
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు 6 రోజుల పాటు...
© 2026 nimisham.in

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు 6 రోజుల పాటు...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు 6 రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద భక్తులకు అందించే ఎస్ఎస్డీ టోకెన్లు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. అయితే టోకెన్ లేకుండానే భక్తులు నేరుగా తిరుమలలోని క్యూలైన్లలో చేరి శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించింది. ఎస్ఎస్డీ టోకెన్ల జారీని సెప్టెంబర్ 20 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 21 దర్శనానికి సంబంధించిన టోకెన్లు కూడా 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది అధికమాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. సెప్టెంబర్ 14 సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం మీన లగ్నంలో 6.21 గంటల నుంచి 6.35 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాహన సేవలు ఉంటాయి. సెప్టెంబర్ 19న గరుడ సేవ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 22న రథోత్సవం, సెప్టెంబర్ 23న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సెప్టెంబర్ 12న ఒక్కరోజే 81,724 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రొటోకాల్ మినహా), వృద్ధులు, దివ్యాంగులు, శిశువులతో వచ్చిన తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల ప్రత్యేక దర్శనాలు, పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. సీఎంతో పాటు ప్రముఖుల హాజరు సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం మాడ వీధుల్లో పెద్ద శేష వాహన సేవను దర్శించుకోనున్నారు. మంత్రి నారా లోకేశ్ సహా కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు. బుధవారం తిరుమలలో సుమారు రూ.300 కోట్ల విలువైన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, అన్నప్రసాదం వంటి అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు అధికారిక అప్డేట్లను పరిశీలించి ప్రయాణం చేసుకోవాలని సూచించింది.
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






