటకు తీసుకు వస్తారు. కారులో అందరూ హైదరాబాద్కు రిటర్న్ అవుతారు.కేరింగ్గా చూసుకున్న మహా.. కారులో కూర్చున్న నారాయణని కన్నా టచ్ చేస్తాడు. అబ్బ.. దెబ్బలు బాగా తగిలాయ్ రా అని అంటాడు. నీకు ఎలా ఉంది రా అన్ని కేశవ అడిగితే.. ఇవన్నీ నాకు అలవాటు అయ్యాయ్ కదరా అని చక్రి అంటాడు. ఇక దారిలో మెడికల్ షాప్ చూసి కారు ఆపండి అని మహా అంటుంది. చక్రి చేతిని పట్టుకుని ఆయింట్ మెంట్ రాస్తుంది. అమ్మ అని చక్రి అరుస్తుంటే.. మీరేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా? అని మహా అంటుంది. షర్ట్ బటన్స్ విప్పండి.. బ్యాక్ సైడ్, షోల్డర్ మీద రాస్తాను అని మహా అంటుంది. నాకు సిగ్గు అండి అంటూ మెలికలు తిరుగుతుంటాడు చక్రి.మళ్లీ వద్దాం.. వాళ్లని తిడదాం, కొడదాం