
ప్రకాశం జిల్లా పొదిలిలో వినాయక చవితి వేడుకల్లో అపూర్వ మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం దంపతులు షేక్ రబ్బాని గణేష్ విగ్రహాన్ని సమకూర్చి, శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికులను ఆకట్టుకోవడమే కాకుండా, మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనన్న సందేశాన్ని చాటింది. సోదరభావాన్ని చాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.




